HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Fiber Net Case Against Chandrababu Closed

Fibernet Case Against Chandrababu Closed : చంద్రబాబుపై ఫైబర్ నెట్ కేసు క్లోజ్.!

  • By Vamsi Chowdary Korata Published Date - 10:15 AM, Thu - 27 November 25
  • daily-hunt
Chandrababu
Chandrababu

చంద్రబాబు సహా 16 మందిపై జగన్ ప్రభుత్వ హయాంలో నమోదైన ఫైబర్‌నెట్ కేసును సీఐడీ ముగించింది. ఎలాంటి ఆర్థిక అక్రమాలు జరగలేదని, సంస్థకు నష్టం వాటిల్లలేదని నివేదికలో తేల్చింది. గతంలో ఫిర్యాదు చేసిన మాజీ ఎండీ కూడా దీనితో ఏకీభవించారు.. ఏసీబీ కోర్టుకు కూడా హాజరయ్యారు. అయితే ఈ ఫైబర్ నెట్ కేసును మూసివేయడాన్ని వైఎస్సార్‌సీపీ తప్పుబట్టింది. చంద్రబాబు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఘాటుగా విమర్శించింది.

జగన్‌ హయాంలో చంద్రబాబు సహా 16 మందిపై సీఐడీ కేసులు పెట్టింది. తాజాగా ఆ కేసును ముగించారు.. ఫైబర్‌నెట్‌లో అక్రమాలేవీ జరగలేదని.. ఫైబర్ నెట్‌ సంస్థకు ఎలాంటి ఆర్థిక నష్టం జరగలేదని సీఐడీ నివేదిక అందజేసింది. గత ప్రభుత్వ హయాంలో ఫైబర్‌నెట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌‌గా ఉన్న ఎం. మధుసూదన రెడ్డి, ప్రస్తుత మేనేజింగ్‌ డైరెక్టర్‌ గీతాంజలి శర్మ ఈ నివేదికతో తాము పూర్తిగా ఏకీభవిస్తున్నామని తెలిపారు. వీరిద్దరు బుధవారం ఏసీబీ కోర్టుకు హాజరై లిఖిత పూర్వకంగా ఈ విషయాన్ని తెలియజేశారు. దీంతో ఫైబర్ నెట్ కేసును మూసేస్తున్నట్లు రాతపూర్వకంగానూ, మౌఖికంగానూ తెలిపారు.

2014-2019 టీడీపీ ప్రభుత్వ హయాంలో.. టెర్రాసాఫ్ట్‌ సంస్థకు ఆయాచిత లబ్ధి చేకూర్చారంటూ ఆరోపణలు వచ్చాయి. గత ప్రభుత్వ హయంలో ఫైబర్‌నెట్‌ ఎండీగా ఉన్న ఎం.మధుసూదన రెడ్డి 2021 సెప్టెంబరు 11న సీఐడీకి ఫిర్యాదు చేశారు. టెర్రాసాఫ్ట్‌ సంస్థకు రూ.321 కోట్ల లబ్ధిని చేకూర్చారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. 2023లో అక్టోబర్ 11న చంద్రబాబు పేరును కూడా ఈ కేసులో చేర్చారు. ఆ సమయంలో చంద్రబాబుపై గత ప్రభుత్వం వరుసగా కేసులు పెట్టింది.. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు జైలుకు కూడా వెళ్లారు. ఆ సమయంలోనే ఈ కేసు కూడా నమోదైంది. కేంద్రం భారత్‌ నెట్‌ పథకం కింద కేంద్రం రూ.3840 కోట్లు విడుదల చేయగా.. అందులో రూ.321 కోట్లు టెర్రాసాఫ్ట్‌కు బదలాయించినట్లు ఆరోపణలు వచ్చాయి.

అయితే ఈ రూ.321 కోట్లు టెర్రాసాఫ్ట్‌కు బదలాయించినట్లు సీఐడీ నిర్ధారించలేకపోయింది. దీంతో ఫైబర్‌నెట్‌ కేసులో ఎలాంటి ఆర్థిక అక్రమాలు జరగలేదని సీఐడీ ధ్రువీకరించింది. గత ప్రభుత్వ హయాంలో ఫైబర్ నెట్ ఎండీగా పనిచేసిన మధుసూదన రెడ్డే ఇప్పుడు ఈ ఫైబర్ నెట్ కేసును క్లోజ్‌ చేసేందుకు అభ్యంతరం లేదని చెప్పారు. అక్రమాలు జరగలేదన్న సీఐడీ నివేదికతో పూర్తిగా ఏకీభవించారు. దీంతో ఈ కేసు క్లోజ్ చేసినట్లైంది. ఇదిలా ఉంటే చంద్రబాబుపై ఫైబర్ నెట్ కేసును క్లోజ్ చేయడాన్ని వైఎస్సార్‌సీపీ తప్పుబట్టింది.

చంద్రబాబు తీవ్ర అధికార దుర్వినియోగం చేస్తున్నారని గత ప్రభుత్వ హయాంలో ఏఐజీగా పనిచేసిన పొన్నవోలు సుధాకర్ రెడ్డి విమర్శించారు. అధికారాన్ని అడ్డు పెట్టుకుని అవినీతి కేసులను మాఫీ చేసుకుంటున్నారని.. ఈ కేసుల ఉపసంహరణ మీద వైఎస్సార్ సీపీ న్యాయపోరాటం చేస్తుందన్నారు. చంద్రబాబు చేస్తున్న రాజ్యాంగ విరుద్ద చర్యలపై గట్టిగా పోరాడతామన్నారు. చంద్రబాబుపై ఫైబర్ నెట్, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్, అసైన్డ్ ల్యాండ్ కేసులు కూడా ఉన్నాయన్నారు. చంద్రబాబుకు మంచి పాలన చేయమని ప్రజలు అధికారం ఇచ్చారని.. అంతేగానీ సొంత కేసులను మాఫీ చేసుకోవడానికి కాదన్నారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • AP CM Chandrababu
  • closed
  • Fiber Net Case
  • Vijayawada ACB court

Related News

Simhachalam Temple

Simhachalam Temple : మారుతున్న సింహాచల క్షేత్ర రూపురేఖలు.. మొదలైన అభివృద్ధి పనులు!

సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి పుణ్యక్షేత్రంలో పలు అభివృద్ధి పనులకు శంఖుస్థాపన జరిగింది. నాల్కో సంస్థ సీఎస్ఆర్ కింద్ ఇచ్చిన రూ. 1.58 కోట్ల నిధులతో చేపట్టిన షెడ్లకు శంఖుస్థాపన చేశారు. ఇక కోల్‌కతాకు చెందిన ఓ భక్తుడు ఇచ్చిన రూ. 45 లక్షల విరాళంతో తొలిపావంచా వద్ద నిర్మించనున్న షెడ్డుకు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు శంఖుస్థాపన చేశారు. అంతేకాకుండా రూ. 3 కోట్లతో నిర్మించ

  • Krishna Water Dispute

    Krishna Water Dispute : నీళ్లన్నీ మీకిస్తే, మా సంగతి ఏంటి.. కృష్ణా జల వివాదంపై ఏపీ తెలంగాణ వాదనలు!

  • Mla Yarlagadda Venkata Rao

    Yarlagadda Venkata Rao : గన్నవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే యార్లగడ్డ వినూత్న ఆలోచనకు శ్రీకారం!

  • Government Hospital Gannava

    Gannavaram Mla : గన్నవరం ఆరోగ్య కేంద్రాన్ని అకస్మాత్తుగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు!

  • Yarlagadda Venkata Rao

    Gannavaram : లబ్ధిదారులకు ట్రై సైకిళ్లను అందజేసిన యార్లగడ్డ వెంకట్రావు

Latest News

  • Andhra King Taluka Review : రామ్ పోతినేని ఆంధ్రా కింగ్ తాలూకా మూవీ రివ్యూ!

  • Viral: చిరు తో కొండా సురేఖ సెల్ఫీ..మెగా క్రేజ్ అంటే ఇది కదా !!

  • Group-2 Rankers : 2015 గ్రూప్-2 ర్యాంకర్లకు తెలంగాణ హైకోర్టులో ఊరట

  • Home Decor : పగలకొట్టకుండానే చిప్ప నుంచి కొబ్బరి తీసే చిట్కా, కూరగాయల్ని కూడా నిమిషాల్లో కట్ చేయొచ్చు..!

  • Shocking Incident in Russia : వామ్మో రోజుకు 10వేల క్యాలరీల ఫుడ్ తిని.. నిద్రలోనే చనిపోయాడు

Trending News

    • Fibernet Case Against Chandrababu Closed : చంద్రబాబుపై ఫైబర్ నెట్ కేసు క్లోజ్.!

    • Impress Your Crush: మీ క్రష్‌ను ఇంప్రెస్ చేయడం ఎలా?

    • Gautam Gambhir: గౌతమ్ గంభీర్ కోచింగ్‌లో టీమిండియా టెస్ట్ ఫ‌లితాలీవే!

    • WTC Points Table: సౌతాఫ్రికాతో ఓట‌మి త‌ర్వాత‌ టీమిండియాకు మ‌రో బిగ్ షాక్‌!

    • Annadata Sukhibhava : ఏపీ రైతుల అకౌంట్‌లలోకి మరో రూ.6వేలు..అచ్చెన్నాయుడు శుభవార్త !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd