AP POLYCET 2024: ఏపీ పాలిసెట్కు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేది పొడిగింపు
ఏపీ పాలిసెట్కు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీని పొడిగించించింది స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్. ఇంకా అప్లయ్ చేసుకొని అభ్యర్థుల కోసం మరో ఐదు రోజులపాటు తేదీని పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
- By Praveen Aluthuru Published Date - 03:09 PM, Fri - 5 April 24
AP POLYCET 2024: ఏపీ పాలిసెట్కు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీని పొడిగించించింది స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్. ఇంకా అప్లయ్ చేసుకొని అభ్యర్థుల కోసం మరో ఐదు రోజులపాటు తేదీని పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
చివరి తేదీ దరఖాస్తు ఫారమ్ను సమర్పించడానికి ఏప్రిల్ 10 వరకు పొడిగించింది. అర్హత గల అభ్యర్థులు తమ దరఖాస్తు ఫారమ్లను చివరి తేదీ లోపు పూర్తి చేసి సమర్పించవచ్చు. అంతకుముందు ఏప్రిల్ 5 వరకు చివరి తేదీగా నిర్ణయించారు. అభ్యర్థులు తమ దరఖాస్తును polycetap.nic.inలో సమర్పించవచ్చు. నమోదు చేసుకున్న అభ్యర్థుల కోసం POLYCET 2024 హాల్ టిక్కెట్లను పరీక్ష తేదీకి 7 రోజుల ముందు (అంటే 20-ఏప్రిల్-2024 తర్వాత) మాత్రమే డౌన్లోడ్ చేసుకోవచ్చు.
We’re now on WhatsApp : Click to Join
పాలిసెట్ అనేది పాలిటెక్నిక్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్. ఇంజనీరింగ్/నాన్-ఇంజనీరింగ్ డిప్లొమా కోర్సులో ప్రవేశం కొరకు ప్రతి అభ్యర్థి పాలిసెట్ (POLYCET 2024) కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్లోని మొత్తం 26 జిల్లాల్లోని 65 పట్టణాలలో దాదాపు 500 పరీక్షా కేంద్రాలలో నిర్వహించబడుతుంది. ఖచ్చితమైన పరీక్ష తేదీ మరియు షెడ్యూల్ నిర్ణీత సమయంలో ప్రకటించనున్నారు. ఇందుకోసం అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ను సందర్శిస్తూ ఉండాలి.
AP POLYCET 2024 రిజిస్ట్రేషన్ ఎలా దరఖాస్తు చేయాలి?
ముందుగా అధికారిక వెబ్సైట్ను సందర్శించాలి.
AP POLYCET 2024 రిజిస్ట్రేషన్’కి లింక్ను క్లిక్ చేయాలి
దరఖాస్తు ఫారమ్ను జాగ్రత్తగా పూరించాలి.
పూరించిన దరఖాస్తును అప్లోడ్ చేసే ముందు వివరాలను మరొకసారి చెక్ చేసుకుని అప్లోడ్ చేయండి. అంతకుముందు దరఖాస్తు రుసుము చెల్లించాల్సి ఉంటుంది. అప్లోడ్ చేసిన కాపీని డౌన్లోడ్ చేసి, సేవ్ చేయండి.
Also Read: Narendra Modi : వాయనాడ్లోనూ ప్రధాని మోడీ ర్యాలీ..
Tags
Related News
AP Pension: ఏపీలోని పెన్షనర్లకు ప్రభుత్వం శుభవార్త
మే నెల పింఛన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వం కీలక సూచనలు ఇచ్చింది. మే 1వ తేదీన పెన్షనర్ల ఖాతాలోకి డబ్బు జమ అవుతుందని జగన్ ప్రభుత్వం ప్రకటించింది. ఏప్రిల్లో మాదిరిగానే మే నెలలో కూడా సచివాలయాల చుట్టూ తిరగకుండానే లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోనే పింఛన్ సొమ్మును జమ చేయనున్నారు