HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Ktr Eye On Ap Visakha Steel Target

KTR on AP: ఏపీ పై కేటీఆర్ కన్ను, కేంద్రంపై విశాఖ స్టీల్ అస్త్రం..!

ఏపీలోకి ఎంట్రీ ఇవ్వడానికి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశాన్ని బీఆర్ఎస్ ఎంచుకుంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం చేయడానికి సిద్ధమైన కేంద్రాన్ని టార్గెట్ చేసింది.

  • Author : CS Rao Date : 02-04-2023 - 4:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ktr And Andhra Pradesh
Ktr And Andhra Pradesh

KTR on AP : ఏపీలోకి ఎంట్రీ ఇవ్వడానికి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశాన్ని BRS ఎంచుకుంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం చేయడానికి సిద్ధమైన కేంద్రాన్ని టార్గెట్ చేసింది. అవసరమైతే గ్లోబల్ టెండర్ లో పాల్గొని కేంద్రం వాటాలను రాష్ట్రం కొనుగోలు చేస్తుందని జగన్మోహన్ రెడ్డి సర్కార్ కార్మికులకు హామీ ఇచ్చింది. ఇప్పుడు మంత్రి KTR రంగంలోకి దిగారు. ప్రైవేటీకరణ కు వ్యతిరేకంగా కేంద్రానికి లేఖ రాశారు. సీఎం కేసీఆర్ బదులుగా మంత్రి కేటీఆర్ లేఖ రాయడం గమనార్హం. రాబోవు రోజుల్లో విశాఖ స్టీల్ ప్లాంట్ మీద మరింతగా పోరాడేందుకు ఈ లేఖ అస్త్రంగా ఉపయోగ పడనుంది. పబ్లిక్ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేస్తున్న కేంద్రంపై బీఆర్ఎస్ ఇప్పటికే పలు వేదికలపై నిలదీసింది. ప్రత్యేకించి విశాఖ స్టీల్ ప్లాంట్ ఇష్యూ ఏపీలో రాజకీయంగా రాచమార్గాన బీఆర్ఎస్ రావడానికి అవకాశం ఏర్పడింది. మంత్రి KTR రాసిన లేఖ కార్మికులను ఆలోచింప చేస్తూఉంది.

అందుకే విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ అంశాన్ని మంత్రి కేటీఆర్ భుజానికి ఎత్తుకున్నారు. ఫక్తు రాజకీయ పార్టీగా BRS ఉందని ఎప్పుడో కేసీఆర్ చెప్పారు. అంటే విశాఖ స్టీల్ అంశంలో ఏదో రాజకీయం లేదా షేర్ తీసుకోవడానికి ప్లాన్ చేస్తుందని కల్వకుంట్ల కుటుంబం గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా అనుమానిస్తారు.

స్టీల్ ప్లాంట్‎కు అవసరమైన ప్రత్యేక ఐరన్ వోర్ గనులను కేటాయించకుండా కేంద్రం మోకాలడ్డిందని కేటీఆర్ (KTR) పేర్కొన్నారు. దీంతో వైజాగ్ స్టీల్ ప్లాంట్ తన ఉత్పత్తి ఖర్చులో 60% వరకు పూర్తిగా ముడి సరుకు పైనే ఖర్చు చేయాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తంచేశారు. మరోవైపు ప్రైవేట్ కంపెనీలకు ఇబ్బడి ముబ్బడిగా ఐరన్ వోర్, బొగ్గు, ఇతర గనులను కేటాయించడం వల్ల వారి ఉత్పత్తిలో ముడి సరుకుల ఖర్చు కేవలం 40% లోపలనే ఉన్నదని చెప్పారు.

పెద్ద ఎత్తున ముడి సరుకు పైనే ఖర్చు చేయాల్సి రావడంతో.. వైజాగ్ స్టీల్ ప్లాంట్ మార్కెట్లో ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీలతో ఉత్పత్తి విషయంలో పోటీపడటంలో కొత్త సవాళ్లను ఎదుర్కొంటోందని విశ్లేషించారు. మార్కెట్లో వాటితో సమాన ధరకు అమ్మాల్సి రావడంతో నష్టాలను ఎదుర్కొంటుందన్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్‎ను అంతిమంగా నష్టాల్లోకి నెట్టాలన్న కేంద్ర ప్రభుత్వ కుట్ర ఇందులో స్పష్టంగా కనిపిస్తుందని దుయ్యబట్టారు.

స్టీల్ ప్లాంటును ప్రైవేటుపరం చేయడాన్ని వ్యతిరేకిస్తూ కేంద్రానికి మంత్రి కేటీఆర్ లేఖ రాసారు. తన లేఖలో కేంద్రం స్టీల్ ప్లాంట్ విషయంలో అనుసరిస్తున్న తీరును తప్పు బట్టారు. మౌలిక వసతుల ప్రాజెక్టులకు అత్యంత కీలకమైన స్టీల్ ఉత్పత్తిని పూర్తిగా ప్రైవేటుపరం చేయాలని చూడడం కేంద్ర ప్రభుత్వ నిబద్ధత లోపాన్ని తేటతెల్లం చేస్తుందని స్పష్టంచేశారు.

స్టీల్ ఉత్పత్తి రంగాన్ని నాన్ స్ట్రాటజిక్ రంగంలోకి మార్చడంలోనే కేంద్ర ప్రభుత్వం కుట్ర దాగి ఉందన్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్‏ను పూర్తిగా ప్రైవేటుపరం చేసే ముందు, దాన్ని నష్టాల పాలు చేసి వాటిని సాకుగా చూపించి లక్షల కోట్ల విలువైన ఆస్తులను అప్పనంగా ప్రైవేట్ కార్పొరేట్ మిత్రులకు అప్పజెప్పేందుకు కేంద్రం కుట్ర చేస్తుందని ఆరోపించారు.

ప్రైవేటీకరణ ప్రయత్నాలను కార్మికులు అడ్డుకుంటున్న వేళ కేంద్రం దొడ్డిదారిన ప్రైవేటుకు కట్టబెట్టే కుతంత్రానికి తెరలేపిందని పేర్కొన్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కుట్రలను బీఆర్ఎస్ వ్యతిరేకిస్తుందని KTR స్పష్టం చేసారు. స్టీల్ ప్లాంట్ కార్మికులకు సంఘీభావం తెలపాలని ఏపీ బీఆర్ఎస్ నేతలకు సూచించారు. సరిగ్గా ఇక్కడే తెలంగాణ సర్కారు అడుగులు ఎక్కడికి వెళ్తాయి అనేది చర్చనీయాంశంగా మారింది.

Also Read:  Jagan April ‘Mood’: అమ్మో జగన్, ఏప్రిల్ ‘మూడ్’ దడ


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • development
  • kcr
  • politics
  • telangana
  • Visakhapatnam Steel Plant

Related News

Maoists Khali

తెలంగాణలో పెద్ద ఎత్తున లొంగిపోయిన మావోలు

మావోయిస్టు అనే పదం ఇక వినలేం అనిపిస్తుంది. ఎందుకంటే ఎన్నో శతాబ్దాలుగా మావోయిస్టులు దేశ వ్యాప్తంగా ఉన్నప్పటికీ , ప్రస్తుతం మాత్రం మావోయిస్టులంతా లొంగిపోతున్నారు. దీనికి కారణం అగ్ర మావోయిస్టులు ఎన్కౌంటర్ లో చనిపోవడం , మరోపక్క కీలక నేతలు లొంగిపోతుండడం తో మిగతా మావోలంతా లొంగిపోతున్నారు.

  • Tgpsc Group 3 Results

    గ్రూప్-3 ఫలితాలను విడుదల చేసిన టీజీపీఎస్సీ

  • CM Chandrababu Naidu visits Delhi seeking central support for state development

    రాష్ట్రాభివృద్ధికి కేంద్ర సహకారం కోరుతూ ఢిల్లీకి సీఎం చంద్రబాబు

  • CM Revanth Leadership

    సీఎం రేవంత్ నాయ‌క‌త్వానికి బ్ర‌హ్మ‌ర‌థం!

  • Ration Shop

    రేషన్‌కార్డుదారులకు హెచ్చరిక.. E KYC చేయకపోతే సన్నబియ్యం కట్

Latest News

  • కాఫీ తాగితే న‌ష్టాలే కాదు ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు కూడా ఉన్నాయ‌ట‌!

  • 10 గ్రాముల బంగారం ధర రూ. 40 ల‌క్ష‌లా?!

  • బీహార్ సీఎం నితీష్ కుమార్‌పై ఎఫ్ఐఆర్.. కార‌ణ‌మిదే?!

  • చైనా సాయం కోరిన భార‌త్‌.. ఏ విష‌యంలో అంటే?

  • అవతార్ ఫైర్ అండ్ యాష్ రివ్యూ!

Trending News

    • ఆ కార్యక్రమంలో అవినీతి.. ప్రధాని మోదీపై జగన్ ఆరోపణలు!

    • అధిక ఐక్యూ ఉన్న వ్యక్తుల 5 ముఖ్యమైన అలవాట్లు ఇవే!

    • ఆర్‌బీఐ అన్‌లిమిటెడ్ నోట్లను ముద్రిస్తే ఏమ‌వుతుందో తెలుసా?

    • KPHB లులు మాల్‌లో నిధి అగర్వాల్‌కు చేదు అనుభవం

    • స్టాక్ మార్కెట్‌ను లాభ- న‌ష్టాల్లో న‌డిపించే 7 అంశాలివే!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd