AP Politics: జగన్ రూట్లో బాబు.. సంక్షేమ పథకాలతో ఎన్నికలకు
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం సంక్షేమ పథకాల ద్వారా 2.54 లక్షల కోట్లు పంపిణీ చేసినట్లు గొప్పలు చెప్పుకుంటుంది. కానీ దేశంలో సొంత అధికారిక రాజధాని లేని ఏకైక రాష్ట్రంగా నిలిచింది
- By Praveen Aluthuru Published Date - 02:55 PM, Sat - 17 February 24
AP Politics: వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం సంక్షేమ పథకాల ద్వారా 2.54 లక్షల కోట్లు పంపిణీ చేసినట్లు గొప్పలు చెప్పుకుంటుంది. కానీ దేశంలో సొంత అధికారిక రాజధాని లేని ఏకైక రాష్ట్రంగా నిలిచింది. అంతే కాదు మెట్రో సిటీ లేని ఏకైక దక్షిణాది రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్గా మిగిలిపోయింది. అయితే ప్రతిపక్ష నేత చంద్రబాబు కూడా అభివృద్ధిని గాలికొదిలేసి సంక్షేమ పథకాలతోనే ఓట్లు అడిగే కార్యక్రమం పెట్టుకున్నారు.
ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు రెండు కీలక ప్రాంతీయ పార్టీల చుట్టూ తిరుగుతున్నాయి: అధికారాన్ని నిలబెట్టుకోవాలని చూస్తున్న వైఎస్ఆర్సీపి, మరియు 2014లో రాష్ట్ర విభజన తర్వాత రెండవసారి అధికారం దక్కించుకోవాలని టీడీపీ తాపత్రయపడుతున్నాయి. అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికలకు ముందు అధికార పార్టీ ప్రధానంగా సంక్షేమ బాటలోనే తన ప్రచారాన్ని నిర్వహిస్తోంది మరియు మరిన్ని సంక్షేమ పథకాలతో కొత్త మ్యానిఫెస్టో అవకాశాలను అన్వేషిస్తోంది.
మొన్నటి వరకు అభివృద్దికి పెద్దపీట వేస్తున్న ప్రతిపక్ష టీడీపీ కూడా ఇప్పుడు సంక్షేమ వాగ్దానాలతో చెలరేగడం ఆశ్చర్యకరం. ఒకవైపు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో వెనుకబడి ఉందని ఆరోపిస్తునే సంక్షేమమే ద్వేయంగా ముందుకెళ్లడం గమనార్హం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కు హైదరాబాద్కు పదేళ్ల ఉమ్మడి రాజధాని హోదా ఈ జూన్తో ముగియనుంది. దీంతో భారతదేశంలో అధికారిక రాజధాని లేని ఏకైక రాష్ట్రం మరియు మెట్రో నగరం లేని ఏకైక దక్షిణాది రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మిగిలిపోవచ్చు.
రెండు పార్టీలు ఒకరినొకరు నిందించుకుంటూ, అభివృద్ధిని విస్మరించారని కొందరు అభిప్రాయపడుతున్నారు.2019లో అధికారం చేపట్టిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజాకర్షక వాగ్దానమైన నవరత్నాల ద్వారా సంక్షేమ సంస్కరణలపై పాలన కొనసాగించారు. వాలంటీర్ వ్యవస్థను ప్రవేశపెట్టాడు.ప్రతి వాలంటీర్కు సగటున 50-70 ఇళ్లను కేటాయించారు. పథకాల నుంచి వచ్చే మొత్తాలు నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు పంపబడతాయి. ఇది జగన్ విజయంలో మెజారిటీ భాగం. గత టీడీపీ హయాంలో ఉన్న దళారుల వ్యవస్థను తాను తొలగించానని వైఎస్ జగన్ ఉద్ఘాటించారు. ఇంతకుముందు స్థానిక టీడీపీ శ్రేణులతో కూడిన జన్మభూమి ప్యానెల్లు ప్రభుత్వ పథకాలకు లబ్ధిదారుల జాబితాను నిర్ణయించేవి.
అసెంబ్లీ ఓట్-ఆన్-అకౌంట్ బడ్జెట్ సెషన్లో వైఎస్ జగన్ ఇచ్చిన ప్రజెంటేషన్ ప్రకార గత ఐదేళ్లలో 29 డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ పథకాల ద్వారా 2,54,818 కోట్లు పంపిణీ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. జనాదరణ పొందిన పథకాలలో ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లు, వృద్ధ మహిళలకు పెన్షన్లు మరియు మహిళా సహకార సంఘాలకు రుణాలు ఉన్నాయి. అదే సమయంలో ఎనిమిది పథకాలలో ప్రత్యక్ష ప్రయోజనం బదిలీ ద్వారా 1,07,898 కోట్లు పంపిణీ చేసినట్లు ఆయన పేర్కొన్నారు.ఈ ఎనిమిది పథకాలలో అణగారిన వర్గాలకు విద్యుత్ రాయితీలు, పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం, స్కూల్ కిట్ల పంపిణీ మరియు ఎనిమిదో తరగతి విద్యార్థులకు బైజూస్ లాప్ టాప్ లున్నాయి.
Also Read: Pregnant Woman Raped: గర్భిణిపై సామూహిక అత్యాచారం, దహనం
Related News
Bharathi Reddy : భారతి రెడ్డే కాదు.. నీ దగ్గర సమాధానం ఉన్న చెప్పు జగన్..?
ఏపీలో ఎన్నికల వేళ తమ వారిని గెలిపించుకునేందుకు నడుం బిగించి ప్రచారంలో పాల్గొంటున్నారు కుటుంబ సభ్యులు.