YS Jagan Meeting : జగన్ సభ `ఒక్క ఫోటో`వందరెట్ల అభద్రత!
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అభద్రతాభావంతో ఉన్నారా? మునుపెన్నడూ లేనివిధంగాపరదాల మాటున సభల్ని నిర్వహించడం దేనికి సంకేతం?
- By CS Rao Published Date - 02:08 PM, Tue - 22 November 22
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అభద్రతాభావంతో ఉన్నారా? మునుపెన్నడూ లేనివిధంగాపరదాల మాటున సభల్ని నిర్వహించడం దేనికి సంకేతం? బురఖాలను తొలగించి సభలోకి మహిళల్ని అనుమతించేంత అభద్రత ఉందా? అంటే ఆయన సభల్లో పోలీసులు చేస్తోన్న హడావుడి నిజమే అనేలా ఉంది. నరసాపురం సభ సందర్భంగా సోమవారంనాడు జరిగిన పరిణామాన్ని ఒక దినపత్రిక ప్రచురించింది. ఆ క్లిప్ ను టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు ట్విట్టర్ లో షేర్ చేయడంతో హల్ చల్ చేస్తోంది.
`ఇప్పటికే పరదాలు, బారికేడ్ల మధ్య పర్యటనలకు వెళుతున్న ముఖ్యమంత్రి… నల్లరంగులో ఉన్నాయని తన సభకు వచ్చిన మహిళల చున్నీలు కూడా తీయించివేయడం దారుణం. బురఖాలు వేసుకున్న ముస్లిం మహిళలను సభలోకి రానివ్వరా? గొడుగులు చూసి కూడా ఎందుకు భయం! ఇదంతా పోలీసు భద్రత కాదు… జగన్ రెడ్డి అభద్రత.` అంటూ కామెంట్ రాసి పేపర్ క్లిప్ ను చంద్రబాబు ట్విట్టర్లో షేర్ చేశారు.
ఇప్పటికే పరదాలు, బారికేడ్ల మధ్య పర్యటనలకు వెళుతున్న ముఖ్యమంత్రి… నల్లరంగులో ఉన్నాయని తన సభకు వచ్చిన మహిళల చున్నీలు కూడా తీయించివేయడం దారుణం. బురఖాలు వేసుకున్న ముస్లిం మహిళలను సభలోకి రానివ్వరా? గొడుగులు చూసి కూడా ఎందుకు భయం! ఇదంతా పోలీసు భద్రత కాదు… జగన్ రెడ్డి అభద్రత. pic.twitter.com/ohxalIqjvL
— N Chandrababu Naidu (@ncbn) November 22, 2022
పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కార్యక్రమం జరిగిన విషయం తెలిసిందే. ఆ సభ కు వద్దకు వచ్చిన మహిళల్ని అణువణువూ తడిమారు. ముస్లిం సంప్రదాయబద్ధంగా బురఖాలు వేసుకుని వచ్చిన మహిళల్ని సభలోకి రానివ్వలేదు. బురఖాలు తొలగించిన వాళ్లను మాత్రమే అనుమతించారు. బారికేడ్ల మధ్య సీఎం సభలు ఉండడం ఇటీవల చూస్తున్నాం. ఆయన పర్యటన ఉందంటే అక్కడంతా కర్ఫ్యూ వాతావరణం తలపించేలా భద్రతను ఏర్పాటు చేస్తున్నారు. సీఎం ప్రయాణించే మార్గాన్ని పరదాలతో మూసివేస్తూ స్వామిభక్తిని చాటుతున్నారు. సామాన్యులు ఎవరూ కలిసేందుకు అవకాశం లేనంతగా భద్రతను కల్పించడం సర్వసాధారణంగా మారింది. ఇలాంటి భద్రతను నరసాపురంలోనూ కల్పిస్తూ పోలీసులు మరింత ఎక్కువ చేశారు. ఈ పరిణామం స్థానిక పత్రికల్లో పతాక శీర్షికల్లా రావడం గమనార్హం. దీన్ని గమనించిన చంద్రబాబు ఆ క్లిప్ ను సోషల్ మీడియాకి ఎక్కించారు.
Also Read: CM JAGAN : తెలుగు బూతుల పార్టీ చీఫ్ లో ఆ భయం కనిపిస్తోంది: ఏపీ సీఎం జగన్..!!
`మహిళల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుపై టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శలు గుప్పించారు. ఇప్పటికే పరదాలు, బ్యారికేడ్ల మధ్య పర్యటనలకు వెళ్తున్న ముఖ్యమంత్రి… నల్లరంగులో ఉన్నాయని తన సభకు వచ్చిన మహిళల చున్నీలను కూడా తీసివేయించడం దారుణమని అన్నారు. బురఖాలు వేసుకున్న ముస్లిం మహిళలను సభలోకి రానివ్వరా? అని ఆయన ప్రశ్నించారు. గొడుగులు చూసి కూడా ఎందుకు భయమని అడిగారు. ఇదంతా పోలీసు భద్రత కాదని… జగన్ రెడ్డి అభద్రత అని ఎద్దేవా చేశారు. దీనికి సంబంధించి వార్తాపత్రికలో వచ్చిన వార్తను షేర్ చేయడంతో నెటిజన్లు కామెంట్లతో హోరెత్తిస్తున్నారు.
Related News
Anam Venkata Ramana Reddy : భారతి రెడ్డి రాళ్ల దాడి డ్రామాను రూపొందించారు
ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో ఎన్నికల ప్రచారంలో ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కాన్వాయ్పై శనివారం సాయంత్రం రాళ్లు రువ్వడంతో ఆయనకు గాయాలయ్యాయి.