HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Chandrababu Presents Traditional Attire To The Goddess Alongside His Wife

CM Chandrababu: సతి సమేతంగా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన చంద్రబాబు

  • Author : Kode Mohan Sai Date : 09-10-2024 - 4:44 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Cm Chandrababu Visits Durgamma Temple
Cm Chandrababu Visits Durgamma Temple

రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయదశమి శుభాకాంక్షలు తెలియజేశారు. బుధవారం, సతీసమేతంగా దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం, అమ్మవారి దర్శనానంతరం మీడియాతో మాట్లాడుతూ, “అమ్మవారి జన్మనక్షత్రం అయిన ఈ రోజు ఆమెను దర్శించుకోవడం నా అదృష్టం” అని పేర్కొన్నారు. దసరా ఉత్సవాల సందర్భంగా అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తుందని తెలిపారు. తిరుపతి తర్వాత, దుర్గగుడి రాష్ట్రంలో రెండో అతిపెద్ద దేవాలయం అని వెల్లడించారు. దేవాలయాల్లో పవిత్రతను కాపాడడం మనందరి బాధ్యత అని గుర్తుచేసారు.

ఇంద్రకీలాద్రి దుర్గగుడికి చేరుకున్న సీఎం చంద్రబాబు నాయుడు.. అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పిచిన సీఎం చంద్రబాబునాయుడు దంపతులు. #ChandrababuNaidu #TeluguDesamParty #Andrapradesh #Naralokesh #vijayawada #dasarafestival #Navaratri2024 #HashtagU pic.twitter.com/AUKPWL2T4q

— Hashtag U (@HashtaguIn) October 9, 2024

ఈసారి ఉత్సవ కమిటీ బదులుగా సేవ కమిటీని ఏర్పాటు చేశామని తెలిపారు. విజయదశమి ఉత్సవాల్లో భాగంగా, నిన్నటి వరకు 5,85,651 భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల వరకు 67,931 మంది భక్తులు అమ్మవారిని దర్శించారని వెల్లడించారు. దసరా సందర్భంగా దేవాదాయశాఖ మంచి ఏర్పాట్లు చేసిందన్నారు. ఈసారి సామాన్య భక్తులకు పెద్దపీట వేశామని, కృష్ణానదిలో అనూహ్యంగా వరద వచ్చిందన్నారు. త్వరలో అమరావతి, పోలవరం, నదుల అనుసంధానం ఉంటుందని, అమ్మ దయ వల్ల త్వరగా పూర్తి కావాలని దుర్గమ్మను కోరానన్నారు. మూలా నక్షత్రం సందర్భంగా అమ్మవారి దర్శనానికి వచ్చిన ప్రతి భక్తులకు ఉచితంగా లడ్డు ప్రసాదం అందిస్తున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు.

దుర్గమ్మ సన్నిధిలో కుటుంబ సభ్యులతో కలిసి పూజా కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు .. #NaraChandraBabuNaidu #Naralokesh #vijayawada #dasarafestival #Navaratri2024 #AndhraPradesh #HashtagU pic.twitter.com/wElYlfXwdX

— Hashtag U (@HashtaguIn) October 9, 2024

బుధవారం దుర్గమ్మ ఆలయానికి చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అక్కడి అర్చకులు మరియు దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయ చిన్న రాజగోపురం వద్ద, అర్చకులు సీఎంకు పరివేష్టం చుట్టారు. మేళతాళాల నడుమ, సీఎం సతీసమేతంగా ప్రభుత్వ తరఫున దుర్గమ్మకు పట్టువస్త్రాలను సమర్పించారు. అనంతరం, సరస్వతీ అలంకరణలో ఉన్న దుర్గమ్మను దర్శించుకున్నారు.

అంతకుముందు, ఘాట్ రోడ్డులో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ను కూడా సందర్శించారు. ఇటీవల వర్షాల కారణంగా ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్డు పరిసరాల్లో జరిగిన నష్టాలను మరియు పునరుద్ధరణ తర్వాతి పరిస్థితులను చూపించే ఫోటోలను ఈ ఎగ్జిబిషన్‌లో ప్రదర్శించారు.

ఈ కార్యక్రమంలో, సీఎం చంద్రబాబుతో పాటు మంత్రులు నారా లోకేష్, ఎంపీ కేశినేని చిన్ని, మంత్రులు కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యే సుజన చౌదరి, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సృజన, విజయవాడ నగర కమిషనర్ రాజశేఖర్ బాబు, ఆలయ ఈఓ కేఎస్ రామారావు మరియు దేవాదాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • CM Chandrababu
  • CM Chandrababu Naidu
  • Kanaka Durga Temple
  • Kanaka Durgamma Temple
  • Vijayawada Kanaka Durgamma Temple

Related News

Ap Sanjeevani Scheme

త్వరలో రాష్ట్రవ్యాప్తంగా ‘సంజీవని’ – సీఎం చంద్రబాబు

రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి ఆరోగ్య వివరాలను డిజిటలైజ్ చేసి, వారి ఆరోగ్య స్థితిగతులను నిరంతరం పర్యవేక్షించేలా రూపొందించిన 'సంజీవని' ప్రాజెక్టును త్వరలో రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు

  • Cm Chandrababu & Minister N

    మహారాష్ట్రకు చంద్రబాబు, లోకేశ్

  • CM Chandrababu participated in the parliamentary committees workshop

    పార్టీ కంటే ఏదీ ముఖ్యం కాదు.. నిర్లక్ష్యం వహిస్తే వేటు తప్పదు : చంద్రబాబు వార్నింగ్

Latest News

  • అండర్-19 వరల్డ్ కప్ 2026.. పాకిస్తాన్‌పై భారత్ ఘనవిజయం!

  • టీ20 వరల్డ్ కప్ 2026.. భారత్‌తో మ్యాచ్‌ను బహిష్కరించిన పాకిస్తాన్!

  • బ‌డ్జెట్ 2026.. ఏయే రంగాల‌కు ఎంత బ‌డ్జెట్?!

  • ‘రేర్ ఎర్త్ కారిడార్’.. ఈ 4 రాష్ట్రాలనే ఎందుకు ఎంచుకున్నారు?

  • బడ్జెట్ 2026.. భారత్‌ను గ్లోబల్ డేటా & AI హబ్‌గా మార్చే దిశగా అడుగులు!

Trending News

    • విరాట్ రికార్డును సమం చేసిన సూర్య‌కుమార్ యాద‌వ్!

    • ఇన్వెస్టర్ల దెబ్బ..కుప్ప‌కూలిన బంగారం, వెండి ధ‌ర‌లు. ఇంకా తగ్గనున్నాయా.?

    • పెరుగుట విరుగుట కొరకే! అనేది బంగారం ధరలకు సరిగ్గా సరిపోతుంది !!

    • అజిత్ పవార్ హఠాన్మరణం.. మహారాష్ట్ర త‌దుప‌రి డిప్యూటీ సీఎం ఎవ‌రు?

    • విరాట్ కోహ్లీ అభిమానుల‌కు గుడ్ న్యూస్‌.. కింగ్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ పునరుద్ధరణ!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd