HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Arcelormittal Nippon Steels Joint Venture Plant In Anakapalle District

Anakapalle : అనకాపల్లి జిల్లాలో ‘ఆర్సెలార్‌ మిట్టల్‌ – నిప్పన్‌ స్టీల్స్‌’ ప్లాంట్.. తొలి దశలో రూ.70వేల కోట్ల పెట్టుబడి

నక్కపల్లి (రాజయ్యపేట) వద్ద స్టీలు ప్లాంటు(Anakapalle) మొదటి దశ నిర్మాణాన్ని 2029 జనవరి నాటికి పూర్తి చేసి, ఉత్పత్తిని ప్రారంభిస్తామని ‘ఏఎం/ఎన్‌ఎస్‌’ కంపెనీ తెలిపింది.

  • Author : Pasha Date : 31-10-2024 - 7:58 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Arcelormittal Nippon Steels Andhra Pradesh Anakapalle District

Anakapalle : ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి జిల్లా నక్కపల్లి (రాజయ్యపేట) వద్ద  స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు ఆర్సెలార్‌ మిట్టల్‌, నిప్పన్‌ స్టీల్స్‌‌లకు చెందిన జాయింట్‌ వెంచర్‌ కంపెనీ ‘ఏఎం/ఎన్‌ఎస్‌’ ముందుకొచ్చింది.  నిప్పన్‌ స్టీల్స్‌‌ అనే జపాన్‌ కేంద్రంగా, ఆర్సెలార్‌ మిట్టల్‌ అనేది లగ్జంబర్గ్ కేంద్రంగా పనిచేస్తున్నాయి. ఈ రెండు స్టీల్ తయారీ కంపెనీలు కలిసి  ‘ఏఎం/ఎన్‌ఎస్‌’ అనే  జాయింట్ వెంచర్ కంపెనీని ఏర్పాటుచేశాయి. ఇప్పుడు ఈ కంపెనీయే నక్కపల్లి (రాజయ్యపేట) వద్ద స్టీలు ప్లాంటు పెట్టేందుకు ఆసక్తిని కనబరుస్తూ ఏపీ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ప్లాంటు ఏర్పాటుకు మొత్తం రెండు దశల్లో పెట్టుబడులు పెడతామన్న కంపెనీ.. తొలిదశలో రూ.70 వేల కోట్లు ఇన్వెస్ట్ చేస్తామని వెల్లడించింది.

Also Read :Nepal Vs India : ఇండియా భూభాగంతో నేపాల్ మ్యాప్‌.. ఆ నోట్ల ప్రింటింగ్ కాంట్రాక్టు చైనాకు

నక్కపల్లి (రాజయ్యపేట) వద్ద స్టీలు ప్లాంటు(Anakapalle) మొదటి దశ నిర్మాణాన్ని 2029 జనవరి నాటికి పూర్తి చేసి, ఉత్పత్తిని ప్రారంభిస్తామని ‘ఏఎం/ఎన్‌ఎస్‌’ కంపెనీ తెలిపింది.మొదటి దశలో 7.3 మిలియన్‌ మెట్రిక్‌ వార్షిక ఉత్పత్తి సామర్థ్యంతో, రెండో దశలో 10.5 ఎంఎటీల వార్షిక ఉత్పత్తి సామర్థ్యంతో  స్టీలు ప్లాంట్‌ పనిచేస్తుందని పేర్కొంది. ప్లాంట్‌ నిర్మాణ సమయంలో మరో 25 వేల మందికి, తర్వాత కార్యకలాపాలు, నిర్వహణ కోసం సుమారు 20 వేల మందికి ఉపాధి లభిస్తుందని పేర్కొంది. స్టీల్‌ ప్లాంట్‌, పోర్టు, రైల్‌ యార్డు నిర్మాణానికి ప్రభుత్వ అనుమతులను కంపెనీ కోరింది. అనకాపల్లి బల్క్‌డ్రగ్‌ పార్కు కోసం ప్రతిపాదించిన 2,200 ఎకరాలను మొదటి దశ స్టీలు ప్లాంట్‌ నిర్మాణానికి కేటాయిస్తారనే అంచనాలు వెలువడుతున్నాయి. రెండో దశలో ప్లాంట్‌ నిర్మాణానికి సమీపంలోని మరో 3,800 ఎకరాలను కేటాయించాలని కంపెనీ ప్రపోజ్ చేసింది.

Also Read :India Vs China : బార్డర్‌లో స్వీట్లు పంచుకోనున్న భారత్-చైనా సైనికులు.. ఎందుకంటే ?

ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌ఎండీసీకి కేటాయించిన గనుల నుంచి ప్లాంట్‌కు అవసరమైన ముడి ఖనిజాన్ని తీసుకోనున్నట్లు ‘ఏఎం/ఎన్‌ఎస్‌’ కంపెనీ తెలిపింది.  ఛత్తీస్‌గఢ్, ఒడిశా నుంచి ముడి ఖనిజాన్ని స్లర్రీ పైపులైను ద్వారా విశాఖ ప్లాంట్‌కు   తీసుకొచ్చే అవకాశం ఉంది. దీనివల్ల తయారు చేసిన పెలెట్లను ప్లాంట్‌ బ్లాస్ట్‌ ఫర్నేస్‌లోకి నేరుగా పంపే వెసులుబాటు కలుగుతుంది. ఏఎం/ఎన్‌ఎస్‌ జాయింట్ వెంచర్ కంపెనీ ఇప్పటికే వైజాగ్‌లో 8 మిలియన్‌ టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యంతో పెల్లెట్ల తయారీ ఫ్యాక్టరీని నిర్వహిస్తోంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Anakapalle District
  • andhra pradesh
  • ap
  • ArcelorMittal
  • ArcelorMittal - Nippon Steels
  • Nippon Steels

Related News

Pulse Polio Programme

నేడే పల్స్ పోలియో..తల్లిదండ్రులు అస్సలు నిర్లక్ష్యం చేయకండి

నేడు రాష్ట్రవ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇవాళ కచ్చితంగా ఐదేళ్లలోపు పిల్లలకు పోలియో చుక్కలు వేయించండి. 38,267 బూత్ల ద్వారా 54,07,663 మంది చిన్నారులకు పోలియో డ్రాప్స్ వేయనున్నారు

  • CM Chandrababu Naidu visits Delhi seeking central support for state development

    రాష్ట్రాభివృద్ధికి కేంద్ర సహకారం కోరుతూ ఢిల్లీకి సీఎం చంద్రబాబు

  • CM Chandrababu Naidu participated in the Collectors' Conference on the second day

    విద్యలో జ్ఞానంతో పాటు విలువలు ముఖ్యం: కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు

  • YS Jagan to meet Governor today with one crore signatures

    కోటి సంతకాలతో నేడు గవర్నర్‌ను కలవనున్న వైఎస్ జగన్

  • Big announcement at 12 noon..Nara Lokesh's interesting post

    మధ్యాహ్నం 12 గంటలకు భారీ ప్రకటన..నారా లోకేశ్‌ ఆసక్తికర పోస్ట్‌

Latest News

  • ట్రైన్ టికెట్ చార్జీల పెంపుపై ప్రయాణికులు ఆగ్రహం, ఏం సౌకర్యాలు కల్పించారని ఛార్జీల పెంపు?

  • నిజమైన సంతోషం ఎక్కడ ఉంది? హార్వర్డ్ అధ్యయనం చెప్పే నగ్న సత్యాలు

  • వాట్సాప్ లో కొత్త మోసం జాగ్రత్తగా ఉండకపోతే అంతే సంగతి !

  • టీమిండియాకు బిగ్ షాక్‌.. డ‌బ్ల్యూటీసీలో ఆరో స్థానానికి ప‌డిపోయిన భార‌త్‌!

  • జిల్లాల అధ్యక్షులను ప్రకటించిన టీడీపీ

Trending News

    • క్రెడిట్ కార్డ్ బిజినెస్.. బ్యాంకులు ఎందుకు అంతగా ఆఫర్లు ఇస్తాయి? అసలు లాభం ఎవరికి?

    • 2026 బడ్జెట్.. ఫిబ్రవరి 1 ఆదివారం.. అయినా బడ్జెట్ అప్పుడేనా?

    • అభిషేక్ శర్మ రికార్డు బద్దలు కొట్టిన పాండ్యా!

    • 10 గ్రాముల బంగారం ధర రూ. 40 ల‌క్ష‌లా?!

    • ఆ కార్యక్రమంలో అవినీతి.. ప్రధాని మోదీపై జగన్ ఆరోపణలు!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd