HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Government Good News For Apsrtc Employees A Dream Come True

APSRTC : ఏపీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్.. నెరవేరిన కల..!

  • By Vamsi Chowdary Korata Published Date - 12:38 PM, Tue - 2 December 25
  • daily-hunt
Apsrtc
Apsrtc

ఆర్టీసీ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త అందించింది. వారి సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టింది. నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్, ఎంప్లాయీస్ యూనియన్లను సివిల్ సర్వీసెస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్‌లో చేర్చింది. ఈ నిర్ణయంతో ఉద్యోగుల సమస్యలు త్వరగా పరిష్కారం కానున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకున్న ఈ నిర్ణయంపై ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులకు తీపికబురు చెప్పింది.. వారి సమస్యల్ని వెంటనే పరిష్కరించేందుకు చర్యలు చేపట్టింది. ఆర్టీసీ ఉద్యోగ సంఘాలను సివిల్‌ సర్వీసెస్‌ జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌లోకి తీసుకొస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సివిల్‌ సర్వీసెస్‌ జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌లోకి ఎన్‌ఎంయూఏ, ఎంప్లాయిస్‌ యూనియన్లను కౌన్సిల్‌లో చేరుస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో ఆర్టీసీ రెండు ప్రధాన సంఘాలకు కౌన్సిల్‌లో సభ్యత్వం మంజూరు చేసింది. ఈ మేరకు జీఏడీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ ఎస్ రావత్ ఉత్తర్వులు కూడా జారీ చేశారు.

సివిల్ సర్వీసెస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్‌లో ఆర్టీసీ ఉద్యోగ సంఘాలకు సభ్యత్వం లభించడంతో ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు త్వరగా పరిష్కారం కానున్నాయి. ప్రభుత్వ ఉద్యోగ సంఘాలతో జరిగే చర్చల్లో ఆర్టీసీ ఉద్యోగులు కూడా పాల్గొనే అవకాశం దక్కింది. ఉద్యోగుల సర్వీస్ నిబంధనలు, ప్రమోషన్లు వంటి విషయాలపై తమ అభిప్రాయాలను, సమస్యలను సంఘాల నాయకులు ప్రభుత్వానికి చెప్పగలరు. ఇది ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమానికి ఎంతో మేలు చేస్తుందని భావిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నిర్ణయం తీసుకోవడం పట్ల ఆర్టీసీ ఉద్యోగ సంఘాల నాయకులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయంపై ఎన్‌ఎంయూఏ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు.. ఈయూ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సభ్యత్వం ద్వారా ఆర్టీసీ ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారం లభిస్తుందని వారు ఆశిస్తున్నారు.

గతంలో ప్రభుత్వం నేషనల్‌ మజ్దూర్‌ యూనిటీ అసోసియేషన్‌ (ఎన్‌ఎంయూఏ), ఎంప్లాయీస్‌ యూనియన్‌ (ఈయూ) సంఘాలను గుర్తించింది. అయితే తమకు రాష్ట్రస్థాయి జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌లో సభ్యత్వం కల్పించాలని రెండు సంఘాలు కోరాయి. స్టాఫ్ కౌన్సిల్‌లో సభ్యత్వం కల్పిస్తే.. ఆర్టీసీ ఉద్యోగులు వారి సమస్యలు, మిగిలిన అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేందుకు వీలు ఉంటుందని రిక్వెస్ట్ చేశారు. ఏపీ ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగ సంఘాల వినతుల్ని పరిగణనలోకి తీసుకుంది. ఈ రెండు సంఘాలకు సభ్యత్వం కల్పించింది.

మరోవైపు ఏపీఎస్‌ఆర్టీసీ ఆస్తుల తనఖా ఆలోచనను విరమించుకోవాలని సీపీఐ కోరింది. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య లేఖ రాశారు. ఆర్టీసీకి చెందిన విలువైన భూములు, భవనాలు, డిపోలు, ఇతర స్థిరాస్తులను కార్పొరేట్‌ కంపెనీలకు లీజు, తనఖాకు ఇవ్వాలనే ప్రతిపాదనను విరమించుకోండి. రోడ్ల మరమ్మతుల కోసం ఆర్టీసీ ఆస్తులను తనఖా పెట్టాలనే నిర్ణయం ప్రజా రవాణా వ్యవస్థను నిర్వీర్యం చేస్తుంది’ అంటూ లేఖలో ఈశ్వరయ్య ప్రస్తావించారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని వెంటనే విరమించుకోవాలని కోరారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh government
  • AP CM Chandrababu
  • apsrtc
  • Apsrtc Unions
  • civil services
  • Staff Council

Related News

Cbn

Andhrapradesh : ఏపీ సమగ్రాభివృద్ధి కోసం కొత్త స్కెచ్.. చంద్రబాబు మాస్టర్ ప్లాన్.!

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మరో ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధి కోసం ప్రత్యేక జోన్లు ఏర్పాటు చేయనున్నట్లు సీఎం చంద్రబాబు మీడియాతో చిట్ చాట్ సందర్భంగా వెల్లడించారు. మూడు ప్రాంతాల అభివృద్ధికి జోన్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. అన్ని ప్రాంతాల సమాన అభివృద్ధే తమ ప్రభుత్వ లక్ష్యమని చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఇక రాజధాని రైతుల సమస్యలు

  • Ap Govt Ehs

    Andhra Pradesh Government : ఏపీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్..ఆరోగ్య కార్డుల సమస్యలకు ఇక చెక్!

  • Amaravati Ttd Temple

    Amaravati TTD Temple : కృష్ణమ్మకు నిత్య హారతి.. కళ్లు చెదిరేలా టీటీడీ ఆలయం.. సీఎం చంద్రబాబు ప్లాన్‌ ఇదే!

  • Chandrababu

    Fibernet Case Against Chandrababu Closed : చంద్రబాబుపై ఫైబర్ నెట్ కేసు క్లోజ్.!

  • Mla Yarlagadda Venkata Rao

    Yarlagadda Venkata Rao : గన్నవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే యార్లగడ్డ వినూత్న ఆలోచనకు శ్రీకారం!

Latest News

  • Kantara Controversy: క్షమాపణలు చెప్పిన రణవీర్ సింగ్

  • Apple’s New Vice President Of AI : ఆపిల్ కొత్త AI వైస్ ప్రెసిడెంట్ గా అమర్ సుబ్రమణ్య

  • IPL 2026 : ఐపీఎల్‌ అభిమానులకు షాక్ ఇచ్చిన మ్యాక్స్‌వెల్

  • APSRTC : ఏపీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్.. నెరవేరిన కల..!

  • IBOMMA Case : iBOMMA రవికి 14 రోజుల రిమాండ్

Trending News

    • AP CM Chandrababu Naidu : చంద్రబాబుపై అవినీతి కేసులు కొట్టేసిన హైకోర్టు..!

    • Hardik Pandya: టీమిండియాకు గుడ్ న్యూస్‌.. ఫిట్‌గా స్టార్ ప్లేయ‌ర్‌!

    • Raj Nidimoru : సమంత రెండో భర్త రాజ్ నిడిమోరు బ్యాక్‌గ్రౌండ్ తెలుసా!

    • Rent Agreement Rules 2025 : అద్దెకు ఉండేవారిపై కొత్త రూల్స్.. రూ.1 లక్ష ఫైన్..7 ఏళ్ల జైలు?

    • Elon Musk: ఎలాన్ మ‌స్క్ కొడుకుకి భారతీయ శాస్త్రవేత్త పేరు!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd