TTD : టీటీడీ చరిత్రలో తొలిసారిగా ఒకే రోజు అత్యధిక విరాళాలు!
ఏడుకొండలవాడా వెంకటరమణా ఆపదమొక్కులవాడా శ్రీనివాసా వడ్డీ కాసులవాడా గోవిందా గోవింద.. అంటూ భక్తితో తిరుమల గిరులు మారుమోగుతాయి
- By Hashtag U Published Date - 01:12 PM, Tue - 7 June 22
ఏడుకొండలవాడా వెంకటరమణా ఆపదమొక్కులవాడా శ్రీనివాసా వడ్డీ కాసులవాడా గోవిందా గోవింద.. అంటూ భక్తితో తిరుమల గిరులు మారుమోగుతాయి. ఆ కలియుగ దైవాన్ని ఒక్కసారైనా కనులారా తృప్తిగా దర్శించుకోవాలని చాలామంది కోరుకుంటారు. అందుకే వ్యయప్రయాసలకోర్చి.. దూరాభారాలను లెక్కచేయకుండా ఎక్కడెక్కడి నుంచో భక్తులు వస్తారు. స్వామివారిని దర్శించుకుంటారు. తమ మొక్కులను చెల్లించుకుంటారు. ఇంకా వీలైతే స్వామివారికి అదనంగా తృణమో ఫణమో సమర్పించుకుంటారు. అలా తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలోనే తొలిసారిగా శ్రీవారికి అత్యధిక స్థాయిలో రోజువారీ ఆదాయం విరాళాల రూపంలో వచ్చింది.
తమిళనాడుకు చెందిన భక్తులు స్వామివారికి ఒకేరోజు రూ.10 కోట్లను విరాళంగా ఇచ్చారు. టీటీడీ చరిత్రలో ఒకేరోజు ఇంత భారీ మొత్తంలో విరాళం అందడం ఇదే తొలిసారి అని అధికారులు అన్నారు. తమిళనాడులోని తిరునల్వేలి వాసి అయిన గోపాల బాలకృష్ణన్ అనే భక్తుడు టీటీడీ నిర్వహిస్తున్న అన్నదానంతోపాటు 7 ట్రస్టులకు తనవంతు విరాళంగా రూ.7 కోట్లను ఇచ్చారు. దీంతో ఒకేరోజు స్వామివారికి భారీమొత్తం విరాళం సమకూరడానికి ఇది దోహదపడింది.
బాలకృష్ణ ఫ్యూయల్ స్టేషన్ సంస్థ.. శ్రీవాణి ట్రస్టుకు రూ.కోటి, సీహబ్ ఇన్ స్పెక్షన్ సర్వీసెస్ సంస్థ.. ఎస్పీ వేద పరిరక్షణ ట్రస్టుకు రూ.కోటి, ఏ స్టార్ టెస్టింగ్ అండ్ ఇన్ స్పెక్షన్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థ రూ.కోటి లను విరాళంగా అందజేశాయి. తిరుమలలో టీటీడీ కార్యాలయంలో జేఈఓ ధర్మారెడ్డికి దీనికి సంబంధించిన చెక్కులను భక్తులు అందించారు. కొండపై స్వామివారి దర్శనం కోసం కొవిడ్ తరువాత భక్తుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది.
Tags
Related News
TTD: 2024 మే 16న తిరుపతిలో వార్షిక ఉత్సవాలు ప్రారంభం
TTD: తిరుపతి శ్రీగోవిందరాజస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు గురువారం ఉదయం 8.15 గంటల నుంచి 8.40 గంటల వరకు పవిత్ర మిథున లగ్నంలో వేదపండితుల మంత్రోచ్ఛారణలు, సంగీత వాయిద్యాల మధ్య గరుడ ధ్వజపథం ఎగురవేయడంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. పూర్వం శ్రీ గోవిందరాజస్వామి, గరుడ ధ్వజపథం, చక్రత్తాళ్వార్, పరివార దేవతలు బంగారు తిరుచ్చిపై నాలుగు మాడ వీధుల్లో ప్రదక్షిణలు చేశారు. ఉదయం ఉత్సవ దేవతలకు స్నపన �