HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Four Ias Who Were Relieved From Telangana Reported In Ap

IAS officers : ఏపీలో రిపోర్టు చేసిన నలుగురు ఐఏఎస్‌లు..త్వరలో పోస్టింగ్‌లు..!

IAS officers : అయితే తెలంగాణ ప్రభుత్వం .. వారిని హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసి తీర్పు వచ్చే వరకూ రిలీవ్ చేయలేదు. కోర్టు వారి పిటిషన్ కొట్టి వేసిన తర్వాత రిలీవింగ్ ఆర్డర్స్ ఇచ్చింది. రిలీవ్ చేయడానికి పది, పదిహేను రోజుల సమయం కావాలని ప్రభుత్వం కోర్టుకు చెప్పినా సానుకూల నిర్ణయం రాలేదు.

  • Author : Latha Suma Date : 17-10-2024 - 5:38 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Four-IAS-Who-Were-Relieved-From-Telangana-Reported-In-Ap
Four-IAS-Who-Were-Relieved-From-Telangana-Reported-In-Ap

Reported in AP : తెలంగాణలోనే కొనసాగేందుకు చేసిన అన్ని ప్రయత్నాలూ విఫలం కావడంతో తెలంగాణలో రిలీవ్ అయిన ఐఏఎస్ అధికారులు ఏపీలో రిపోర్టు చేశారు. ఏపీ సచివాలయానికి వచ్చిన వారు సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్‌కు తమ జాయినింగ్ రిపోర్టు ఇచ్చారు. త్వరలోనే వారికి పోస్టింగులు ఇచ్చే అవకాశం ఉంది. కాట అమ్రపాలి, రోనాల్డ్ రాస్, వాణి ప్రసాద్, వాకాటి అరుణ ఏపీలో రిపోర్టు చేశారు. వాస్తవానికి వీరంతా పదహారో తేదీనే ఏపీలో రిపోర్టు చేయాల్సి ఉంది. ఆ తేదీనే ఫైనల్ చేస్తూ.. డీవోపీటీ ఆదేశాలు జారీ చేసింది.

అయితే తెలంగాణ ప్రభుత్వం .. వారిని హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసి తీర్పు వచ్చే వరకూ రిలీవ్ చేయలేదు. కోర్టు వారి పిటిషన్ కొట్టి వేసిన తర్వాత రిలీవింగ్ ఆర్డర్స్ ఇచ్చింది. రిలీవ్ చేయడానికి పది, పదిహేను రోజుల సమయం కావాలని ప్రభుత్వం కోర్టుకు చెప్పినా సానుకూల నిర్ణయం రాలేదు. డీవోపీటీ ఉత్తర్వుల విషయంలో తాము జోక్యం చేసుకునేది లేదని స్పష్టం చేసింది. దీంతో వారు ఏపీలో రిపోర్టు చేయక తప్పలేదు. మరో వైపు ఏపీ నుంచి ముగ్గురు ఐఏఎస్ అధికారులు డీవోపీటీ ఉత్తర్వుల మేరకు తెలంగాణలో బుధవారమే రిపోర్టు చేశారు.

రాష్ట్ర విభజన తర్వాత క్యాడర్ విభజన సమయంలో ప్రత్యూష్ సిన్హా కమిటీ ఐఏఎస్‌లకు విభజించింది. తెలంగాణ క్యాడర్ కేటాయించిన కొంత మంది.. ఏపీ కేడర్ కేటాయించిన కొంత మంది ఈ కేటాయింపు సరి కాదని క్యాట్ లో పిటిషన్లు వేయడంతో పాటు న్యాయపోరాటం చేశారు. పదేళ్ల పాటు వారు కోరుకున్న రాష్ట్ర క్యాడర్ లోనే కొనసాగారు. కానీ ఇప్పుడు తుది నిర్ణయం రావడంతో వెనక్కి వెళ్లక తప్పడం లేదు. ప్రస్తుతం ఉన్న రాష్ట్రాల్లోనే కొనసాగితే కీలక పోస్టింగులు ఉంటాయని ఇప్పుడు ఏపీకి వెళ్తే పెద్దగా పట్టించుకోరన్న అభిప్రాయంతో ఉన్న రాష్ట్రాల్లోనే కొనసాగాలని అనుకున్నట్లగా తెలుస్తోంది.

తెలంగాణకు చెందిన ఐపీఎస్ అధికారులు అంజనీకమార్, అభిలాష్ బిస్త్ కూడా ఏపీలో రిపోర్టు చేయాల్సి ఉంది. వారు ఇంకా రిపోర్టు చేయలేదు. డీవోపీటీ నుంచి వారికి ఇంకా ఆదేశాలు రాలేదని చెబుతున్నారు. ఆదేశాలు వచ్చిన తర్వాత వారు కూడా ఏపీలో రిపోర్టు చేయాల్సి ఉంది. అంజనీకుమార్ గత ఎన్నికలకు ముందు వరకూ తెలంగాణలో డీజీపీగా పని చేశారు.

Read Also: Press Meet : రాష్ట్రంలో ప్రతీ నిరుద్యోగికీ ఉద్యోగం..అందరికీ ఉపాధి..మా ప్రభుత్వ ఆలోచన: సీఎం రేవంత్ రెడ్డి

 

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap
  • CS Nirab Kumar Prasad
  • IAS Officers
  • postings
  • reported
  • telangana

Related News

Maoists Khali

తెలంగాణలో పెద్ద ఎత్తున లొంగిపోయిన మావోలు

మావోయిస్టు అనే పదం ఇక వినలేం అనిపిస్తుంది. ఎందుకంటే ఎన్నో శతాబ్దాలుగా మావోయిస్టులు దేశ వ్యాప్తంగా ఉన్నప్పటికీ , ప్రస్తుతం మాత్రం మావోయిస్టులంతా లొంగిపోతున్నారు. దీనికి కారణం అగ్ర మావోయిస్టులు ఎన్కౌంటర్ లో చనిపోవడం , మరోపక్క కీలక నేతలు లొంగిపోతుండడం తో మిగతా మావోలంతా లొంగిపోతున్నారు.

  • Tgpsc Group 3 Results

    గ్రూప్-3 ఫలితాలను విడుదల చేసిన టీజీపీఎస్సీ

  • CM Revanth Leadership

    సీఎం రేవంత్ నాయ‌క‌త్వానికి బ్ర‌హ్మ‌ర‌థం!

  • Ration Shop

    రేషన్‌కార్డుదారులకు హెచ్చరిక.. E KYC చేయకపోతే సన్నబియ్యం కట్

  • CM Chandrababu Naidu participated in the Collectors' Conference on the second day

    విద్యలో జ్ఞానంతో పాటు విలువలు ముఖ్యం: కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు

Latest News

  • సౌతాఫ్రికాను చిత్తు చేసి టీ20 సిరీస్‌ను కైవ‌సం చేసుకున్న భార‌త్‌!

  • అభిషేక్ శర్మ రికార్డు బద్దలు కొట్టిన పాండ్యా!

  • జ‌గ‌న్‌కు మంత్రి స‌వాల్‌.. పీపీపీ మోడల్ అక్రమమైతే జైలుకు పంపాల‌ని!

  • టీ20 ప్రపంచకప్ 2026.. శ్రీలంక‌కు కొత్త కెప్టెన్‌!

  • ప్యారడైజ్ మూవీ నుంచి అదిరిపోయే అప్డేట్‌.. బిర్యానీ పాత్ర‌లో సంపూర్ణేష్ బాబు!

Trending News

    • 10 గ్రాముల బంగారం ధర రూ. 40 ల‌క్ష‌లా?!

    • ఆ కార్యక్రమంలో అవినీతి.. ప్రధాని మోదీపై జగన్ ఆరోపణలు!

    • అధిక ఐక్యూ ఉన్న వ్యక్తుల 5 ముఖ్యమైన అలవాట్లు ఇవే!

    • ఆర్‌బీఐ అన్‌లిమిటెడ్ నోట్లను ముద్రిస్తే ఏమ‌వుతుందో తెలుసా?

    • KPHB లులు మాల్‌లో నిధి అగర్వాల్‌కు చేదు అనుభవం

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd