HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Andhra Pradesh
  • >Central Government Gives Green Flag To Kurnool To Visakhapatnam Railway Route

Kurnool to Vizag : కర్నూలు టు విశాఖపట్నం రైల్వే రూట్‌.. మూడు గంటల్లోనే అమరావతికి

ఈ సెమీ హైస్పీడ్‌ కారిడార్‌లో భాగంగా శంషాబాద్‌ - విశాఖపట్నం వయా సూర్యాపేట(తెలంగాణ), విజయవాడ మీదుగా రైల్వేలైన్‌ను(Kurnool to Vizag) ప్రతిపాదించారు.

  • By Pasha Published Date - 09:20 AM, Thu - 7 November 24
  • daily-hunt
Kurnool To Visakhapatnam New Railway Route

Kurnool to Vizag :  ప్రస్తుతం కర్నూలు నుంచి విశాఖపట్నానికి రైలులో వెళ్లడానికి దాదాపు 10 గంటల టైం పడుతోంది. త్వరలో కర్నూలువాసులు కేవలం నాలుగు గంటల్లో వైజాగ్‌కు చేరుకోవచ్చు. ప్రస్తుతం కర్నూలు నుంచి అమరావతికి రైలులో వెళ్లడానికి దాదాపు 6 గంటల టైం పడుతోంది. త్వరలో మూడు గంటల్లోనే అమరావతికి చేరుకోవచ్చు. అదెలా అంటే.. కర్నూలు- విశాఖపట్నం మధ్య సెమీ హైస్పీడ్‌ రైల్వే కారిడార్‌ అలైన్‌మెంట్‌ ప్రతిపాదనకు కేంద్ర రైల్వే శాఖ పచ్చజెండా ఊపింది.  దీనిలో భాగంగా రాయలసీమ ముఖద్వారం కర్నూలు – సాగర నగరం విశాఖ మధ్య కొత్త రైల్వే రూట్ ఏర్పాటు కానుంది.  రాష్ట్రంలోని ప్రధాన నగరాల మధ్య రైలు ప్రయాణ సమయాన్ని తగ్గించేందుకే కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టును చేపట్టింది. ఈ రూట్ అందుబాటులోకి వస్తే కర్నూలు ప్రాంతం పారిశ్రామిక, వాణిజ్య పరంగా డెవలప్ అవుతుంది.

Also Read :Puri Jagannath : స్టార్ హీరోతో పూరీ నెక్స్ట్ మూవీ.. మెంటర్ ఎక్కించేందుకు రెడీనా..!

ప్రాజెక్టులో ఎక్కువ భాగం తెలంగాణలోనే.. 

ఈ సెమీ హైస్పీడ్‌ కారిడార్‌లో భాగంగా శంషాబాద్‌ – విశాఖపట్నం వయా సూర్యాపేట(తెలంగాణ), విజయవాడ మీదుగా రైల్వేలైన్‌ను(Kurnool to Vizag) ప్రతిపాదించారు. ఇందులో భాగంగా విశాఖపట్నం నుంచి కర్నూలు వయా విజయవాడ, సూర్యాపేట, నల్గొండ, కల్వకుర్తి, నాగర్‌ కర్నూలు మీదుగా కర్నూలుకు మరో రైల్వే కారిడార్‌‌ను ప్రపోజ్ చేశారు. ఈ ప్రాజెక్టులో ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి మహబూబ్‌ నగర్‌ జిల్లాల్లోని ఎనిమిది రైల్వే స్టేషన్లు ఉండటం గమనార్హం. ఈ ప్రతిపాదిత రైలు మార్గంలో ఎక్కువ భాగం తెలంగాణలోనే ఉంటుంది. కర్నూలు నగరం చెంతనే ఉన్న తుంగభద్రా నది, తెలంగాణలో ప్రవహించే కృష్ణా నదులపై రైల్వే వంతెనలను నిర్మించనున్నారు. సెమీ హైస్పీడ్‌ కారిడార్‌లో నడిచే రైళ్లు గంటకు 200 కి.మీకు పైగా వేగంతో దూసుకుపోతాయి. అందుకే ప్రయాణ సమయం గణనీయంగా తగ్గిపోతుంది. దీనికి సంబంధించిన ప్రాథమిక ఇంజనీరింగ్‌, ట్రాఫిక్‌ సర్వే పూర్తయింది. ఈ నెలాఖరులోగా రైల్వే బోర్డుకు నివేదికలు అందించనున్నారు.

Also Read :Adhitya Ram : ప్రభాస్ సినిమాతో నిర్మాణం ఆపేసి.. చరణ్ సినిమాతో మళ్ళీ తెర మీదకు వచ్చిన స్టార్ ప్రొడ్యూసర్..!

కర్నూలు జంక్షన్‌గా మారేనా ?

మంత్రాలయం-కర్నూలు వయా ఎమ్మిగనూరు, కోడుమూరు రైలు మార్గం ప్రతిపాదనల్లో ఉంది. దీన్ని నిర్మిస్తే కర్నూలు నుంచి తూర్పుకు సూర్యపేట, విజయవాడ సెమీ హైస్పీడ్‌ రైల్వే కారిడార్‌.. పడమర వైపునకు కర్నూలు-మంత్రాలయం వయా ఎమ్మిగనూరు.. ఉత్తర వైపునకు కర్నూలు – హైదరాబాద్‌ వయా గద్వాల, మహబూబ్‌నగర్‌.. దక్షిణం వైపునకు కర్నూలు – బెంగళూరు వయా డోన్‌, గుత్తి రైల్వేలైన్లు సాగిపోతాయి. నాలుగు వైపులా రైలు మార్గాలతో కర్నూలు జంక్షన్‌గా మారే అవకాశం ఉంది.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • central government
  • kurnool
  • Kurnool to Visakhapatnam
  • Kurnool to Vizag
  • new railway route
  • railway route
  • Visakhapatnam

Related News

People have immense faith in the judicial system: CM Chandrababu

Visakhapatnam : న్యాయ వ్యవస్థపై ప్రజలకు అపారమైన నమ్మకం ఉంది : సీఎం చంద్రబాబు

న్యాయ వ్యవస్థపై ఉన్న నమ్మకమే ప్రజలు కోర్టులను ఆశ్రయించడానికి కారణమని అన్నారు. సమస్యలను త్వరగా పరిష్కరించడానికి ‘మధ్యవర్తిత్వం’ (Mediation) ఒక సమర్థవంతమైన మార్గమని పేర్కొన్నారు. వివాదాలను న్యాయపరంగానే కాక, సామరస్యపూరితంగా పరిష్కరించేందుకు ఇది ఉత్తమమని అభిప్రాయపడ్డారు.

  • Controversy in AP Endowment Department.. The stage is set for the dismissal of the Assistant Commissioner!

    AP : దేవాదాయ శాఖలో వివాదం..అసిస్టెంట్ కమిషనర్ పై వేటుకు రంగం సిద్ధం!

  • Gold

    Gold Rates : జీఎస్టీ రేట్ల సవరణతో బంగారం ప్రియులకు శుభవార్త..ఎంతవరకు తగ్గే చాన్స్ అంటే?

  • Glass bridge ready for tourists on Kailashgiri in Visakhapatnam..Here is the video of the glass bridge!

    Glass Bridge : పర్యాటకుల కోసం విశాఖ కైలాసగిరిపై గాజు వంతెన సిద్ధం..అద్దాల వంతెన వీడియో ఇదిగో!

  • AP tops in exports of pharma and aqua products: CM Chandrababu

    AP: ఫార్మా, ఆక్వా ఉత్పత్తుల ఎగుమతిలో ఏపీదే అగ్రస్థానం : సీఎం చంద్రబాబు

Latest News

  • BCCI: డ్రీమ్ 11తో ముగిసిన ఒప్పందం.. బీసీసీఐ రియాక్ష‌న్ ఇదే!

  • Ghaati : అనుష్క ‘ఘాటి’కి షాకింగ్ కలెక్షన్స్!

  • India – US : దిగొచ్చిన ట్రంప్..ఇక భారత్-అమెరికా వైరం ముగిసినట్లేనా?

  • Shreyas Iyer: ఆసియా క‌ప్‌కు ముందు టీమిండియా కెప్టెన్‌గా అయ్య‌ర్‌!

  • Canada : ఖలిస్థానీ ఉగ్రవాదులకు కెనడా నుంచే నిధుల సరఫరా: కెనడా నివేదికలో వెల్లడి..!

Trending News

    • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

    • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

    • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

    • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

    • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd