HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Ap Government Spouse Pensions Disabled Verification

Good News : ఆగస్టు 1 నుంచి ఏపీలో స్పౌజ్ పింఛన్‌లు

Good News : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పింఛన్‌ల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా స్పౌజ్‌ (Spouse) పింఛన్‌లు అందించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది.

  • Author : Kavya Krishna Date : 29-07-2025 - 9:28 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ap Gov Logo
Ap Gov Logo

Good News : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పింఛన్‌ల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా స్పౌజ్‌ (Spouse) పింఛన్‌లు అందించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ విషయంపై రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పష్టత ఇచ్చారు. ఎన్టీఆర్‌ భరోసా పథకం కింద కొత్తగా 1,09,155 మందికి నెలకు రూ.4,000 చొప్పున పింఛన్‌లు ఆగస్టు 1 నుంచి అందజేయనున్నట్లు మంత్రి తెలిపారు. పింఛన్ తీసుకుంటూ భర్త మరణించిన సందర్భంలో, భార్యకు స్పౌజ్ కేటగిరీ కింద వెంటనే పింఛన్ అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఆగస్టు 1 నుంచి ఈ కొత్త పింఛన్‌ల కోసం ప్రభుత్వం ప్రతి నెల రూ.43.66 కోట్లు అదనంగా ఖర్చు చేయనుంది.

Khaleel Ahmed: ఇంగ్లాండ్ నుంచి తిరిగి వచ్చిన భారత ఫాస్ట్ బౌలర్!

2023 డిసెంబర్ 1 నుండి 2024 అక్టోబర్ 31 మధ్య భర్తలు మరణించిన కుటుంబాల మహిళలు, అవసరమైన పత్రాలతో ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకున్నారు. భర్త పింఛన్ ఐడీ, మరణ ధ్రువపత్రం సమర్పించిన అర్హులను జాబితాలో చేర్చారు. మొదటగా ఈ పింఛన్‌లు జూన్ 12న (ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా) ఇవ్వాలని భావించారు. కానీ వాయిదా పడటంతో, ఆగస్టు 1 నుంచి అమలు చేయనున్నట్లు మంత్రి స్పష్టం చేశారు.

ఇక మరోవైపు, దివ్యాంగుల పింఛన్‌లపై ఏపీ ప్రభుత్వం సమగ్ర తనిఖీలు ప్రారంభించింది. గత ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని, అనర్హులు లక్ష మందికి పైగా పింఛన్‌లు పొందుతున్నారని అధికారులు గుర్తించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 7.86 లక్షల దివ్యాంగులు పింఛన్‌లు పొందుతున్నారు. కొందరు నెలకు రూ.6 వేల వరకు పింఛన్ పొందుతున్నప్పటికీ, వాస్తవానికి వైకల్యం లేని వారు తప్పుడు ధ్రువపత్రాలు తీసుకున్నారని ఆరోపణలు వెలువడ్డాయి.

మానసిక సమస్యలు, వినికిడి లోపం వంటి నకిలీ సర్టిఫికెట్లు ఉపయోగించి పింఛన్ పొందిన వారిని గుర్తించేందుకు వైకల్య నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ పరీక్షల్లో కూడా అనర్హుల సంఖ్య ఎక్కువగా ఉందని అధికారులు చెబుతున్నారు. గత ప్రభుత్వంలో దివ్యాంగుల కోటాలో రూ.6 వేల, రూ.10 వేల, రూ.15 వేల వరకు పింఛన్‌లు పొందిన వారిలో అనర్హులు ఉన్నట్లు తేలింది. త్వరలో ఈ జాబితాపై అధికారిక క్లారిటీ ఇచ్చి, అనర్హుల పింఛన్‌లు రద్దు చేయనున్నారు. ఏపీ ప్రభుత్వం అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పింఛన్ అందిస్తూనే, అనర్హులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.

Govt Teacher : రూ.70 వేల జీతం తీసుకునే సర్కార్ టీచర్ కు ‘ELEVEN’ స్పెల్లింగ్ రావట్లే..ఏంటి సర్ ఇది !!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • AP government
  • Disabled Pensions
  • Kondapalli Srinivas
  • NTR Bharosa
  • Pension Verification
  • Spouse Pension
  • welfare schemes

Related News

Village development in AP: Centre allocates Rs 16,627 crore.

ఏపీకి కేంద్రం పెద్దపీట.. గ్రామాల అభివృద్ధి.. రూ.16,627 కోట్లు మంజూరు

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం తీపికబురు చెప్పింది. రాష్ట్రంలో గ్రామ పంచాయతీలు, జిల్లా, మండల పరిషత్తులకు భారీగా నిధులు కేటాయించింది. 16వఆర్థిక సంఘం నిధులు ఏకంగా రూ.16,627 కోట్లు కేటాయించారు. ఈ నిధుల్లో బేసిక్ గ్రాంట్ రూ.13,302 కోట్లు కాగా.. పెర్‌ఫార్మెన్స్‌ గ్రాంట్‌ రూ.3,225 కోట్లు ఉన్నాయి. 2026-27 నుంచి 2030-31 వరకు ఐదేళ్లపాటు రాష్ట్రానికి ఈ నిధులు విడుదల చేయనుంది. గత ఐదేళ్లలో కేంద్రం రాష్ట్

  • Massive public meeting on the alliance's two-year rule

    Chandrababu Naidu: కూటమి రెండేళ్ళ పాలనపై భారీ బహిరంగ సభ

  • Zomato gets Rs 9.6 crore GST demand from Andhra Pradesh

    Zomato: జొమాటో కు షాక్.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ. 9.6 కోట్ల జీఎస్‌టీ నోటీసు

  • That is the very day the 'Thalliki Vandanam' money gets credited!

    Thalliki Vandanam: తల్లికి వందనం డబ్బులు పడేది ఆరోజే!

  • Centre sanctions massive funds for AP: Union Minister Pemmasani Chandra Sekhar

    Pemmasani Chandra Sekhar: ఏపీకి కేంద్రం భారీగా నిధులు మంజూరు: కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్

Latest News

  • Sanjana Reddy Inspiring Journey: అమెరికన్ కలను వదులుకున్న టెక్కీ… నేడు ఆమె ఎందరో రైతులకు ఆదర్శం.. ఇంతకీ సంజన రెడ్డి ఎవరు? ఏంటా ఇంట్రెస్టింగ్ స్టోరీ

  • Single: అబ్బాయిలు.. సోలోగా ఉండాలనుకుంటున్నారా? మీ ఆయుష్షు తగ్గినట్లే!

  • అస్సాంలో కూలిన IAF AN-32 విమానం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్!

  • Amaravati Capital: జగన్‌పై మంత్రి నారాయణ ఫైర్

  • Nayeem Hasan: చటోగ్రామ్‌లో బంగ్లాదేశ్ క్రికెటర్ నయీం హసన్‌పై పోలీసులు దాడి.. రచ్చ రచ్చ

Trending News

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd