HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Chandrababu Presents Traditional Attire To The Goddess Alongside His Wife

CM Chandrababu: సతి సమేతంగా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన చంద్రబాబు

  • By Kode Mohan Sai Published Date - 04:44 PM, Wed - 9 October 24
  • daily-hunt
Cm Chandrababu Visits Durgamma Temple
Cm Chandrababu Visits Durgamma Temple

రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయదశమి శుభాకాంక్షలు తెలియజేశారు. బుధవారం, సతీసమేతంగా దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం, అమ్మవారి దర్శనానంతరం మీడియాతో మాట్లాడుతూ, “అమ్మవారి జన్మనక్షత్రం అయిన ఈ రోజు ఆమెను దర్శించుకోవడం నా అదృష్టం” అని పేర్కొన్నారు. దసరా ఉత్సవాల సందర్భంగా అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తుందని తెలిపారు. తిరుపతి తర్వాత, దుర్గగుడి రాష్ట్రంలో రెండో అతిపెద్ద దేవాలయం అని వెల్లడించారు. దేవాలయాల్లో పవిత్రతను కాపాడడం మనందరి బాధ్యత అని గుర్తుచేసారు.

ఇంద్రకీలాద్రి దుర్గగుడికి చేరుకున్న సీఎం చంద్రబాబు నాయుడు.. అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పిచిన సీఎం చంద్రబాబునాయుడు దంపతులు. #ChandrababuNaidu #TeluguDesamParty #Andrapradesh #Naralokesh #vijayawada #dasarafestival #Navaratri2024 #HashtagU pic.twitter.com/AUKPWL2T4q

— Hashtag U (@HashtaguIn) October 9, 2024

ఈసారి ఉత్సవ కమిటీ బదులుగా సేవ కమిటీని ఏర్పాటు చేశామని తెలిపారు. విజయదశమి ఉత్సవాల్లో భాగంగా, నిన్నటి వరకు 5,85,651 భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల వరకు 67,931 మంది భక్తులు అమ్మవారిని దర్శించారని వెల్లడించారు. దసరా సందర్భంగా దేవాదాయశాఖ మంచి ఏర్పాట్లు చేసిందన్నారు. ఈసారి సామాన్య భక్తులకు పెద్దపీట వేశామని, కృష్ణానదిలో అనూహ్యంగా వరద వచ్చిందన్నారు. త్వరలో అమరావతి, పోలవరం, నదుల అనుసంధానం ఉంటుందని, అమ్మ దయ వల్ల త్వరగా పూర్తి కావాలని దుర్గమ్మను కోరానన్నారు. మూలా నక్షత్రం సందర్భంగా అమ్మవారి దర్శనానికి వచ్చిన ప్రతి భక్తులకు ఉచితంగా లడ్డు ప్రసాదం అందిస్తున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు.

దుర్గమ్మ సన్నిధిలో కుటుంబ సభ్యులతో కలిసి పూజా కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు .. #NaraChandraBabuNaidu #Naralokesh #vijayawada #dasarafestival #Navaratri2024 #AndhraPradesh #HashtagU pic.twitter.com/wElYlfXwdX

— Hashtag U (@HashtaguIn) October 9, 2024

బుధవారం దుర్గమ్మ ఆలయానికి చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అక్కడి అర్చకులు మరియు దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయ చిన్న రాజగోపురం వద్ద, అర్చకులు సీఎంకు పరివేష్టం చుట్టారు. మేళతాళాల నడుమ, సీఎం సతీసమేతంగా ప్రభుత్వ తరఫున దుర్గమ్మకు పట్టువస్త్రాలను సమర్పించారు. అనంతరం, సరస్వతీ అలంకరణలో ఉన్న దుర్గమ్మను దర్శించుకున్నారు.

అంతకుముందు, ఘాట్ రోడ్డులో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ను కూడా సందర్శించారు. ఇటీవల వర్షాల కారణంగా ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్డు పరిసరాల్లో జరిగిన నష్టాలను మరియు పునరుద్ధరణ తర్వాతి పరిస్థితులను చూపించే ఫోటోలను ఈ ఎగ్జిబిషన్‌లో ప్రదర్శించారు.

ఈ కార్యక్రమంలో, సీఎం చంద్రబాబుతో పాటు మంత్రులు నారా లోకేష్, ఎంపీ కేశినేని చిన్ని, మంత్రులు కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యే సుజన చౌదరి, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సృజన, విజయవాడ నగర కమిషనర్ రాజశేఖర్ బాబు, ఆలయ ఈఓ కేఎస్ రామారావు మరియు దేవాదాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • CM Chandrababu
  • CM Chandrababu Naidu
  • Kanaka Durga Temple
  • Kanaka Durgamma Temple
  • Vijayawada Kanaka Durgamma Temple

Related News

YS Sharmila

YS Sharmila: కూటమి ప్రభుత్వంపై షర్మిల విమర్శనాస్త్రాలు!

టీటీడీ (TTD) నిధులతో టీటీడీనే గుడులు కడితే ఎవరికీ అభ్యంతరం ఉండదని షర్మిల స్పష్టం చేశారు. అయితే, టీటీడీ నిధులతో కట్టే దేవాలయాలకు స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రమోషన్ చేసుకోవడం ఏంటని ప్రశ్నించారు.

  • Andhra Pradesh

    Andhra Pradesh: భారత్‌లో పెట్టుబడులకు అత్యుత్తమ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్: సీఎం చంద్రబాబు

  • AP Government

    AP Government: ఏపీ ప్ర‌భుత్వం మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం!

  • Current Charges Down In Ap

    Good News : ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్..తగ్గనున్న కరెంట్ ఛార్జీలు

  • Ap Fee Reimbursement

    Fee Reimbursement: స్టూడెంట్స్ కు గుడ్ న్యూస్ రూ.400కోట్లు విడుదల చేసిన ఏపీ సర్కార్

Latest News

  • Putin India Visit: భార‌త్‌లో ప‌ర్య‌టించ‌నున్న ర‌ష్యా అధ్య‌క్షుడు.. ఎప్పుడంటే?

  • Dussehra: రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు ద‌స‌రా శుభాకాంక్ష‌లు తెలిపిన సీఎం రేవంత్‌, కేసీఆర్‌!

  • Black Spots: ముఖంపై నల్లటి మచ్చలు ఎందుకు వస్తాయి? కార‌ణాలివేనా?

  • RCB: ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన డీల్‌కు రంగం సిద్ధం?

  • Mahatma Gandhi: జాతిపిత గాంధీ ప్రయాణించిన చారిత్రక కార్లు ఇవే!

Trending News

    • DA Hike: ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి కానుక ప్ర‌క‌టించిన ప్ర‌భుత్వం!

    • Vijayadashami: రేపే దసరా.. విజయదశమి నాడు ఏం చేయాలి? ఏం చేయకూడదు?

    • Economic Changes: నేటి నుండి అమలులోకి వచ్చిన 6 ప్రధాన ఆర్థిక మార్పులీవే!

    • Arattai App: ట్రెండింగ్‌లో అరట్టై.. ఈ యాప్ సీఈవో సంపాద‌న ఎంతో తెలుసా?

    • Suryakumar Yadav: చ‌ర్చ‌నీయాంశంగా సూర్య‌కుమార్ యాద‌వ్ వాచ్‌.. ధ‌ర ఎంతంటే?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd