HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Minister Gottipati Ravi Kumar Key Comments On The Increase In Current Charges

Current charges : క‌రెంట్‌ ఛార్జీల పెంపుపై మంత్రి గొట్టిపాటి ర‌వి కుమార్ కీల‌క వ్యాఖ్యలు

కరెంట్ ఛార్జీల పెంపు విషయంపై వెలుసిపోయిన ప్రచారాలపై స్పందించిన ఆయన ఏ పరిస్థితుల్లోనూ విద్యుత్ ఛార్జీలు పెంచే ఉద్దేశ్యం మా ప్రభుత్వానికి లేదు" అని స్పష్టం చేశారు. ప్రజల్లో భయం, గందరగోళం కలిగించేందుకు కొంతమంది కావాలని అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు.

  • Author : Latha Suma Date : 12-05-2025 - 1:27 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Minister Gottipati Ravi Kumar key comments on the increase in current charges
Minister Gottipati Ravi Kumar key comments on the increase in current charges

Current charges : గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్‌లో కరెంట్ ఛార్జీలు పెంచుతున్నారనే వార్తలు పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి. దీంతో గృహ వినియోగదారుల్లో ఆందోళన నెలకొంది. ఇప్పటికే విద్యుత్ బిల్లులు గణనీయంగా పెరిగాయంటూ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తుండగా, మరోసారి ధరలు పెరిగితే ఎలా అని వారు భయపడుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తాజా ప్రకటన చేశారు. కరెంట్ ఛార్జీల పెంపు విషయంపై వెలుసిపోయిన ప్రచారాలపై స్పందించిన ఆయన ఏ పరిస్థితుల్లోనూ విద్యుత్ ఛార్జీలు పెంచే ఉద్దేశ్యం మా ప్రభుత్వానికి లేదు” అని స్పష్టం చేశారు. ప్రజల్లో భయం, గందరగోళం కలిగించేందుకు కొంతమంది కావాలని అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. ముఖ్యంగా యాక్సిస్ గ్రూప్ ఫీల్డ్ ఎనర్జీపై తప్పుడు వార్తలు వ్యాపించాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది పూర్తిగా ప్రభుత్వాన్ని విమర్శించేందుకు చేసిన దుష్ప్రచారమేనని మంత్రి మండిపడ్డారు.

Read Also: International Nurses Day : వైద్య‌రంగంలో న‌ర్సుల సేవ‌లు వెల‌క‌ట్ట‌లేనివి : డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్

ప్రభుత్వం ప్రజలకు నాణ్యమైన, సరసమైన ధరలో విద్యుత్‌ను అందించేందుకు కట్టుబడి ఉందని మంత్రి తెలిపారు. ఈ క్రమంలో ప్రకాశం జిల్లాలో పునరుత్పత్తి విద్యుత్ (రిన్యూవబుల్ ఎనర్జీ) ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇస్తున్నట్టు చెప్పారు. “పీక్ అవర్స్‌లో కూడా కేవలం రూ.4.60 కే విద్యుత్ సరఫరా చేసేలా ఒప్పందాలు కుదుర్చుకున్నాం. ఇది ప్రజలకు తక్కువ ధరకే నిరంతర విద్యుత్ సరఫరా ఇవ్వడానికి తీసుకున్న ముందడుగు” అని ఆయన వివరించారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు అసత్య ప్రచారాలను నమ్మవద్దని, అధికారిక సమాచారం ఆధారంగా మాత్రమే విశ్వసించాలంటూ మంత్రి గొట్టిపాటి విజ్ఞప్తి చేశారు. విద్యుత్ రంగంలో ఆధునీకరణ, పారదర్శకత, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవడమే ప్రభుత్వ ధ్యేయమని తెలిపారు. ఏపీ ప్రజలకు భరోసా ఇచ్చేలా మంత్రి వ్యాఖ్యలు ఉండగా, కరెంట్ ఛార్జీల పెంపు వార్తలపై ఒక స్థాయిలో క్లారిటీ వచ్చినట్లైంది.

Read Also: AP Govt : జూన్ లో ఏపీ ప్రజలకు డబ్బులే డబ్బులు..ఎలా అనుకుంటున్నారా..?

 

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap
  • Current charges
  • electricity charges hike
  • Minister Gottipati Ravi Kumar

Related News

Bhogi Mantalu

భోగి మంటలు విషయంలో జాగ్రత్తలు అవసరం !

పూర్వం భోగి మంటలంటే పాత సామాన్లు, ఎండుటాకులు, చెక్క ముక్కలతో వేసేవారు. కానీ నేడు ఆధునిక జీవనశైలిలో భాగంగా టైర్లు, ప్లాస్టిక్ కవర్లు, పాత ఫ్లెక్సీలు వంటి ప్రమాదకరమైన వస్తువులను మంటల్లో వేయడం

  • 2026 Central Budget

    కేంద్ర బడ్జెట్ పైనే ఏపీ ఆశలన్నీ, మరి న్యాయం జరిగేనా?

  • Sajjala

    రాజధానిగా అమరావతే కరెక్ట్ – మాట మార్చిన సజ్జల రామకృష్ణ రెడ్డి

  • Apsrtc Samme

    వెనక్కు తగ్గిన ఏపీఎస్ ఆర్టీసీ అద్దె బస్సుల యజమానులు, సమ్మె విరమణ తో ఊపిరి పీల్చుకున్న ప్రజలు

  • Ntr Statue Amaravati

    అమరావతిలో 3500 టన్నుల కంచుతో NTR భారీ విగ్రహం

Latest News

  • జాతర కంటే ముందే మేడారంలో భక్తుల రద్దీ

  • న్యూజిలాండ్‌తో తొలి వ‌న్డే.. టీమిండియా జ‌ట్టు ఇదే!

  • రేప్ కేసులో అరెస్టైన ఎమ్మెల్యే

  • అంతర్జాతీయ ఉద్రిక్తతలు నేపథ్యంలో భారత రక్షణ బడ్జెట్ పెరుగుతుందా?

  • సంక్రాంతి కోడి పందేలను అడ్డుకోవాలంటూ హైకోర్టు ఆదేశాలు, ఇది సాధ్యమేనా?

Trending News

    • బెంగాలీ మ‌హిళ‌లు ఎక్కువ‌గా ఎరుపు- తెలుపు రంగుల చీర‌లు ఎందుకు క‌ట్టుకుంటారో తెలుసా?!

    • టీమ్ ఇండియాకు భారీ షాక్.. ప్రాక్టీస్ సెషన్‌లో రిషబ్ పంత్‌కు గాయం!

    • తెలంగాణ ఎప్‌సెట్ అభ్యర్థులకు శుభవార్త!

    • అయోధ్యలో కలకలం.. రామ్ మందిర్ ప్రాంగణంలో నమాజ్‌?!

    • ఎస్బీఐ రియల్ టైమ్ ఎక్స్‌ప్రెస్ క్రెడిట్.. 35 లక్షల వరకు పర్సనల్ లోన్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd