HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Bharat Jodo Yathra To Create Sensation In Telugu States

Rahul Gandhi : ఏపీ, తెలంగాణా పొలిటికల్ జోడో

భారత్ జోడో యాత్ర మీదా తెలంగాణా కాంగ్రెస్ చాలా ఆశలు పెట్టుకుంది. తొలిరోజు యాత్ర కు వచ్చిన స్పందన చూసిన తరువాత తెలంగాణా కాంగ్రెస్ కు ఉత్తేజం కనిపిస్తుంది .

  • Author : CS Rao Date : 25-10-2022 - 12:19 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Bharat Jodo Yatra
Bharath Jodo Yatra

భారత్ జోడో యాత్ర మీదా తెలంగాణా కాంగ్రెస్ చాలా ఆశలు పెట్టుకుంది. తొలిరోజు యాత్ర కు వచ్చిన స్పందన చూసిన తరువాత తెలంగాణా కాంగ్రెస్ కు ఉత్తేజం కనిపిస్తుంది. ఇతర పార్టీలకు వెళ్లాలని భావించిన కొందరు లీడర్లు కూడా యాత్ర చూసిన తరువాత పునరాలోచనలో పడ్డారని తెలిసింది. కోవర్టులు, అసంతృప్తి వాదులు కూడా ఆచితూచి అడుగు వేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రాబోతుందన్న సంకేతం ఇవ్వడానికి యాత్ర ఉపయోగ పడుతుందని అంచనా. ఒక వేళ యాత్ర తరువాత కూడా పార్టీ తీరు మారకపోతే తెలంగాణ, ఏపీలో కాంగ్రెస్, బీ ఆర్ ఎస్ పొత్తు దిశగా వెళ్లనుందని వినికిడి. జాతీయ రాజకీయాల సమీకరణల ను తీసుకుంటే ఆ రెండు పార్టీలు వివిధ రాష్ట్రాల్లో కలిసి పోటీ చేయడానికి ప్రశాంత్ కిశోర్ లైన్ క్లియర్ చేస్తున్నాడని ప్రచారం ఉంది. కనీసం ఐదు రాష్ట్రాల్లో కాంగ్రెస్, బీ ఆర్ ఎస్, ఏం ఐ ఏం కలసి కూటమిగా వెళతాయని తెలుస్తుంది. మహారాష్ట్ర, బీహార్, ఏపీ, తెలంగాణా, కర్ణాటక కొన్ని ఈశాన్య రాష్ట్రాల్లోని ఈ కూటమి కలుస్తుందని ఢిల్లీ వర్గాల్లోని టాక్. అయితే ఇదంతా తెలంగాణా లో యాత్ర విజయాన్ని బట్టి ఉంటుందని పలు వర్గాల్లోని చర్చ.

అక్టోబరు 27న నారాయణపేట జిల్లా మక్తల్ నుంచి భారత్ జోడో యాత్రను పునఃప్రారంభిస్తారు. తెలంగాణ రైతులు, మహిళలు, యువతను ఆకట్టుకునేలా ఆయన యాత్ర ప్రధానంగా టార్గెట్ చేయనుంది. ఆ మేరకు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. తెలంగాణాలో ఎంట్రీ ఇచ్చిన తొలిరోజే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాహనంపై నుంచి గుడేబల్లూర్‌లో ప్రజలను ఉద్దేశించి క్లుప్తంగా ప్రసంగించారు. రాష్ట్రంలోని రైతులు, మహిళలు, యువతకు సంబంధించిన అన్ని బాధలను తాను వింటానని చెప్పారు. ఈ యాత్ర కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఉందని ఉద్ఘాటిస్తూనే, ఇది ద్వేషానికి వ్యతిరేకంగా, ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం వంటి దేశం ఎదుర్కొంటున్న సమస్యలపై దృష్టి పెట్టింది.

‘జాతి ఐక్యత కోసం చేస్తున్న భారత్ జోడో యాత్రను ఎవరూ ఆపలేరు. దీన్ని దెబ్బతీయాలని బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లు ప్రయత్నిస్తున్నాయని’ అన్నారు. ఢిల్లీకి విమానంలో వెళ్లేందుకు శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లిన తర్వాత కృష్ణా నదిని దాటుతున్న యాత్ర వైమానిక దృశ్యాన్ని చూపించే వీడియోను ట్వీట్ చేయడంతో వైరల్ గా మారింది. “ప్రేమ నది భారతదేశం గుండా ప్రవహిస్తోంది, పురోగతి, శ్రేయస్సు కోసం ఆశను పునరుజ్జీవింపజేస్తుంది అంటూ కొటేషన్ ఇచ్చారు. మొత్తం మీద తెలంగాణా భారత్ జోడో యాత్ర తెలుగు రాష్ట్రాల రాజకీయ సమీకరణాలను మార్చనుంది . రాహుల్ గాంధీ అక్టోబర్ 27న నారాయణపేట జిల్లా మక్తల్ గ్రామం నుంచి యాత్రను పునఃప్రారంభించనున్నారు. దానికి ఎలాంటి స్పందన రానుందో చూద్దాం.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • Bharat Jodo campaign
  • rahul gandhi padyatra
  • telangana
  • telangana congress

Related News

Another major twist in the Tuni missing case: Key details revealed in the dog's post-mortem report.

Jnaneswari: తుని మిస్సింగ్ కేసులో మరో బిగ్ ట్విస్ట్.. కుక్క పోస్ట్ మార్టం రిపోర్టులో బయటపడ్డ కీలక విషయాలు

ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ జిల్లా తుని పట్టణంలో సంచలనం సృష్టించిన చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు విచారణలో భాగంగా పోలీసులు కీలక సమాచారాన్ని వెల్లడించారు. ఈ కేసు దర్యాప్తులో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న పెంపుడు కుక్క మృతిపై అనుమానాలను నివృత్తి చేస్తూ అధికారులు పోస్ట్‌మార్టం నివేదికను విడుదల చేశారు. జూన్ 13న మరణించిన ఆ పెంపుడు కుక్కకు మరుసటి రోజే (జూన్ 14) పశువై

  • Cbn Speech

    Chandrababu : విశాఖ ఫార్మా సిటీ అగ్ని ప్రమాద ఘటనపై సీఎం చంద్రబాబు విచారం

  • Health Minister

    AP : ఐదు బోధనాసుపత్రుల్లో కృత్రిమ అవయవాల తయారీ యూనిట్లు!

Latest News

  • Shreyas Iyer: సిరీస్ క్లీన్‌స్వీప్ చేసిన ఐర్లాండ్.. శ్రేయాస్ అయ్యర్ సంచలన వ్యాఖ్యలు

  • Rain Alert: తెలంగాణ జిల్లాల్లో విస్తారంగా భారీ వర్షాలు

  • Uric acid: కీళ్ల నొప్పులు బాధిస్తున్నాయి? అయితే శరీరంలో ఇది జరిగి ఉండవచ్చు..!!

  • Lord Shiva: నీలకంఠునికి ఏ ద్రవ్యాలతో అభిషేకం చేస్తే ఫలితం ఉంటుంది?

  • Lemon Water: ఉదయాన్నే లెమన్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా..!

Trending News

    • Breaking News: అంతుపట్టని మిస్టరీగా చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. రంగంలోకి క్రైమ్ టీం

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd