CBN : చంద్రబాబు క్వాష్ పిటిషన్పై నేడు సుప్రీంకోర్టులో ప్రస్తావన
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు క్వాష్ పిటిషన్పై నేడు సుప్రీంకోర్టులో ప్రస్తావనకు రానుంది. నేడు ప్రస్తావించడానికి సీజేఐ
- By Prasad Published Date - 07:12 AM, Tue - 26 September 23
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు క్వాష్ పిటిషన్పై నేడు సుప్రీంకోర్టులో ప్రస్తావనకు రానుంది. నేడు ప్రస్తావించడానికి సీజేఐ ధర్మాసనం అనుమతి ఇచ్చింది. చంద్రబాబు రిమాండ్లో ఉన్నందున వెంటనే విచారించాలని సుప్రీంకోర్టునుచంద్రబాబు లాయర్ సిద్ధార్థ లూథ్రా కోరారు. అయితే ఈ రోజు మెన్షన్ లిస్ట్ ద్వారా రావాలని నిన్న చంద్రబాబు తరుపు లాయర్కు సీజేఐ సూచించారు. చంద్రబాబు క్వాష్ పిటిషన్ని హైకోర్టులో కొట్టివేయడంతో దానిని సవాల్ చేస్తూ చంద్రబాబు తరుపు న్యాయవాదులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. నిన్న ఈ పిటిషన్పై సీజేఐ మెన్షన్ లిస్ట్ ద్వారా ఈ రోజు(మంగళవారం) రావాలని సూచించారు. ఈ రోజు సుప్రీంకోర్టులో ఎలాంటి తీర్పు వస్తుందో అని టీడీపీ నాయకులు కార్యకర్తలు ఉత్కంఠగా ఎదురు చూస్తన్నారు. మరోవైపు ఏసీబీ కోర్టులో చంద్రబాబు బెయిల్ పిటిషన్పై నేడు విచారణ జరగనుంది. నిన్న జరిగిన వాదనలలో ఇరువర్గాల వాదనలు విన్న ఏసీబీ కోర్టు జడ్జి ఈ రోజుకు వాయిదా వేశారు. సీఐడీ తరుపు న్యాయవాదులు ముందు కస్టడీ పిటిషన్పై విచారణ చేయాలని.. ఇటు చంద్రబాబు తరుపు న్యాయవాదులు బెయిల్ పిటిషన్పై విచారణ చేయాలని వాదనలు సాగించారు. ఎంతకి తేలకపోవడంతో విచారణను ఈ రోజుకు వాయిదా వేశారు. ఈ రోజు ఏ పిటిషన్ ముందు విచారించాలో జడ్జి నిర్ణయం తీసుకోనున్నారు.
Related News
AP Election Result 2024: జగన్ vs చంద్రబాబు… ప్రజలు ఎవర్ని నమ్మారు ?
ఆంధ్రప్రదేశ్లో 175 అసెంబ్లీ స్థానాలు, 25 లోక్సభ స్థానాలకు ఏకకాలంలో ఎన్నికలు ముగిసాయి. ఈ ఎన్నికలను అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ మధ్య ఆధిపత్య పోరుగా రాజకీయ పండితులు పేర్కొంటున్నారు. 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 151 స్థానాల్లో విజయం సాధించడం గమనార్హం.