Arogya Shri Smart Card: ప్రతి ఇంటికి ఆరోగ్యశ్రీ స్మార్ట్కార్డుల జారీ: సీఎం జగన్
సీఎం జగన్ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. సంక్షేమ పాలనకు మొగ్గుచూపుతున్న సీఎం జగన్ నిర్ణయాలు సామాన్యుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయి. ఈ మేరకు ఈ రోజు కొత్త ఆరోగ్యశ్రీ స్మార్ట్ కార్డ్లను సీఎం జగన్ ప్రారంభించారు
- Author : Praveen Aluthuru
Date : 18-12-2023 - 1:21 IST
Published By : Hashtagu Telugu Desk
Arogya Shri Smart Card: సీఎం జగన్ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. సంక్షేమ పాలనకు మొగ్గుచూపుతున్న సీఎం జగన్ నిర్ణయాలు సామాన్యుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయి. ఈ మేరకు ఈ రోజు కొత్త ఆరోగ్యశ్రీ స్మార్ట్ కార్డ్లను సీఎం జగన్ ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన వారందరికీ ఈ ఆరోగ్యశ్రీ స్మార్ట్ కార్డ్లు అందించబడతాయని ఆయన చెప్పారు. అంటే ప్రతి ఇంటికి ఆరోగ్యశ్రీ స్మార్ట్కార్డుల జారీ చేయనున్నారు.
ప్రతిఒక్కరు ఆరోగ్యశ్రీ యాప్ డౌన్లోడ్ చేసుకునేలా చూడాలని సంబంధిత అధికారులకు సీఎం జగన్ సూచించారు. ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు, వాలంటీర్లు, మహిళా పోలీసులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు ప్రతి ఇంట్లో కనీసం ఆరోగ్యశ్రీ యాప్ డౌన్లోడ్ చేసుకునేలా చూడాలని తెలిపారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్యశ్రీ అమలును మరింత పటిష్టం చేయాలని సీఎం జగన్ నిర్ణయించారు. వైద్య, ఆరోగ్య శాఖలో సమూల మార్పులు తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇప్పుడు కొత్తగా ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకంలో 25 లక్షల వరకు ఉచిత వైద్య సదుపాయాలు కల్పిస్తామని, అందరికీ ఈ సౌకర్యాన్ని అందిస్తున్నామని సీఎం చెప్పారు. .
పేద ప్రజల ఆరోగ్యమే తనకు ముఖ్యమని, అందుకే ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశంతో ఆరోగ్యశ్రీ పథకంలో 25 లక్షల వరకు ఉచిత వైద్య సదుపాయాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు ప్లే స్టోర్లో ఆరోగ్యశ్రీ యాప్ అందుబాటులోకి వచ్చింది. పేద, మధ్యతరగతి ప్రజలకు మెరుగైన కార్పొరేట్ వైద్యం అందించేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. కొత్త ఫీచర్లతో కూడిన స్మార్ట్ ఆరోగ్యశ్రీ కార్డులను పంపిణీ చేస్తున్నారు. ఈ ఆరోగ్యశ్రీ స్మార్ట్ కార్డులను ఇంటింటికీ పంపిణీ చేస్తున్నారు. ఈ స్మార్ట్ కార్డ్లు ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్లో పొందుపరిచిన లబ్ధిదారుడి ఫోటో, కుటుంబ యజమాని పేరు, ఫోన్ నంబర్, కుటుంబ సభ్యుల వివరాలు మరియు ఆరోగ్య వివరాలతో పాటు QR కోడ్ను కలిగి ఉంటాయి. ప్రతి ఒక్కరూ మెరుగైన ఉచిత వైద్యం పొందేందుకు ఈ ఆరోగ్యశ్రీ స్మార్ట్ కార్డులు పంపిణీ చేస్తున్నారు. ఈ కార్డుల ద్వారా వైద్యులు రోగుల ఆరోగ్య వివరాలన్నింటినీ సులభంగా తెలుసుకోవచ్చు. తద్వారా అవసరమైన చికిత్స కూడా త్వరగా అందుతుంది.
Also Read: TS HighCourt: సింగరేణి ఎన్నికల నిర్వహణపై హైకోర్టు కీలక తీర్పు