HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Cm Chandrababu Visits Achyutapuram Victims

CM Chandrababu : అచ్యుతాపురం బాధితులకు సీఎం చంద్రబాబు పరామర్శ..గాయపడిన వారికి రూ.50లక్షలు

ఈ ఘోర దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రూ. 1 కోటి చొప్పున, తీవ్రంగా గాయపడిన వారి కుటుంబాలకు రూ. 50 లక్షలు, స్వల్పంగా గాయడిన వారికి రూ. 25 లక్షలు చొప్పున ఇస్తున్నాం. భవిష్యత్ లోను బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం.

  • Author : Latha Suma Date : 22-08-2024 - 1:42 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Cm Chandrababu Visits Achyu
CM Chandrababu visits Achyutapuram victims

CM Chandrababu: అచ్చుతాపురం సెజ్ ఫార్మా కంపెనీ ప్రమాద బాధితులను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పరామర్శించారు. ఎసెన్షియా ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలి గాయాపడిన కొందరు కార్మికలకు విశాఖ మెడికవర్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ మేరకు సీఎం చంద్రబాబు అక్కడికి వెళ్లారు. వార్డుల్లో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. ఎవరికి ఏం కాదని, ధైర్యంగా ఉండాలని బాధితులకు చంద్రబాబు ధైర్యం చెప్పారు. వారికి అందిస్తున్న వైద్య చికిత్సపైనా ఆరా తీశారు.

ఏం భ‌య‌ప‌డొద్దు… బాధితుల‌కు సీఎం భరోసా! ఈ ఘోర దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రూ. 1 కోటి చొప్పున, తీవ్ర గాయాల పాలైన వారికి 50లక్ష‌లు. స్వ‌ల్ప గాయాల పాలైన‌ వారికి 25ల‌క్ష‌ల స‌హ‌యం.. అచ్యుతాపురం బాధితుల కుటుంబ స‌భ్యుల‌తో చంద్ర‌బాబు భేటీ…#chandrababu #Anakapalli pic.twitter.com/rAjdgTq4jM

— Hashtag U (@HashtaguIn) August 22, 2024

We’re now on WhatsApp. Click to Join.

బాధితులు పూర్తిగా రికవరీ అయ్యే వరకూ చికిత్స అందించాలని వైద్యులకు సూచించారు. అలాగే బాధిత కుటుంబాలను ఆయన పరామర్శించారు. తమ వారికి ఎలాంటి ప్రమాదం జరగదని, త్వరలోనే కోలుకుంటారని చంద్రబాబు భరోసా ఇచ్చారు. ప్రభుత్వం నుంచి అన్ని విధాలుగా అండగా ఉంటానని బాధిత కుటుంబాలకు చంద్రబాబు హామీ ఇచ్చారు. చికిత్స పొందుతున్న వారు పూర్తి ఆరోగ్యవంతులై తిరిగి రావాలని దేవుడిని ప్రార్ధిస్తున్నాను. ఈ ఘోర దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రూ. 1 కోటి చొప్పున, తీవ్రంగా గాయపడిన వారి కుటుంబాలకు రూ. 50 లక్షలు, స్వల్పంగా గాయడిన వారికి రూ. 25 లక్షలు చొప్పున ఇస్తున్నాం. భవిష్యత్ లోను బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం. ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన అన్ని చర్యలు తీసుకుంటామని సీఎం చంద్రబాబు తెలిపారు.

Read Also: Manda Krishna Madiga : సీఎం రేవంత్‌తో మందకృష్ణ మాదిగ భేటీ.. సీఎం ట్వీట్

మరోవైపు అచ్యుతాపురం సెజ్‌లోని ‘ఎసైన్షియా అడ్వాన్స్‌డ్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌’లో జరిగిన ప్రమాదంపై ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్(AP Deputy Chief Minister Pawan Kalyan)స్పందించారు. పరిశ్రమలలో సేఫ్టీ ఆడిటింగ్ జరపాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన చెప్పారు. అధికారంలోకి వచ్చిననాటి నుంచి పరిశ్రమలలో సేఫ్టీ ఆడిట్ చేయమని చెబుతూనే ఉన్నానని ఆయన తెలిపారు. ఈవిషయంలో కంపెనీ యాజమాన్యాలు భయపడుతున్నాయని, వాళ్లకు వివరించాల్సిన అవసరం ఉందని పవన్ అభిప్రాయపడ్డారు. గురువారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

అచ్యుతాపురం ప్రమాద బాధితుల కుటుంబాలని పరామర్శించిన చంద్రబాబు గారు. ధైర్యంగా ఉండాలని బాధితులకు భరోసా. ప్రభుత్వం అన్ని చూసుకుంటుందని, ఎంత ఖర్చు అయినా మిమ్మల్ని రక్షించుకుంటామని తెలిపిన సియం. తీవ్ర గాయాలైనవారికి రూ.50 లక్షలు చొప్పున, స్వల్ప గాయాలైన వారికి రూ.25 లక్షలు చొప్పున… pic.twitter.com/3OKvAAX5Y5

— Telugu Desam Party (@JaiTDP) August 22, 2024

”పరిశ్రమలలో సేఫ్టీ ఆడిట్ గురించి సెప్టెంబర్‌లో చర్చించాలనుకున్నాం. కానీ, ఈ నెల చివరలోనే ఈ విషయంపై కంపెనీల ప్రతినిధులతో మాట్లాడుతాను” అని పవన్ అన్నారు. సేఫ్టీ ఆడిటింగ్ జరిగితే పరిశ్రమలు మూతపడతాయోమోనని యజమానులు ఆందోళన చెందుతున్నారని, దీని గురించి వారిని ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. కనీస భద్రత కల్పించాల్సిన బాధ్యత పరిశ్రమలపై ఉందని డిప్యూటీ సీఎం అభిప్రాయపడ్డారు. ”ఎసెన్షియా అడ్వాన్స్‌డ్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట కొనసాగుతున్న ఈ రసాయనిక కర్మాగారానికి ఇద్దరు యజమానులు ఉన్నారు. వీరి మధ్యన విభేదాలు ఉండటంతో సేఫ్టీ ఆడిట్ చేయించలేదు” అని పవన్ తెలిపారు.

Read Also: MLC kavitha : బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితకు మరోసారి అస్వస్థత

 

 

 

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Atchutapuram Sez Fire Accident
  • CM Chandrababu
  • tdp

Related News

Manoj Babu

Andhra Govt to Ban Social Media : చంద్రబాబు తీసుకున్న నిర్ణయం పై మంచు హీరో రియాక్షన్

పిల్లల ఎదుగుదలలో అత్యంత కీలకమైన దశలో వారిని అనవసరమైన సామాజిక ఒత్తిళ్ల నుండి కాపాడటం సమాజం యొక్క ఉమ్మడి బాధ్యత అని మంచు మనోజ్ తన ఎక్స్ (X) ఖాతాలో పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పిల్లలు ఆటపాటలకు దూరమై

  • Weightage for employees based on performance... CM Chandrababu new policy

    AP Local Body Elections : స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు క్లారిటీ

  • Chinnivskolikapudi

    TDP : కొలికపూడి Vs చిన్ని.. దేవుడి ముందే రచ్చ!

  • Ap Bhavan

    Iran-Israel War Effect : ఏపీ భవన్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు

Latest News

  • ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026.. ప్రైజ్ మ‌నీ ఎంతో తెలుసా?

  • అమెరికా కంట్లో నలుసుగా మారిన ఐఆర్‌జీసీ కొత్త క‌మాండ‌ర్‌?!

  • ఇంధ‌న స‌ర‌ఫ‌రాపై కేంద్రం కీల‌క ప్ర‌క‌ట‌న‌!

  • మధ్యప్రాచ్యంలో టెన్ష‌న్‌.. ఆకాశాన్నంటుతున్న విమాన ధరలు!

  • ఐపీఎల్ 2026 కోసం రెడీ అవుతున్న‌ రోహిత్ శర్మ.. నెట్ ప్రాక్టీస్ వీడియో వైరల్!

Trending News

    • ఫైనల్‌లో భారత్ vs న్యూజిలాండ్.. ఐసీసీ కీల‌క ట్వీట్‌!

    • టీ20 ప్రపంచకప్ ఫైనల్.. న్యూజిలాండ్‌పై భార‌త్‌దే పైచేయి?!

    • ఏ కారు కొంటే మంచిది?!

    • ఇరాన్‌కు సాయం చేస్తున్న ర‌ష్యా?!

    • మార్చి 31లోపు ఈ ప‌నులు పూర్తి చేయాల్సిందే!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd