HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Cm To Launch Annadata Sukhibhav Scheme Interview With Farmers Review With Activists

Chandrababu : అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రారంభించ‌నున్న‌సీఎం ..రైతులతో ముఖాముఖి, కార్యకర్తలతో సమీక్ష

ఉదయం 10.50కు “అన్నదాత సుఖీభవ” కార్యక్రమ వేదిక వద్దకు చేరుకుంటారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన రైతుల బృందంతో ముఖ్యమంత్రి ప్రత్యక్షంగా మాట్లాడతారు. వారి సమస్యలు, సూచనలు స్వయంగా విని, ప్రభుత్వం చేపడుతున్న నూతన కార్యక్రమాలపై వారికి అవగాహన కల్పిస్తారు. ఈ ముఖాముఖి అనంతరం చంద్రబాబు జిల్లా స్థాయి తెలుగుదేశం పార్టీ నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు.

  • Author : Latha Suma Date : 02-08-2025 - 10:24 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
CM to launch Annadata Sukhibhav scheme...interview with farmers, review with activists
CM to launch Annadata Sukhibhav scheme...interview with farmers, review with activists

Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం (ఆగస్టు 2) ఉదయం పలు కార్యక్రమాల్లో భాగంగా ప్రకాశం జిల్లా దర్శి మండలానికి పర్యటించనున్నారు. ముఖ్యంగా తూర్పు వీరాయపాలెం గ్రామంలో “అన్నదాత సుఖీభవ” పథకాన్ని అధికారికంగా ప్రారంభించనున్నారు. ఈ పథకం రైతుల సంక్షేమాన్ని లక్ష్యంగా పెట్టుకొని రూపొందించబడింది. ఉదయం 10 గంటలకు సీఎం చంద్రబాబు అమరావతిలోని ఉండవల్లిలోని హెలిప్యాడ్ నుంచి హెలికాప్టర్‌లో దర్శికి బయలుదేరుతారు. సుమారు 10.35 గంటలకు దర్శి రెవెన్యూ విలేజ్ వద్ద హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడ ప్రజాప్రతినిధులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ముఖ్యమంత్రి చంద్రబాబును ఘనంగా స్వాగతిస్తారు.

Read Also: US Gun Violence : అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం

అక్కడి నుంచి సీఎం 10.45 గంటలకు రోడ్డు మార్గంలో తూర్పు వీరాయపాలెం గ్రామానికి బయలుదేరుతారు. కేవలం ఐదు నిమిషాల ప్రయాణం తర్వాత, ఉదయం 10.50కు “అన్నదాత సుఖీభవ” కార్యక్రమ వేదిక వద్దకు చేరుకుంటారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన రైతుల బృందంతో ముఖ్యమంత్రి ప్రత్యక్షంగా మాట్లాడతారు. వారి సమస్యలు, సూచనలు స్వయంగా విని, ప్రభుత్వం చేపడుతున్న నూతన కార్యక్రమాలపై వారికి అవగాహన కల్పిస్తారు. ఈ ముఖాముఖి అనంతరం చంద్రబాబు జిల్లా స్థాయి తెలుగుదేశం పార్టీ నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. ఈ సమావేశం మధ్యాహ్నం 1.45 వరకు కొనసాగుతుంది. అనంతరం 1.50కి రోడ్డు మార్గంలో కాడ్రేకు బయలుదేరుతారు. అక్కడ జరిగే సమావేశంలో ఆయన గంటపాటు పాల్గొంటారు. పార్టీలో జరుగుతున్న కార్యకలాపాలు, భవిష్యత్తు కార్యాచరణపై నేతలతో చర్చిస్తారు.

సమావేశం అనంతరం మధ్యాహ్నం 2.50కి దర్శి హెలిప్యాడ్‌కు తిరిగి వెళతారు. అక్కడినుంచి మధ్యాహ్నం 3 గంటలకు హెలికాప్టర్‌లో బయలుదేరి, 3.35కి ఉండవల్లికి చేరుకుంటారు. ఈ పర్యటనలో రాష్ట్ర మంత్రులు, జిల్లాకు చెందిన శాసనసభ్యులు, పలువురు టీడీపీ నేతలు పాల్గొననున్నారు. అన్నదాత సుఖీభవ పథకం ప్రారంభోత్సవం రాష్ట్రవ్యాప్తంగా రైతుల్లో విశ్వాసాన్ని పెంపొందించేలా మారుతుందనే నమ్మకంతో పార్టీ నేతలు ఉన్నారు. ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా రైతులకు ఆర్థిక సహాయం, సాంకేతిక మద్దతు, ఉత్పత్తి ఖర్చుల భారం తగ్గించే పలు చర్యలు చేపడతామని ముఖ్యమంత్రి కార్యక్రమంలో వెల్లడించనున్నారు. రైతు సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ, ఈ పథకం ద్వారా వ్యవసాయ రంగాన్ని మరింత శక్తివంతం చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

Read Also: Encounter : కుల్గాం లో ఉగ్రవాదుల ఎన్‌కౌంటర్‌.. కొనసాగుతున్న ‘ఆపరేషన్ అఖల్’


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Annadata Sukhibhava Scheme
  • CM Chandrababu
  • darsi
  • East Veerayapalem
  • Face to face with farmers
  • farmers welfare scheme
  • review meeting

Related News

CM Chandrababu Naidu participated in the Collectors' Conference on the second day

విద్యలో జ్ఞానంతో పాటు విలువలు ముఖ్యం: కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు

రాష్ట్రంలో అమలవుతున్న ‘ముస్తాబు’ కార్యక్రమాన్ని ఇంటర్మీడియట్‌ వరకు విస్తరించాలని సీఎం సూచించారు. ప్రభుత్వ విద్యాసంస్థలతో పాటు ప్రైవేటు విద్యాసంస్థల్లోనూ ఈ కార్యక్రమాన్ని అమలు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు.

    Latest News

    • ‎బొప్పాయి వీరికి చాలా డేంజర్.. పొరపాటున తిన్నారో ఇక అంతే సంగతులు!

    • స‌రికొత్త ఫీచ‌ర్ల‌తో బజాజ్ పల్సర్ 220F.. ధ‌ర ఎంతంటే?!

    • ‎అపరాజిత టీ ఆరోగ్యానికి మంచిదే కానీ, వారు అస్సలు తాగకూడదట.. ఎవరో తెలుసా?

    • ఐపీఎల్‌లో జీతం భారీగా పెరిగిన టాప్-5 ఆటగాళ్లు వీరే!

    • ఇక పై అణు రంగంలోకి ప్రైవేట్ సంస్థలు.. లోక్‌సభలో ‘శాంతి ’ బిల్లుకు ఆమోదం

    Trending News

      • స్టాక్ మార్కెట్‌ను లాభ- న‌ష్టాల్లో న‌డిపించే 7 అంశాలివే!

      • మీరు ఆధార్ కార్డును ఆన్‌లైన్‌లో స్వయంగా అప్డేట్ చేసుకోండిలా!

      • తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం.. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తెలంగాణ స్పీకర్ సంచలన తీర్పు

      • అమెరికాలో ట్రంప్ ‘ట్రావెల్ బాన్’ ప్రకంపనలు.. మరో 7 దేశాలపై పూర్తి నిషేధం

      • ఐపీఎల్ మినీ వేలం.. అమ్ముడుపోని ప్రముఖ ఆటగాళ్లు వీరే!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd