AP: కూతుర్ని చంపి.. సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసిన తండ్రి..!!
- By hashtagu Published Date - 09:06 AM, Sat - 5 November 22
ఏపీలోని విశాఖపట్నంలో దారుణం జరిగింది. వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో కన్న కూతుర్ని చంపిన కన్న తండ్రి..ఆ తర్వాత హత్య చేసినట్లు సోషల్ మీడియాలో సెల్ఫీ వీడియో పోస్టు చేశాడు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఇది పరువు హత్యగా భావిస్తున్నారు. దీంతో విశాఖలో కలకలం రేగింది.
పూర్తి వివరాల్లోకి వెళ్లితే… వరప్రసాద్, హేమలత దంపతులకు ఇద్దరు ఆడపిల్లలు. 13ఏళ్ల క్రితం వరప్రసాద్ ను భార్య వదిలేసింది. అప్పటి నుంచి ఇద్దరు ఆడపిల్లలను వరప్రసాద్ పెంచాడు. పెద్ద కూతూరు ప్రేమ పెళ్లి చేసుకుని వెళ్లిపోయింది. రెండు రోజుల క్రితం చిన్న కూతురు కూడా ఓ వ్యక్తితో వెళ్లిపోయిందని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు.
కట్టుకున్న భార్య, కన్న కూతుళ్లు వదిలేసి వెళ్లారన్న మనస్థాపంతో వరప్రసాద్ చిన్న కూతురు లిఖితను చంపి సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని కేజీహెచ్ కు తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. వరప్రసాద్ ప్రస్తుతం పోలీసులు అదుపులో ఉన్నాడు.
Related News
Murder: కుటుంబాలను నాశనం చేస్తున్న బెట్టింగ్స్, కొడుకును చంపిన తండ్రి
Murder: బెట్టింగ్ కు పాల్పడుతున్న కొడుకుని ఓ తండ్రి కొట్టి చంపిన సంఘటన సంచలనం రేపింది. తెలంగాణలోని మెదక్ – చిన్న శoకరంపేట మండలం బగిరాత్ పల్లిలో బెట్టింగ్కు అలవాటు పడి రూ.2 కోట్లు పోగొట్టుకున్నాడు. రైల్వే ఉద్యోగి ముకేశ్ కుమార్(28). బెట్టింగ్లు మానుకోవాలని ఎన్నిసార్లు చెప్పినా వినకపోవడంతో, నిన్న అర్ధరాత్రి ముఖేశ్ను కొట్టి చంపిన తండ్రి సత్యనారాయణ. విషయం తెలుసుకున్న పోలీస�