HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Cm Chandrababu Launches Operation Clean Sweep

Cm Chandrababu: ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సీఎం చంద్రబాబు

  • Author : Vamsi Chowdary Korata Date : 16-05-2026 - 3:34 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
CM Chandrababu launches 'Operation Clean Sweep'.
CM Chandrababu launches 'Operation Clean Sweep'.

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో జరిగిన ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ ప్రజా వేదిక కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు తన ప్రభుత్వ దార్శనికతను, భవిష్యత్ ప్రణాళికలను ఆవిష్కరించారు. తన మనసుకు దగ్గరైన నాలుగు కార్యక్రమాలే రాష్ట్ర భవిష్యత్తుకు మూలస్తంభాలని ఆయన పునరుద్ఘాటించారు. రాష్ట్రాన్ని పరిశుభ్రంగా మార్చే ‘స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర’, పేదలకు అండగా నిలిచే సంక్షేమ పథకాలు, జనాభా సమతుల్యత, భూ రికార్డుల ప్రక్షాళన తన జీవితాశయమని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ‘ఆపరేషన్ క్లీన్ స్వీప్’ అనే కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించి, రాష్ట్రాన్ని చెత్త రహితంగా మార్చే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని హామీ ఇచ్చారు.

నా జీవితాశయం ఇదే.. నాలుగు కార్యక్రమాలే నా ప్రాధాన్యం.

ప్రజల అభిమానాన్ని చూస్తుంటే ఎంత కష్టపడినా తక్కువేననిపిస్తోందని చంద్రబాబు తన ప్రసంగాన్ని ప్రారంభించారు. “నా మనసుకు దగ్గరైన నాలుగు కార్యక్రమాలు ఉన్నాయి. మొదటిది రాష్ట్రాన్ని పరిశుభ్రంగా ఉంచే స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర. రెండోది నెల మొదటి తారీఖున పేదలకు పింఛన్లు అందించి వారి బాగోగులు తెలుసుకోవడం. మూడోది జనాభా నియంత్రణ పేరుతో గతంలో జరిగిన పొరపాటును సరిదిద్ది, పిల్లల్ని సంపదగా భావించడం. అందుకే మూడో బిడ్డకు రూ.30,000, నాలుగో బిడ్డకు రూ.40,000 అందిస్తున్నాం. నాలుగోది, గొడ్డలి పార్టీ నాశనం చేసిన భూ రికార్డులను బ్లాక్‌చైన్ టెక్నాలజీతో ప్రక్షాళన చేసి, 2027 మార్చి నాటికి భూతగాదాలు లేని రాష్ట్రంగా మార్చడం” అని తన లక్ష్యాలను వివరించారు.

స్వచ్ఛాంధ్ర ఉద్యమం.. ‘ఆపరేషన్ క్లీన్ స్వీప్’ ప్రారంభం.

స్వచ్ఛాంధ్ర కార్యక్రమం 17వ సారి నిర్వహిస్తున్నామని, దీని ద్వారా రాష్ట్రంలో మార్పు కనిపిస్తోందని చంద్రబాబు అన్నారు. “స్వచ్ఛత అంటే రోడ్లు, ఇళ్లు శుభ్రంగా ఉండటమే కాదు, మన ఆలోచనలు కూడా స్వచ్ఛంగా ఉండాలి. గత ఐదేళ్లలో రాష్ట్రంలో పేరుకుపోయిన 86 లక్షల మెట్రిక్ టన్నుల లెగసీ వేస్ట్‌ను క్లియర్ చేయడానికి 23 నెలలు పట్టింది. జూన్ నాటికి రాష్ట్రంలో ఎక్కడా చెత్త లేకుండా చేసే బాధ్యత మాది” అని హామీ ఇచ్చారు.

చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాంట్లు, వ్యర్థాల సేకరణకు ‘స్వచ్ఛ రథం’, పాఠశాలల్లో ‘నెట్ జీరో’ విధానం వంటి కార్యక్రమాలను వివరించారు. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా నెల రోజుల పాటు ‘ఆపరేషన్ క్లీన్ స్వీప్’ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు.

ఉత్తరాంధ్ర నుంచి వలసలు కాదు.. ఉత్తరాంధ్రకే వలసలు రావాలి.

ఉత్తరాంధ్ర అభివృద్ధిపై చంద్రబాబు ప్రత్యేకంగా దృష్టి సారించారు. “ఒకప్పుడు దేశంలో ఏ నగరానికి వెళ్లినా శ్రీకాకుళం కాలనీ ఉండేది. ఈ పరిస్థితి మారాలి. ఉత్తరాంధ్ర నుంచి వలసలు పోవడం కాదు, ఉత్తరాంధ్రకే వలసలు రావాలి. ఇదే నా సంకల్పం” అని ఆయన స్పష్టం చేశారు.

భోగాపురం ఎయిర్‌పోర్ట్, మూలపేట పోర్ట్, డేటా సెంటర్లు, ఐటీ కంపెనీలతో ఉత్తరాంధ్ర దశ, దిశ మారుతోందన్నారు. పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులైన మధ్యవలస స్టేజ్-2, హీరమండలం ఎత్తిపోతల, వంశధార, జంఝావతి ప్రాజెక్టులను నిర్ణీత గడువులోగా పూర్తి చేస్తామని క్యాలెండర్ ప్రకటించారు. 60 ఏళ్ల కల అయిన నేరేడి బ్యారేజ్‌ను ఈ ప్రభుత్వ హయాంలోనే పూర్తి చేసి చూపిస్తామని ధీమా వ్యక్తం చేశారు.

అవార్డుల అభినందనలు.. నరసన్నపేటకు వరాలు.

జాతీయ స్థాయిలో ఉత్తమ పంచాయతీలుగా నిలిచి అవార్డులు సాధించిన అధికారులను, ప్రజాప్రతినిధులను చంద్రబాబు వేదికపై నుంచి అభినందించారు. దేశంలోనే 8 అవార్డులు సాధించి పంచాయతీరాజ్ శాఖ నంబర్ వన్‌గా నిలిచిందని కొనియాడారు. ఇదే స్ఫూర్తితో పనిచేయాలని సూచించారు.

స్థానిక ఎమ్మెల్యే రమణమూర్తి విజ్ఞప్తి మేరకు, నరసన్నపేటలోని రాజుల చెరువు ఆధునికీకరణ, ఓల్డ్ ఎన్హెచ్ రోడ్డు విస్తరణ, శ్రీముఖలింగం ఆలయ ఉత్సవాలను రాష్ట్ర పండుగగా నిర్వహించడం వంటి పలు అభివృద్ధి పనులకు అక్కడికక్కడే ఆమోదం తెలిపారు. ఎర్రన్నాయుడు పార్క్ కేసును పరిష్కరించే బాధ్యతను కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకు అప్పగించారు.

లెక్కలతోనే నా పాలన.. అధికారులకు మార్కులు, క్లాసులు.

తన ప్రసంగంలో భాగంగా ముఖ్యమంత్రి, శ్రీకాకుళం జిల్లా అధికారుల పనితీరుపై డేటాతో సహా సమీక్ష నిర్వహించారు. “50 ప్రభుత్వ సేవలపై ప్రజల సంతృప్తి రాష్ట్ర సగటు 72.96% ఉండగా, శ్రీకాకుళం జిల్లాలో 75.2% ఉండటం అభినందనీయం” అని కలెక్టర్‌ను, అధికార యంత్రాంగాన్ని ప్రశంసించారు. రీ-సర్వే, తాగునీరు, బీసీ వెల్ఫేర్ హాస్టల్స్ వంటి విభాగాల్లో మెరుగైన పనితీరు కనబరిచిన వారిని అభినందిస్తూనే, ఆర్టీసీ బస్ సర్వీసులు, గంజాయి నియంత్రణ, సీఎం రిలీఫ్ ఫండ్ అమలులో వెనుకబడిన శాఖల అధికారులను హెచ్చరించారు. పనితీరు మెరుగుపరుచుకోవాలని, ప్రజలకు జవాబుదారీగా ఉండాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

గొడ్డలి పార్టీతో జాగ్రత్త.. విధ్వంసం, అభివృద్ధికి తేడా ఇదే.

గత ప్రభుత్వ పాలనను ‘గొడ్డలి పార్టీ’గా అభివర్ణిస్తూ చంద్రబాబు తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. “అధికారం అంటే విధ్వంసం కాదు, ప్రజల జీవితాలను మార్చే అవకాశం. గత ఐదేళ్లు ప్రభుత్వ టెర్రరిజం, కబ్జాలు, అరాచకాలతో ఉత్తరాంధ్ర అభివృద్ధి కుంటుపడింది. బాబాయ్‌ని గొడ్డలితో చంపి, ఆ నింద నాపై వేసి ఎన్నికల్లో గెలిచారు. అలాంటి వారి కొత్త నాటకాలతో మళ్లీ వస్తారు, జాగ్రత్తగా ఉండాలి” అని ప్రజలను హెచ్చరించారు. విధ్వంసానికి, అభివృద్ధికి మధ్య ఉన్న తేడాను గమనించి, రాష్ట్ర భవిష్యత్తు కోసం అభివృద్ధికి అండగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • Andhra Pradesh CM Chandrababu Naidu
  • AP Panchayati Raj
  • Bhogapuram Airport
  • Operation Clean Sweep
  • Swarnandhra Swachh Andhra

Related News

'Made in Jonnagiri' gold enters the market.

Jonnagiri Gold Mine: మార్కెట్లోకి ‘మేడిన్ జొన్నగిరి’ బంగారం

మేడిన్ ఆంధ్ర బంగారం అందుబాటులోకి వచ్చింది. కర్నూలు తుగ్గలి మండలం జొన్నగిరి గోల్డ్‌మైన్స్‌ నుంచి గోల్డ్ మార్కెట్‌లోకి తీసుకొచ్చారు. జియో మైసూర్‌ సంస్థ తయారుచేసిన 50 గ్రాములు, 100 గ్రాములు, 500 గ్రాముల బిస్కెట్లు షాపుల్లో కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ మ్యాప్‌తో పాటుగా జొన్నగిరి గోల్డ్‌మైన్స్ పేరుతో ముద్ర వేశారు. ప్రస్తుతం కర్నూలులోని షరాబ్‌ బజారుకు చెందిన కొందరు వ్యాపా

  • Massive influx of students from private schools to government schools in AP.

    Nara Lokesh: ఏపీ ప్రైవేట్ స్కూళ్ల నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో భారీగా విద్యార్థుల చేరిక

  • Another major twist in the Tuni missing case: Key details revealed in the dog's post-mortem report.

    Jnaneswari: తుని మిస్సింగ్ కేసులో మరో బిగ్ ట్విస్ట్.. కుక్క పోస్ట్ మార్టం రిపోర్టులో బయటపడ్డ కీలక విషయాలు

  • AP government gives key posting to IAS officer Srilakshmi.

    IAS Srilakshmi: ఐఏఎస్ శ్రీలక్ష్మీకి ఏపీ ప్రభుత్వం కీలక పోస్టింగ్..

  • AP CM Chandrababu's funny tweet... Netizens are laughing heartily.

    CM Chandrababu Tweet: ఏపీ సీఎం చంద్రబాబు ఫన్నీ ట్వీట్.. తెగ నవ్వుతున్న నెటిజన్లు

Latest News

  • Uric acid: కీళ్ల నొప్పులు బాధిస్తున్నాయి? అయితే శరీరంలో ఇది జరిగి ఉండవచ్చు..!!

  • Lord Shiva: నీలకంఠునికి ఏ ద్రవ్యాలతో అభిషేకం చేస్తే ఫలితం ఉంటుంది?

  • Lemon Water: ఉదయాన్నే లెమన్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా..!

  • Rains: తెలంగాణకు భారీ వర్షసూచన

  • Amaravati Farmers: వైకాపా నేతల పర్యటనను అడ్డుకున్న రాజధాని రైతులు

Trending News

    • Breaking News: అంతుపట్టని మిస్టరీగా చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. రంగంలోకి క్రైమ్ టీం

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd