Rain Alert: ఏపీ భారీ వర్షాలు..
- Author : Vamsi Chowdary Korata
Date : 22-06-2026 - 10:00 IST
Published By : Hashtagu Telugu Desk
ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో ఇవాళ మేఘావృతమైన వాతావరణంతో పాటు చెదురుమదురుగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్నారు. అలాగే మిగతా జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వానలు పడే అవకాశం ఉందని తెలిపారు. పిడుగులు పడే అవకాశం ఉందనే అంచనాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఉరుములు, పిడుగుల సమయంలో చెట్ల కింద నిలబడవద్దని.. భారీ హోర్డింగ్స్, విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని ప్రజలను హెచ్చరించారు.
ఆదివారం పలు జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరికలు జారీ చేశారు. పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్తో అక్కడక్కడా పిడుగులతో కూడిన మోస్తరు వానలు పడ్డాయి. మచిలీపట్నం, ఏలూరు, నర్సాపురం, దివిసీమ, గుడివాడ, భీమడోలు పరిసర ప్రాంతాల్లో పిడుగుపాటు హెచ్చరికలు జారీ చేశారు. కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చారు.. పిడుగులతో తేలికపాటి వర్షాలు కురిశాయి. అలాగే ఆదివారం పలు జిల్లాల్లో వానలు పడ్డాయి. ఉరుములు, పిడుగుల సమయంలో చెట్ల కింద నిలబడవద్దని ప్రజలను హెచ్చరించింది. భారీ హోర్డింగ్స్, విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని సూచించింది.
విద్యుత్ వైర్లు తెగిపడే అవకాశం ఉందని, వాటికి దూరంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. రైతులు, కూలీలు, పశువుల కాపరులు పిడుగులు పడే అవకాశం ఉందని.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. వర్షాలు, ఈదురుగాలుల వీచ్చే ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. పిడుగులు పడే అవకాశం ఉందని.. అవసరమైతేనే బయటకు రావాలని, వర్షాల సమయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ప్రజలు వాతావరణ పరిస్థితులపై ఎప్పటికప్పుడు తాజా సమాచారం తెలుసుకుని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వర్షాలు, పిడుగుల పడే సమయంలో రైతులు జాగ్రత్తగా ఉండాలి అన్నారు.