HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Good News For Those Going To Godavari Pushkarams Out In 15 Minutes

Godavari Pushkaralu 2027 : గోదావరి పుష్కరాలకు వెళ్లే వారికి గుడ్ న్యూస్ ..15 నిమిషాల్లో బయటకి.!

  • Author : Vamsi Chowdary Korata Date : 01-12-2025 - 10:50 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Godavari Pushkaralu 2027
Godavari Pushkaralu 2027

రాష్ట్రంలో గోదావరి పుష్కరాలు నిర్వహించడానికి సన్నాహాలు మొదలయ్యాయి. 2027 జూన్ 26 నుంచి జులై 7 వరకు గోదావరి పుష్కరాలు నిర్వహించాలని.. ఆగమ, వైదిక పండితులు సూచించిన నేపథ్యంలో.. రాజమహేంద్రవరంలో పుష్కర ఘాట్‌ల ఏర్పాట్లు కోసం కసరత్తు ప్రారంభించారు. ఈ పుష్కరాలకు 7 నుంచి 8 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా వేశారు. పుష్కరాల నిర్వహణకు రూ. 5,704 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు.

భారతదేశంలో నదులకు ప్రముఖ స్థానం ఉంది. ఈ నదులకు ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలు వస్తాయి. తెలుగు రాష్ట్రాల్లో క‌ృష్ణా, గోదావరి నదుల పుష్కరాలను ఘనంగా నిర్వహిస్తారు. ఈ క్రమంలో.. వచ్చే గోదావరి పుష్కరాల  తేదీలను ఆగమ, వైదిక పండితులు సూచించారు. 2027 జూన్ 26 నుంచి జులై 7 వరకు గోదావరి పుష్కరాలను నిర్వహించాలని చెప్పారు. ఈ నివేదికను ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ ఇటీవల ప్రభుత్వానికి పంపించింది. ఈ నేపథ్యంలో పుష్కరాల నిర్వహణకు సంబంధించిన పనులపై కరసత్తు ప్రారంభించారు.

గోదావరి పుష్కరాల తేదీలను పండితులు చెప్పిన నేపథ్యంలో రాజమహేంద్రవరంతోపాటు తూర్పుగోదావరి జిల్లాలో చేపట్టనున్న పనులపై అధికారులు కసరత్తు మొదలుపెట్టారు. ఈ పుష్కరాలకు 7 నుంచి 8 కోట్ల మంది భక్తుల వస్తారని అంచనా వేస్తున్నారు. ఇక ప్రత్యేక రోజుల్లో గరిష్ఠంగా 75 వేల మంది వరకు వస్తారని అనుకుంటున్నారు. భక్తుల రద్దీ నియంత్రణ, యాత్రికుల భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ.. ప్రతి ఘాట్‌లో 50 మీటర్లకు ఒక కంపార్ట్‌మెంట్‌ ఏర్పాటు చేయాలని అధికారులు భావిస్తున్నారు. ప్రతి కంపార్ట్‌మెంట్‌లో 10 సామాజిక మరుగుదొడ్లు, రెండు దుస్తులు మార్చుకునే గదులు, 6 వాటర్‌ ఏటీఎంలు ఏర్పాటు చేయనున్నారు.

ప్రతి కంపార్ట్‌మెంట్‌లో 18 గంటల్లో 44,928 మంది పుణ్యస్నానం చేస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. అందులో రద్దీని దృష్టిలో ఉంచుకుని గోదావరి నదికి ఇరు వైపులా.. 7.06 కిలో మీటర్ల మేర 97 ఘాట్‌లు నిర్మించనున్నారు. అందులో తూర్పువైపు 4.93 కిలోమీటర్ల పరిధిలో 45 ఘాట్‌లు సిద్ధం చేయనున్నారు. కాగా, పుష్కరాలకు పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున.. అన్ని శాఖల సమన్వయంతో పనులు చేపట్టాలని ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. మంత్రుల కమిటీ, వివిధ శాఖల కార్యదర్శులతో కమిటీలను ఏర్పాటు చేసింది.

ఇప్పటికే అధికారులు పుష్కరాలకు సంబంధించి కసరత్తు మొదలుపెట్టారు. పుష్కరాల కోసం వివిధ పనులు చేపట్టడానికి తూర్పు గోదావరి జిల్లా పరిధిలో 16 శాఖలు రూ. 5,704 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశాయి. ఈ మేరకు రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి కందుల దుర్గేష్, రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి.. పుష్కరాల పనులపై చర్చించేందుకు అధికారులతో సమావేశం నిర్వహించారు. రానున్న గోదావరి పుష్కరాలను.. అన్ని శాఖల సమన్వయంతో సమర్థంగా నిర్వహించేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు. కొత్త సంవత్సరంలో పుష్కర పనులకు మొదలుపెడతామని తెలిపారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Andhrapradesh
  • AP CM Chandrababu Naidu
  • Ghats Construction
  • Godavari pushkaralu 2027 date
  • rajahmundry
  • Rajahmundry Godavari Pushkaralu

Related News

Durga Temple

విజయవాడ దుర్గగుడికి విద్యుత్ సరఫరా నిలిపివేత.!

Kanaka Durga Temple : విజయవాడ దుర్గ గుడికి కరెంట్ బిల్లు బకాయిలు చెల్లించలేదంటూ విద్యుత్ సరఫరా నిలిపివేశారు. ఏపీసీపీడీసీఎల్ అధికారులు శనివారం ఈ చర్యలు తీసుకున్నారు. విజయవాడ దుర్గ గుడి దేవస్థానం రూ.3.08 కోట్లు విద్యుత్ బిల్లులు బకాయిలు ఉందని.. ఈ విషయమై పలుమార్లు దేవస్థానం దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేదని విద్యుత్ శాఖ అధికారులు చెప్తున్నారు. మరోవైపు జనరేటర్ల ద్వారా ప్రత్యామ్నాయ

  • Guntakal Rail Over Rail Bri

    ఏపీలో మరో రైల్ ఓవర్ రైల్ బ్రిడ్జి నిర్మాణం

  • Andhra Pradesh Government V

    బీఎల్‌వోల వార్షిక పారితోషికం రెట్టింపు చేసిన ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సీఈవో వివేక్ యాదవ్!

  • Apsrtc Cargo Parcel

    ఇంటికే ఆర్టీసీ కార్గో సేవలు..ఏపీ గవర్నమెంట్ నిర్ణయం!

  • Anna Canteens

    ఏపీ గవర్నమెంట్ గుడ్ న్యూస్.. సంక్రాంతికి గ్రామాల్లోనూ అన్న క్యాంటీన్లు!

Latest News

  • ఆరోగ్యకరమైన నిద్రకు ఏ వైపు తిరిగి పడుకోవాలి?

  • వైరల్ అవుతున్న చరణ్, ధోని, సల్మాన్ ఫోటో ఇదే!

  • మన్ కీ బాత్ 129వ ఎపిసోడ్.. 2025లో విజయాలు, భారత్ గర్వించదగ్గ క్షణాలీవే!

  • టీమిండియాకు గుడ్ న్యూస్‌.. జ‌ట్టులోకి స్టార్ ఆట‌గాడు!

  • జార్ఖండ్‌ను వణికిస్తున్న చలి పులి.. 7 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ!

Trending News

    • పీఎం కిసాన్ పథకం.. ఒకే కుటుంబంలో ఎంతమందికి లబ్ధి చేకూరుతుంది?

    • జనవరి 2026 నుండి మారనున్న 10 కీలక నిబంధనలీవే!

    • గౌతమ్ గంభీర్ ఉద్వాసనపై బీసీసీఐ స్పష్టత.. ఆ వార్తల్లో నిజం లేదు!

    • మీ క్రెడిట్ కార్డ్ వాడకం మీ లోన్ అర్హతను దెబ్బతీస్తోందా?

    • టెస్ట్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ ఔట్‌?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd