HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Andhra Pradesh
  • >Center Not Serious On Special Railway Zone For Ap

AP Railway Zone : ఏపీ రైల్వే జోన్ కిరికిరి

ఇప్పటికే పోలవరం నిధులను తెగ్గోసిన కేంద్రం తాజాగా మరో సంచలన విషయాన్ని రైల్వే బోర్డు ద్వారా చెప్పించింది.

  • By CS Rao Published Date - 11:39 AM, Thu - 29 September 22
  • daily-hunt
Vizag
Vizag

ఇప్పటికే పోలవరం నిధులను తెగ్గోసిన కేంద్రం తాజాగా మరో సంచలన విషయాన్ని రైల్వే బోర్డు ద్వారా చెప్పించింది. ఏపీలోనివిశాఖకు కొత్తగా రైల్వే జోన్ ఇచ్చే ప్రతిపాదన ఏదీ లేదని తెగేసి చెప్పింది. రాష్ట్ర విభజన చట్టం-2014లోని అంశాలపై కేంద్ర హోం శాఖ ఆధ్వర్యంలో రెండు తెలుగు రాష్ట్రాలతో నూ కేంద్రం తాజాగా చర్చలు ప్రారంభించింది. దీనిలో ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.ఈ క్రమంలో రైల్వే బోర్డు చైర్మన్ ఏపీలోని విశాఖలో రైల్వే బోర్డ్ ఏర్పాటు చేసే యోచన లేదన్నారు. దీనిపై హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. “ ఈ విషయాన్ని కేంద్ర మంత్రి వర్గానికి వదిలేయండి. దీనిపై తర్వాత చర్చిద్దాం“ అని బోర్డు చైర్మన్కు భల్లా చెప్పారు. మొత్తం 14 అంశాలతో కూడిన అజెండాపై తాజాగా చర్చ జరుగుతోంది. వీటిలో ఏపీలో కొత్త రాజధానికి నిధులు ఏడు వెనుక బడిన జిల్లాలకు నిధులు విద్యాసంస్థల ఏర్పాటు సహా రైల్ ర్యాపిడ్ కనెక్టివిటీ వంటివి ఉన్నాయి. ఈ క్రమంలో ఏపీ తరఫున సమావేశానికి హాజరైన సీఎస్ సమీర్ శర్మ కొత్త రాజధాని నిర్మాణానికి రూ.1000 కోట్లు కావాలని విన్నవించారు. అమరావతి అభివృద్ధికి ఆ నిధులు వెచ్చిస్తామన్నారు. అయితే, కేంద్ర అధికారులు మాత్రం గతంలో ఇచ్చిన 1500 కోట్ల లెక్కలు చెప్పాలని వాటి వివరాలు ఇవ్వాలని మెలిక పెట్టారు. ఇదిలావుంటే రాజధానిపై ఏర్పాటైన శివరామకృష్ణన్ కమిటీ ఏపీ రాజధానికి రూ.29 వేల కోట్లు ఇవ్వాలని సూచించిన విషయాన్ని ఏపీ అధికారులు లేవనెత్తారు.

విభజన హామీల్లో కీలకమైన రైల్వే జోన్ వ్యవహారంపై మాత్రం రైల్వే బోర్డ్ తిప్పేసినట్టు తెలుస్తోంది. కొన్నేళ్లుగా ఈ డిమాండ్ పెండింగులోనే ఉంది. ఇటీవల పార్లమెంటు సమావేశాల్లో కూడా రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ దీనిపై ఒక ప్రకటన చేశారు. రైల్వే జోన్ కోసం స్థలాన్ని వెతుకుతున్నామని ప్రకటించారు. అన్నీ జరుగుతాయని కూడా హామీ ఇచ్చారు.కానీ ఇంతలో బోర్డు మాత్రం ప్లేట్ ఫిరాయించడం గమనార్హం. మంత్రి ప్రకటన తర్వాత విశాఖ రైల్వే జోన్పై మళ్లీ ఆశలు చిగురించాయి. అయితే. ఇప్పుడు బోర్డు తన నిర్ణయాన్ని మార్చుకున్నట్టు తెలుస్తోంది. విశాఖలోల రైల్వే జోన్ ఏర్పాటు చేయడం సాధ్యం కాదని, పేర్కొన్నారు. మరోవైపు ఏపీ తెలంగాణల నుంచి వచ్చిన కొన్ని అభ్యర్థలను కేంద్ర హోం శాఖ నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది. రెండు గంటల సమావేశంలో ఎలాంటి హామీలు దక్కక పోవడం తో ఇరు రాష్ట్రాల అధికారులు తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు. రైల్వే జోన్ రాజకీయ చర్చకు దారితీసింది. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఒకటి చెబుతుంటే, జేవీయల్ మరొకటి అంటున్నారు. బీజేపీ, వైసీపీ పొలిటికల్ గేమ్ నడుమ విశాఖ రైల్వే జోన్ ఒక జోక్ గా మారింది.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap news
  • ap railway zone
  • Visakhapatnam

Related News

Gold prices are rising: Shock for gold lovers..even silver has not backed down!

Gold price : హడలెత్తిస్తున్న బంగారం ధరలు: పసిడి ప్రియులకు షాక్..వెండి కూడా వెనక్కి తగ్గలేదు!

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో బంగారం ధరలు గణనీయంగా పెరిగాయి. మంగళవారం 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర ఒక్కరోజే తులానికి రూ. 1,360 పెరిగింది. ఫలితంగా, ధర రూ. 1,10,290కి చేరింది. ఇదే సమయంలో, 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర తులానికి రూ. 1,250 పెరిగి, రూ. 1,01,100 వద్ద ట్రేడ్ అవుతోంది.

  • Fire breaks out again at EIPL...Rescue operation with Navy helicopters

    Visakhapatnam : మళ్లీ ఈఐపీఎల్‌లో మంటలు ..నేవీ హెలికాప్టర్లతో రెస్క్యూ ఆపరేషన్‌

  • Lightning strikes petroleum company, causing massive fire

    HPCL : పెట్రోలియం కంపెనీపై పిడుగు.. భారీగా చెలరేగిన మంటలు

  • Cable Bridge

    Cable Bridge: ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం.. అమరావతిలో ఐకానిక్ బ్రిడ్జి!

  • People have immense faith in the judicial system: CM Chandrababu

    Visakhapatnam : న్యాయ వ్యవస్థపై ప్రజలకు అపారమైన నమ్మకం ఉంది : సీఎం చంద్రబాబు

Latest News

  • Canada : భారత విద్యార్థులకు కెనడా భారీ షాక్.. 80 శాతం వీసాల తిరస్కరణ!

  • High Alert : నేపాల్‌లో ఉద్రిక్తతలు: భారత్ సరిహద్దుల్లో హై అలర్ట్..రాష్ట్రాల్లో కట్టుదిట్టమైన భద్రత

  • Indiramma Houses : ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు కీలక సూచనలు..!

  • Kumari Aunty : నెట్టింట వైరల్‌గా మారిన కుమారీ ఆంటీ వీడియో

  • Minister Lokesh : మంత్రి లోకేష్ అనంతపురం పర్యటన రద్దు..నేపాల్‌లో చిక్కుకున్న తెలుగువారి రక్షణకు చర్యలు

Trending News

    • GST Rates: జీఎస్టీ మార్పులు.. భారీగా త‌గ్గ‌నున్న ధ‌ర‌లు!

    • GST Reforms Impact: హోట‌ల్స్ రూమ్స్‌లో ఉండేవారికి గుడ్ న్యూస్‌!

    • Lunar Eclipse: రేపే చంద్ర‌గ్ర‌హ‌ణం.. ఏ దేశాల‌పై ప్ర‌భావం అంటే?

    • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

    • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd