Driving License : డ్రైవింగ్ లైసెన్సుల జారీ పై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
Driving License : ఆంధ్రప్రదేశ్లో డ్రైవింగ్ లైసెన్సుల జారీ విధానంలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. లైసెన్సు ప్రక్రియలో పారదర్శకతను పెంపొందించి, ప్రజలకు సులభతరం
- By Sudheer Published Date - 02:02 PM, Mon - 10 November 25
ఆంధ్రప్రదేశ్లో డ్రైవింగ్ లైసెన్సుల జారీ విధానంలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. లైసెన్సు ప్రక్రియలో పారదర్శకతను పెంపొందించి, ప్రజలకు సులభతరం చేసే దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై గుర్తింపు పొందిన డ్రైవింగ్ శిక్షణా కేంద్రాల (DTCs) ద్వారా శిక్షణ పూర్తి చేసిన వారికి రవాణా శాఖలో పరీక్ష రాయకుండానే లైసెన్సులు జారీ కానున్నాయి. కేంద్ర రవాణా శాఖ ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా మరో 53 డ్రైవింగ్ శిక్షణా కేంద్రాలను ప్రారంభించారు. ఈ నిర్ణయం అమలులోకి వస్తే, డ్రైవింగ్ నేర్చుకునే వారికి పెద్ద ఎత్తున సౌలభ్యం కలగనుంది. డ్రైవింగ్ నేర్చుకోవడంలో శాస్త్రీయ పద్ధతులు పాటించడంతోపాటు ప్రమాదాల సంఖ్య తగ్గే అవకాశం ఉందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
Ande Sri Passes Away : అందెశ్రీ మరణానికి కారణం ఆ నిర్లక్ష్యమే!!
రవాణా శాఖ అధికారులు తెలిపారు, ఇప్పటి వరకు సరైన శిక్షణ లేకుండా లైసెన్సులు పొందుతున్నవారి సంఖ్య పెరగడంతో రోడ్డు ప్రమాదాలు అధికమయ్యాయి. ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం సమగ్ర ప్రణాళిక రూపొందించింది. కొత్తగా ఏర్పాటుచేస్తున్న శిక్షణా కేంద్రాల్లో ద్విచక్ర, త్రిచక్ర, తేలికపాటి మరియు భారీవాహనాలపై శిక్షణ ఇవ్వనున్నారు. ఇందులో మూడు దశల్లో శిక్షణ అందించనున్నారు — తరగతి గదుల్లో రోడ్డు భద్రతా నియమాలు, ట్రాఫిక్ అవగాహనపై బోధన, సిమ్యులేటర్లపై ప్రాక్టీస్, ఆపై ప్రత్యేక ట్రాక్లపై డ్రైవింగ్ సాధన. ఈ శిక్షణ పూర్తి చేసిన తర్వాత అభ్యర్థులు పరీక్ష రాయకుండానే నేరుగా లైసెన్సుకు అర్హత సాధిస్తారు.
Miracle in the Mulugu Forest: ములుగు అడవుల్లో అద్భుతం
అదనంగా, రాష్ట్రంలో ఐదు ప్రాంతీయ డ్రైవింగ్ శిక్షణా కేంద్రాలు (RDTCs) కూడా ఏర్పాటు చేయబోతున్నారు. ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో ఈ ఆర్డీటీసీలు ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కేంద్రాల్లో శిక్షణ పొందినవారు నేరుగా అక్కడికక్కడే లైసెన్సు కోసం దరఖాస్తు చేసుకునే వీలుంటుంది. ఇప్పటికే ఎన్టీఆర్, శ్రీకాకుళం జిల్లాల నుంచి రెండు చొప్పున, అలాగే నెల్లూరు, అనంతపురం, తిరుపతి, కాకినాడ జిల్లాల నుంచి ఒక్కొక్క దరఖాస్తు అందినట్లు సమాచారం. వచ్చే ఏడాది నాటికి అన్ని 53 శిక్షణా కేంద్రాలు ప్రజలకు పూర్తిగా అందుబాటులోకి రావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మార్పులు అమల్లోకి వస్తే డ్రైవింగ్ లైసెన్సుల జారీ వ్యవస్థ మరింత నిష్పాక్షికం, సులభతరం కానుందనే నమ్మకం వ్యక్తమవుతోంది.