Durga Temple : ఇంద్రకీలాద్రీపై ముగిసిని భవానీ దీక్షల విరమణ.. అమ్మవారిని దర్శించుకున్న నాలుగు లక్షల మంది భక్తులు
- By Prasad Published Date - 10:30 PM, Sun - 7 January 24
ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షల విరమణ కార్యక్రమం ముగిసింది. ఐదు రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో భక్తులు జై భవానీ జై జై భవానీ అంటూ నినాదాలు చేస్తూ దీక్షలను ముగించారు. వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య యాగశాలలో అర్చకులు పూర్ణాహుతి నిర్వహించడంతో ఉత్సవాలు ముగిశాయి. పూజాకార్యక్రమాల్లో భాగంగా దుర్గ గుడి ట్రస్ట్ బోర్డు చైర్మన్ కర్నాటి రాంబాబు, ఆలయ ఈవో రామారావు, ఆలయ వైదిక కమిటీ సభ్యుల సమక్షంలో ‘పూర్ణాహుతి’ నిర్వహించారు. ఉత్సవాల చివరి రోజు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. ఆలయ అధికారులు దాదాపు 5 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేయగా, దీక్ష విరమణ సమయంలో కేవలం 4 లక్షల మంది భక్తులు మాత్రమే ఆలయాన్ని సందర్శించినట్లు అధికారులు తెలిపారు. మునిసిపల్, పోలీస్, హెల్త్, ఎలక్ట్రికల్, జలవనరులు, రెవెన్యూ తదితర అన్ని శాఖల సమన్వయంతో ఆలయ అధికారులు భవానీ దీక్ష విరమణను నిర్వహించారు.
We’re now on WhatsApp. Click to Join.
గత ఏడాది ఇదే కాలంలో దాదాపు 5.50 లక్షల మంది భవానీలు, ఇతర భక్తులు ఆలయాన్ని సందర్శించారు. ఈ ఏడాది తెల్లవారుజామున 2 గంటల నుంచి దర్శనం కల్పించి రద్దీని నియంత్రించినట్లు రామారావు తెలిపారు. ఐదు రోజుల్లో 17 లక్షల లడ్డూ ప్రసాదాలు అమ్ముడయ్యాయి. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్.డిల్లీరావు, పోలీస్ కమిషనర్ కాంతి రాణా టాటా, విజయవాడ మున్సిపల్ కమిషనర్ స్వప్నికల్ దినకర్ పుండ్కర్లకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ, ఆలయ సిబ్బంది అందిస్తున్న సేవలను ఆయన అభినందించారు. అనంతరం పోలీసు అధికారులను, ఇతర ప్రభుత్వ శాఖాధికారులను ఆలయ చైర్మన్ రాంబాబు, ఈవో రామారావు సన్మానించారు.
Also Read: TDP : మూడు నెలల్లో అమరావతే రాజధాని.. ఇది తథ్యం : ఆచంట సభలో చంద్రబాబు
Related News
PM Modi Mega Roadshow In VJD : వైసీపీకి దడ పుట్టించిన మోడీ రోడ్ షో…
ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి బెంజి సర్కిల్ వరకు ఈ రోడ్ షో కొనసాగుతుంది. ప్రధాని రోడ్ షో నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసారు