Acid Attack : వైజాగ్లో వివాహితపై ఆటో డ్రైవర్ యాసిడ్ దాడి
విశాఖపట్నంలో ఓ వివాహితపై ఆటో డ్రైవర్ యాసిడ్ దాడి చేశాడు. ఈ ఘటన పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలోని
- By Prasad Published Date - 07:34 AM, Tue - 12 December 23
విశాఖపట్నంలో ఓ వివాహితపై ఆటో డ్రైవర్ యాసిడ్ దాడి చేశాడు. ఈ ఘటన పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలోని నందువానిపాలెంలో చోటుచేసుకుంది. ఈ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కె శిరీష అనే బ్యూటీషియన్.. తన భర్తతో విభేదాల కారణంగా ఒంటరిగా జీవిస్తోంది. అదే ప్రాంతానికి చెందిన ఆటో డ్రైవర్ నర్సింగరావుతో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త ఇద్దరి మధ్య సన్నిహిత సంబంధానికి దారి తీసింది. అయితే ఇటీవల శిరీష, ఆమె భర్త మళ్లీ కలిశారు. శిరీష తన భర్త వద్దే ఉంటున్నానని, తన వద్దకు రావద్దని నర్సింగరావుకు చెప్పింది. దీన్ని జీర్ణించుకోలేని నర్సింగ్ ఆమెపై యాసిడ్ పోశాడు. స్థానికులు ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. యాసిడ్ తీవ్రత కారణంగా, శిరీష ముఖం మీద దద్దుర్లు కనిపించాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Related News
Praja Rajyam party: ప్రజారాజ్యం నాశనం కావడానికి కారణం అతనే: పవన్
ప్రజారాజ్యం ... మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన పార్టీ ఇది. ఓ పదిహేనేళ్ళ క్రితం ఈ పేరుకు ఉన్న బ్రాండ్ ఇమేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టీడీపీ, కాంగ్రెస్ ఏలుతున్న రోజులవి. 2008 ఆగస్టు 26న ఎన్నో ఆశలు, ఆశయాలతో స్థాపించారు మెగాస్టార్ చిరు. ప్రజారాజ్యంలో యువరాజ్యం సగభాగం. యువరాజ్యానికి పవన్ కళ్యాణ్ అధ్యక్షుడిగా ఉన్నారు.