HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Andhra Pradesh
  • >Minister Gottipati Ravi Kumar Key Comments On The Increase In Current Charges

Current charges : క‌రెంట్‌ ఛార్జీల పెంపుపై మంత్రి గొట్టిపాటి ర‌వి కుమార్ కీల‌క వ్యాఖ్యలు

కరెంట్ ఛార్జీల పెంపు విషయంపై వెలుసిపోయిన ప్రచారాలపై స్పందించిన ఆయన ఏ పరిస్థితుల్లోనూ విద్యుత్ ఛార్జీలు పెంచే ఉద్దేశ్యం మా ప్రభుత్వానికి లేదు" అని స్పష్టం చేశారు. ప్రజల్లో భయం, గందరగోళం కలిగించేందుకు కొంతమంది కావాలని అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు.

  • By Latha Suma Published Date - 01:27 PM, Mon - 12 May 25
  • daily-hunt
Minister Gottipati Ravi Kumar key comments on the increase in current charges
Minister Gottipati Ravi Kumar key comments on the increase in current charges

Current charges : గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్‌లో కరెంట్ ఛార్జీలు పెంచుతున్నారనే వార్తలు పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి. దీంతో గృహ వినియోగదారుల్లో ఆందోళన నెలకొంది. ఇప్పటికే విద్యుత్ బిల్లులు గణనీయంగా పెరిగాయంటూ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తుండగా, మరోసారి ధరలు పెరిగితే ఎలా అని వారు భయపడుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తాజా ప్రకటన చేశారు. కరెంట్ ఛార్జీల పెంపు విషయంపై వెలుసిపోయిన ప్రచారాలపై స్పందించిన ఆయన ఏ పరిస్థితుల్లోనూ విద్యుత్ ఛార్జీలు పెంచే ఉద్దేశ్యం మా ప్రభుత్వానికి లేదు” అని స్పష్టం చేశారు. ప్రజల్లో భయం, గందరగోళం కలిగించేందుకు కొంతమంది కావాలని అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. ముఖ్యంగా యాక్సిస్ గ్రూప్ ఫీల్డ్ ఎనర్జీపై తప్పుడు వార్తలు వ్యాపించాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది పూర్తిగా ప్రభుత్వాన్ని విమర్శించేందుకు చేసిన దుష్ప్రచారమేనని మంత్రి మండిపడ్డారు.

Read Also: International Nurses Day : వైద్య‌రంగంలో న‌ర్సుల సేవ‌లు వెల‌క‌ట్ట‌లేనివి : డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్

ప్రభుత్వం ప్రజలకు నాణ్యమైన, సరసమైన ధరలో విద్యుత్‌ను అందించేందుకు కట్టుబడి ఉందని మంత్రి తెలిపారు. ఈ క్రమంలో ప్రకాశం జిల్లాలో పునరుత్పత్తి విద్యుత్ (రిన్యూవబుల్ ఎనర్జీ) ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇస్తున్నట్టు చెప్పారు. “పీక్ అవర్స్‌లో కూడా కేవలం రూ.4.60 కే విద్యుత్ సరఫరా చేసేలా ఒప్పందాలు కుదుర్చుకున్నాం. ఇది ప్రజలకు తక్కువ ధరకే నిరంతర విద్యుత్ సరఫరా ఇవ్వడానికి తీసుకున్న ముందడుగు” అని ఆయన వివరించారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు అసత్య ప్రచారాలను నమ్మవద్దని, అధికారిక సమాచారం ఆధారంగా మాత్రమే విశ్వసించాలంటూ మంత్రి గొట్టిపాటి విజ్ఞప్తి చేశారు. విద్యుత్ రంగంలో ఆధునీకరణ, పారదర్శకత, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవడమే ప్రభుత్వ ధ్యేయమని తెలిపారు. ఏపీ ప్రజలకు భరోసా ఇచ్చేలా మంత్రి వ్యాఖ్యలు ఉండగా, కరెంట్ ఛార్జీల పెంపు వార్తలపై ఒక స్థాయిలో క్లారిటీ వచ్చినట్లైంది.

Read Also: AP Govt : జూన్ లో ఏపీ ప్రజలకు డబ్బులే డబ్బులు..ఎలా అనుకుంటున్నారా..?

 

 


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap
  • Current charges
  • electricity charges hike
  • Minister Gottipati Ravi Kumar

Related News

Ap Egg

Production of Eggs : గుడ్ల ఉత్పత్తిలో ఏపీ నం.1

Production of Eggs : మాంసం ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ నాల్గవ స్థానంలో, పాల ఉత్పత్తిలో ఐదవ స్థానంలో, మరియు గేదెల ఉత్పత్తిలో ఆరవ స్థానంలో ఉందని దామోదర్ నాయుడు తెలిపారు

  • Heavy Rains

    Alert : 13న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు!

  • Ap Universal Health Policy

    Universal Health Policy : యూనివర్సల్ హెల్త్ పాలసీ పూర్తి వివరాలు!

  • New bar policy implemented in AP

    AP : ఏపీలో అమల్లోకి వచ్చిన కొత్త బార్ పాలసీ

  • Ap Assembly Sessions

    AP Assembly Sessions : వచ్చే నెల 18 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు?

Latest News

  • Lunar Eclipse: రేపే చంద్ర‌గ్ర‌హ‌ణం.. ఏ దేశాల‌పై ప్ర‌భావం అంటే?

  • BCCI: డ్రీమ్ 11తో ముగిసిన ఒప్పందం.. బీసీసీఐ రియాక్ష‌న్ ఇదే!

  • Ghaati : అనుష్క ‘ఘాటి’కి షాకింగ్ కలెక్షన్స్!

  • India – US : దిగొచ్చిన ట్రంప్..ఇక భారత్-అమెరికా వైరం ముగిసినట్లేనా?

  • Shreyas Iyer: ఆసియా క‌ప్‌కు ముందు టీమిండియా కెప్టెన్‌గా అయ్య‌ర్‌!

Trending News

    • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

    • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

    • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

    • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

    • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd