Jogi Ramesh: ఆ రాయి చంద్రబాబు వేయించుకున్నదే…!!
- By hashtagu Published Date - 09:50 PM, Fri - 4 November 22
ఏపీ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో టీడీపీ అధినేత కాన్వాయ్ పై రాళ్లదాడితో మరోసారి ఏపీలో ఉద్రికత్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘటనపై టీడీపీ అధికార పార్టీపై తీవ్రంగా మండిపడుతోంది. అయితే ప్రతిపక్షానికి దీటుగా అధికారపార్టీ బదులిచ్చింది. చంద్రబాబు తన కాన్వాయ్ పై తాను రాయి విసిరించుకున్నారని మంత్రి జోగురమేశ్ ఆరోపించారు. ఇది చంద్రబాబు ఆడుతున్న కొత్త నాటకం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఈ ఘటనలో సెక్యూరిటీ ఆఫీసర్ కు గాయాలు కావడం బాధకరమన్నారు. ఈ ఘటనకు కారణమైన చంద్రబాబు సెక్యూరిటీ ఆఫీసర్ కు క్షమాపణ చెప్పాల్సిందే అన్నారు. వచ్చే ఎన్నికల్లో అభ్యర్థులను పోటీలో దింపే ధైర్యం చంద్రబాబు ఉందా అంటూ ప్రశ్నించారు. తాను సీఎం అభ్యర్థినని చెప్పే దమ్ము పవన్ కల్యాణ్ కు ఉందా అని నిలదీశారు. పొత్తులతోనే అధికారంలోకి రావాలని చంద్రబాబు ప్రయత్నిస్తు్నారని… అది సాధ్యం కాని పని అని అన్నారు.
Related News
AIMIM Chief: ఏపీ రాజకీయాలపై ఒవైసీ జోస్యం.. జగన్ కు జైకొట్టిన ఎంఐఎం చీఫ్
AIMIM Chief: ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ గెలిస్తే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముస్లింలకు రిజర్వేషన్లు కొనసాగిస్తారని ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ అన్నారు.బీజేపీ నేతృత్వంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీఏ)తో చేతులు కలిపిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ లకు ప్రజలు గుణపాఠం చెబుతారని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. ఎన్నికల ప్రచారం