AP BRS: ఏపీకి నూతన నాయకత్వం అవసరం: బీఆర్ఎస్ ఏపీ చీఫ్
టీడీపీ, వైసీపీ ప్రభుత్వాల పాలనలో అన్ని రంగాలు పూర్తిగా నిర్వీర్య మయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు.
- By Balu J Published Date - 06:25 PM, Mon - 11 September 23
టీడీపీ, వైసీపీలకు ప్రత్యామ్నాయం బిఆర్ఎస్సే అని, టీడీపీ, వైసీపీ పార్టీలతో విసిగివేసారని ఆంధ్ర ప్రజానీకానికి బిఆర్ఎస్ పార్టీ ప్రత్యామ్నాయంగా మారిందని ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ తోట చంద్రశేఖర్ పేర్కొన్నారు. అవినీతిలో ఈ రెండు పార్టీలు పోటీపడి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేశాయని ఆరోపించారు. వనరులు సమృద్ధిగా ఉన్న రాష్ట్రంలో ఉపాధి లేక చదువుకున్న యువత ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లిపోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.
తాత్కాలిక రాజధాని పేరుతో టిడిపి, రాజధాని ఏదో చెప్పలేని రాష్ట్రం గా వైసిపి రాష్ట్ర ప్రజల్ని మోసగించాయని ఎద్దేవా చేశారు. టీడీపీ, వైసీపీ ప్రభుత్వాల పాలనలో అన్ని రంగాలు పూర్తిగా నిర్వీర్య మయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు నెలవారీ జీతాలు ఇవ్వలేని దుస్థితిలో ప్రస్తుత వైసిపి ప్రభుత్వం ఉందని ఆరోపించారు. రాజ్యాంగ వ్యవస్థల్ని అడ్డుపెట్టుకొని ప్రతిపక్షాల పై వేధింపులకు గురి చేయడం బిజెపి,వైసిపి పార్టీల కే చెల్లిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ మోడల్ అభివృద్ధిని ఏపీ ప్రజలు కాంక్షిస్తూ న్నారని స్పష్టం చేశారు.అన్ని వర్గాల అభివృద్ధి బిఆర్ఎస్ తో నే సాధ్యమన్నారు. రానున్న ఎన్నికల్లో కేసిఆర్ నేతృత్వంలో బి ఆర్ ఎస్ పార్టీ కీలక పాత్ర పోషించ నుందని ధీమా వ్యక్తంచేశారు.
Also Read: CM KCR: హరితహారం కార్యక్రమంతో అద్భుతమైన ఫలితాలు: సీఎం కేసీఆర్
Related News
Harish Rao: బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులపై దాడులకు పాల్పడితే చూస్తూ ఊరుకోం: హరీశ్ రావు
Harish Rao: పీర్జాదిగూడ మునిసిపల్ మేయర్, కార్పొరేటర్లపై కాంగ్రెస్ దాడిని ఎక్స్ వేదికగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు ఖండించారు. పీర్జాదిగూడ మునిసిపల్ కార్పొరేషన్లో ఎలాగైనాసరే అవిశ్వాస తీర్మానం నెగ్గాలని కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ మేయర్ జక్కా వెంకట్ రెడ్డి, కార్పొరేటర్లను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని హరీశ్ రావు మండిపడ్డారు. ‘‘ఔటర్ రింగ్ రోడ్డుపై 20 కార్లత�