HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >If You Speak In Favor Of Pakistan You Should Go To That Country Pawan Kalyan

Pawan Kalyan : పాక్‌కు అనుకూలంగా మాట్లాడితే ఆ దేశానికే వెళ్లిపోవాలి : పవన్‌ కల్యాణ్‌

మత ప్రాతిపదికన చంపడం సరికాదన్నారు. గతంలో పలుమార్లు పాకిస్తాన్ ను ఓడించినా వారిబుద్ధ మారలేదన్నారు. మనం మత సామరస్యం పాటిస్తూ, లౌకిక దేశంగా ఉంటే పొరుగున ఉన్న పాకిస్తాన్ మాత్రం ప్రజల మతం అడిగి మరీ కాల్పులు జరిపి హత్య చేయడం దారుణం. ఉగ్రదాడుల్లో అమరులైన వారికి నివాళి అర్పిస్తున్నాం అన్నారు.

  • Author : Latha Suma Date : 29-04-2025 - 12:36 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
If you speak in favor of Pakistan, you should go to that country: Pawan Kalyan
If you speak in favor of Pakistan, you should go to that country: Pawan Kalyan

Pawan Kalyan : జనసేన ఇటీవల జమ్ముకశ్మీర్‌లోని పహల్గాం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి మంగళగిరి సి.కె.కన్వెన్షన్‌లో హాలులో నివాళుల కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ మాట్లాడుతూ..మత ప్రాతిపదికన 26 మందిని చంపినా పాకిస్థాన్‌కు అనుకూలంగా మాట్లాడటం సరికాదని, అలా మాట్లాడాలనుకుంటే ఆ దేశానికే వెళ్లిపోవాలని అన్నారు. మత ప్రాతిపదికన చంపడం సరికాదన్నారు. గతంలో పలుమార్లు పాకిస్తాన్ ను ఓడించినా వారిబుద్ధ మారలేదన్నారు. మనం మత సామరస్యం పాటిస్తూ, లౌకిక దేశంగా ఉంటే పొరుగున ఉన్న పాకిస్తాన్ మాత్రం ప్రజల మతం అడిగి మరీ కాల్పులు జరిపి హత్య చేయడం దారుణం. ఉగ్రదాడుల్లో అమరులైన వారికి నివాళి అర్పిస్తున్నాం అన్నారు.

ఉగ్రవాద దాడిలో మృతి చెందిన శ్రీ సోమిశెట్టి మధుసూదన్ గారి కుటుంబానికి జనసేన పార్టీ తరపున రూ.50 లక్షలు విరాళం..#JSPCondemnTerror #PahalgamTerroristAttack pic.twitter.com/fap08dCCED

— JanaSena Party (@JanaSenaParty) April 29, 2025

కశ్మీర్‌ భారత్‌లో భాగమని, ఇలాంటి విషయాలపై ఓట్లు, సీట్ల కోసం మాట్లాడకూడదని చెప్పారు. ఉగ్రవాదం, హింసపై అందరూ ఒకేలా స్పందించాలన్నారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన శ్రీపొట్టి శ్రీరాములు జిల్లా కావలికి చెందిన మధుసూదన్‌రావు కుటుంబానికి పార్టీ తరఫున రూ.50లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. మధుసూదన్ ఉగ్రదాడుల్లో ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. మధుసూదర్ కుటుంబానికి జనసేన అండగా ఉంటుందని, ఏ కష్టం వచ్చిన ఆదుకుంటామన్నారు పవన్‌ కల్యాణ్‌. ఉగ్రదాడులను ఉపేక్షించేది లేదని, అది ఏ రూపంలో ఉన్నా నాశనం చేయాలన్నారు.

Kashmir is an Integral part of India.. it will be an integral part of India forever..!#JSPCondemnTerror #PahalgamTerroristAttack pic.twitter.com/j6fXakewLD

— JanaSena Party (@JanaSenaParty) April 29, 2025

హిందువులకు ఉన్న దేశం ఇదొక్కటే. ఇక్కడ కూడా ఉండొద్దంటే ఎక్కడికి పోవాలి?. యుద్ధ పరిస్థితులు వచ్చినా సిద్ధంగా ఉండాలి. మత కలహాలు సృష్టించే వారిపై అప్రమత్తంగా ఉండి ఎదుర్కోవాలి అని పవన్‌ కల్యాణ్‌ అన్నారు. సత్యం మాట్లాడాలంటే చాలా ధైర్యం కావాలి. చనిపోయిన మధుసూదన్‌రావు ఎవరికి హాని చేశారు?. కుటుంబాన్ని తీసుకొని కశ్మీర్‌కు వెళ్తే చంపేశారు. కశ్మీర్‌ మనది కాబట్టే అక్కడికి వెళ్లామని మధు భార్య చెప్పారని పవన్‌ కళ్యాణ్‌ అన్నారు. కాగా, పహల్గాం దాడికి పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదమే కారణమని భారత్‌ స్పష్టం చేసింది. పాకిస్తాన్ తో దౌత్య సంబంధాలను రద్దు చేసుకుంది. దీనికి సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. అప్పటినుంచి పాకిస్తాన్ మంత్రులు , నేతలతో పాటు అక్కడి మీడియా కూడా భారత దేశంపై అక్కసు వెళ్లగక్కుతోంది. భారత సైన్యానికి వ్యతిరేకంగా పలువురు పాక్ నేతలు, సెలబ్రిటీలు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పాక్‌కు చెందిన 16 యూట్యూబ్‌ ఛానళ్లపై కేంద్రం నిషేధం విధించింది. ఇందులో మాజీ పేసర్ షోయిబ్ అక్తర్ చానెల్ కూడా ఉంది.

Read Also: Pak Army : నిద్రలేని రాత్రులు గడుపుతున్న పాక్ ఆర్మీ


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Jammu and Kashmir
  • Janasena
  • Pahalgam Terror Attack
  • pakistan
  • Pawan Kalyan

Related News

Pawan Janasena2

జనసేనతో పొత్తు అవసరం లేదు – బీజేపీ స్పష్టం

మున్సిపల్ ఎన్నికల్లో జనసేనతో BJPకి పొత్తు అవసరం లేదని ఆ పార్టీ రాష్ట్ర చీఫ్ రాంచందర్ రావు తెలిపారు. రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతామన్నారు. APలో పరిణామాల ఆధారంగానే కూటమి ఏర్పాటైందని, ఇక్కడ తాము బలంగా ఉన్నట్లు

  • Jana Sena to contest in Telangana municipal elections

    తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికల్లో జనసేన పోటీ

  • Pawan Dimsa Dancce

    సంక్రాంతి వేడుకలు : ధింసా నృత్యం చేసిన పవన్ కళ్యాణ్

  • VPN Services

    వీపీఎన్ సేవ‌ల‌పై జమ్మూ కాశ్మీర్ యంత్రాంగం నిషేధం!

  • Sakshi Vaidya

    పవన్ ఉస్తాద్‌ భగత్‌సింగ్‌.. ఆ కారణంగానే మూవీ వద్దు అన్నాను : సాక్షి వైద్య

Latest News

  • పల్లీలతో స్నాక్స్ ఆరోగ్యానికి మేలా? నష్టమా?.. నిపుణుల సూచనలు ఇవే..!

  • సంక్రాంతి రద్దీకి భారీ ఏర్పాట్లు..చర్లపల్లి–అనకాపల్లి మధ్య ప్రత్యేక రైళ్లు

  • అమెజాన్ ‘గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2026’..ఎప్పటినుంచంటే?

  • ఐసిస్‌పై అమెరికా మెరుపు దాడులు: ఉగ్రవాదానికి గట్టి హెచ్చరిక

  • మూత్రపిండాల ప్రాధాన్యత ఏమిటి?..సమస్యలను సూచించే ముందస్తు లక్షణాలివే..!

Trending News

    • సచిన్ టెండూల్కర్‌ను అధిగమించిన విరాట్ కోహ్లీ!

    • రోహిత్ శర్మ ప్రపంచ రికార్డు.. అంతర్జాతీయ క్రికెట్‌లో 650 సిక్సర్లు బాదిన తొలి ఆటగాడిగా చరిత్ర!

    • చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ.. ప్రపంచంలోనే రెండో అత్యుత్తమ బ్యాటర్‌గా గుర్తింపు!

    • నేడు వామికా కోహ్లీ పుట్టినరోజు.. విరాట్-అనుష్కల కుమార్తె పేరు వెనుక ఉన్న అర్థం ఏమిటి?

    • రోహిత్, విరాట్ కోహ్లీ టీ20ల‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించ‌డం మంచిదే: మాజీ క్రికెట‌ర్‌

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd