HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Good News From The Center For Ap Rs 765 Crore Investment Good News For The Youth

Andhra Pradesh : ఏపీకి కేంద్రం శుభవార్త.. రూ. 765 కోట్ల పెట్టుబడులు.. యువతకు గుడ్ న్యూస్.!

  • Author : Vamsi Chowdary Korata Date : 28-10-2025 - 11:20 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Central Minister Ashwini Va
Central Minister Ashwini Va

ఏపీకి కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. ఎలక్ట్రానిక్స్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ కాంపోనెంట్‌ పథకం కింద.. రూ. 5,532 కోట్లతో చేపట్టే ఏడు యూనిట్లలో.. ఒక యూనిట్ ఏపీకి రానున్నట్లు తెలిపారు. అందులో భాగంగా సైర్మా కంపెనీ ఏపీలో రూ.765 కోట్లతో మల్టీ లేయర్ ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డు యూనిట్ ఏర్పాటు చేయనుంది. దీని ద్వారా ప్రత్యక్షంగా దాదాపు వెయ్యి మందికి ఉద్యోగాలు లభిస్తాయని కేంద్రం తెలిపింది. మిగతా యూనిట్లు తమిళనాడు, మధ్యప్రదేశ్‌లో నెలకొల్పనున్నారు.

ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఎలక్ట్రానిక్స్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ కాంపోనెంట్‌ పథకం కింద చేపట్టే ఏడు ప్రాజెక్టులో ఒకటి ఏపీలో ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ ఏడు ప్రాజెక్టులను మూడు రాష్ట్రాల్లో రూ. 5,532 కోట్లతో కేంద్రం ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీశాఖ ఆమోదముద్ర వేసిందని.. కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ వెల్లడించారు. ఏడు ప్రాజెక్టుల్లో మొత్తం రూ.36,559 కోట్ల విలువైన ఉత్పత్తులు తయారు అవుతాయని చెప్పారు. ఈ ప్రాజెక్టు వల్ల 5,195 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు లభిస్తాయని.. పరోక్షంగా అనేక మంది ఉపాధి పొందుతారని తెలిపారు.

ఆంధ్రప్రదేశ్‌లో సైర్మా స్ట్రాటెజిక్‌ ఎలక్ట్రానిక్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ అనే కంపెనీ రూ.765 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు అశ్వనీ వైష్ణవ్ వెల్లడించారు. మల్టీ లేయర్‌ ప్రింటెండ్‌ సర్క్యూట్‌ బోర్డు తయారుచేసే యూనిట్‌ ఏర్పాటు చేయనుందని చెప్పారు. ఈ పరిశ్రమలో మొత్తం రూ.6,933 కోట్ల విలువైన ఉత్పత్తులు తయారుకానున్నాయి. ప్రత్యక్షంగా 955మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నట్లు అంచనాలు ఉన్నాయి. కాగా, ఏపీలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ఇటీవల రియలన్స్ సంస్థ ముందుకు వచ్చింది.

ఎలక్ట్రానిక్స్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ కాంపోనెంట్‌ పథకం కింద దేశంలో యూనిట్ల ఏర్పాటు చేయడానికి.. మొత్తం 249 అప్లికేషన్లు వచ్చినట్లు మంత్రి అశ్వనీ వైష్ణవ్ తెలిపారు. దాదాపు రూ.1.15 లక్షల కోట్లు పెట్టుబడితో.. రూ.10.34 లక్షల కోట్ల విలువైన ఉత్పత్తులు తయారు చేయడానికి ఈ కంపెనీలు ముందుకు వచ్చినట్లు తెలిపారు. భారత ప్రభుత్వం చేసే విధానాలపై కాన్ఫిడెన్స్‌కు ఇది నిదర్శనం అని మంత్రి అన్నారు. ఎలక్ట్రానిక్ తయారీ చైన్‌లను దేశీయంగా అభివృద్ధి చేసుకోవడం ఎంత అవసరమో.. కంపెనీల ఉత్సాహమే చెబుతోందన్నారు. ఈ మొత్తం పెట్టుబడుల వల్ల దాదాపు 1.42 లక్షల మందికి ఉపాధి కలుగుతుందన్నారు. అయితే అందులో ప్రస్తుతానికి రూ.5,500 కోట్ల పెట్టుబడులకు మాత్రమే ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు.

సైర్మా కాకుండా.. కేనెస్‌ సర్క్యూట్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ అనే కంపెనీ తమిళనాడులో నాలుగు యూనిట్లు ఏర్పాటు చేయనుంది. ఇక అస్సెంట్‌ సర్క్యూట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ నెలకొల్పనున్న మరో యూనిట్‌‌తో కలిపి మొత్తం రూ.4,271 కోట్ల పెట్టుబడితో 5 యూనిట్లు తమిళనాడులో ఏర్పాటు కానున్నాయి. ఇక ఏడో యూనిట్‌ను మధ్యప్రదేశ్‌లో.. ఎస్‌ఆర్‌ఎఫ్‌ లిమిటెడ్‌ అనే మరో సంస్థ రూ.496 కోట్లతో ఏర్పాటు చేయనుంది. కాగా, ఈ యూనిట్ల ద్వారా దేశీయంగా కాపర్‌క్లాడ్‌ లామినేట్‌ 100 శాతం, పీసీబీకి 20 శాతం, కెమెరా మాడ్యూల్స్‌లో ఉన్న 15 శాతం డిమాండ్‌ను అందుకోవచ్చని అశ్వినీవైష్ణవ్‌ వివరించారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Aamaravathi
  • andhra pradesh
  • Ashwini Vaishnav
  • central government
  • chandrababu

Related News

CM Chandrababu's Remarks at the 7th Phase Collectors' Conference

Chandrababu: 7వ విడత కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు

సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో 7వ కలెక్టర్ల కాన్ఫరెన్స్ గురువారం సచివాలయంలో ప్రారంభమైంది. రాష్ట్ర పాలనలో కీలకమైన ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్, మంత్రులు, జిల్లాల కలెక్టర్లు, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సదస్సు ప్రారంభంలో ‘బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు దక్కించుకున్నందుకు ముఖ్యమంత్రికి మంత్రులు, అధికారులు స్టాండింగ్ ఓవ

  • Nara Lokesh

    Nara Lokesh: లోకేశ్ ఆసక్తికర ట్వీట్..

  • Ex Union Minister Maneka Gandhi Letter to Chandrababu Naidu

    చంద్రబాబుకు మేనకా గాంధీ లేఖ.. గంగమ్మ జాతరలో జంతు బలులు ఆపండి

  • DRDO Aircraft Manufacturing Center in Andhra Pradesh

    DRDO: ఏపీలో రూ.15,000 కోట్లతో డీఆర్‌డీవో ఎయిర్‌క్రాఫ్ట్‌ల తయారీ భారీ ప్రాజెక్ట్

  • Andhra Pradesh

    ఏపీకి మరో భారీ పరిశ్రమ

Latest News

  • Purchase of Grain : ధాన్యం కొనుగోలుపై ఎమ్మెల్యే ‘రోహిత్ ‘ కీలక ఆదేశాలు

  • Rice Purchases : కలెక్టర్ నిర్లక్ష్యం.. మెదక్ జిల్లాలో గాలికి వదిలేసిన ధాన్యం కొనుగోళ్లు

  • ‘Birla New’ : విజయవాడలో మెగా స్టోర్ ప్రారంభం

  • Rangpur Plant : వనపర్తి ABD యూనిట్‌కు రాష్ట్ర ప్రభుత్వ అవార్డు

  • Lakshmi: మీ ఇల్లు లక్ష్మీనివాసంగా మారాలంటే… స్త్రీలు ఈ విధంగా చేయాలి..!!

Trending News

    • Kamal Haasan: గవర్నర్ పై కమల్ హాసన్ ఆగ్రహం

    • CM Vijay Thalapathy: సీఎం విజయ్‌ కి ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్..!

    • Tamil Nadu Politics: తమిళనాడు రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. గవర్నర్‌తో మరోసారి విజయ్ భేటీ

    • AIADMK: విజయ్ కు మద్దతు ఇచ్చేది లేదన్న అన్నాడీఎంకే

    • BREAKING: ప్రభుత్వ ఏర్పాటులో విజయ్ కు బిగ్ షాక్ ఇచ్చిన గవర్నర్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd