HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Ap Congress Manifesto Committee Formed Congress Seriously Focusing On Ap

AP Congress : ఓ వైపు షర్మిల.. మరోవైపు పల్లం రాజు.. ఎన్నికలకు ఏపీ కాంగ్రెస్‌ రెడీ

AP Congress : కేంద్ర మాజీ మంత్రి పల్లం రాజు ఆధ్వర్యంలో ఏపీ కాంగ్రెస్‌ మేనిఫెస్టో కమిటీ ఏర్పాటైంది.

  • By Pasha Published Date - 08:35 AM, Fri - 19 January 24
  • daily-hunt
Ap Congress
Ap Congress

AP Congress : కేంద్ర మాజీ మంత్రి పల్లం రాజు ఆధ్వర్యంలో ఏపీ కాంగ్రెస్‌ మేనిఫెస్టో కమిటీ ఏర్పాటైంది. ఈవిషయాన్ని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ వెల్లడించారు. ఈ కమిటీలో సభ్యులుగా కనుమూరి బాపిరాజు, జేడీ శీలం, తులసిరెడ్డి, కమలమ్మ, జంగా గౌతం, ఉషానాయుడు, నజీరుద్దీన్‌, కొరివి వినయ్‌కుమార్‌, గంగాధర్‌, కారుమంచి రమాదేవిలను నియమించారు. కాంగ్రెస్‌ అనుబంధ సంఘాల అధ్యక్షులు ఈ కమిటీలో ప్రత్యేక ఆహ్వానితులుగా ఉంటారు.

We’re now on WhatsApp. Click to Join.

ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్(AP Congress)  లోక్‌సభ అభ్యర్థులను దాదాపుగా ఖరారు చేసినట్లు తెలిసింది. కొన్ని ముఖ్యమైన స్థానాలకు సీనియర్ నేతలను ఎంపిక చేసినట్లు సమాచారం. వైఎస్ షర్మిల పీసీసీ చీఫ్ గా బాధ్యతలను చేపట్టేలోగానే ఎంపీ అభ్యర్థులను ఖరారు చేసే పనిలో పార్టీ అధినాయకత్వం ఉంది. రాబోయే ఎన్నికల్లో వామపక్ష పార్టీలు కాంగ్రెస్‌తో చేతులు కలిపే ఛాన్స్ ఉంది. ఒకవేళ బీజేపీతో టీడీపీ కలిస్తేనే..ఈ అవకాశం ఉండొచ్చు. లేదంటే వామపక్షాలు టీడీపీతో జతకట్టినా ఆశ్చర్యం ఉండదు.కమ్యూనిస్టులు తప్ప మరే పార్టీ కాంగ్రెస్ తో కలిసేందుకు సిద్ధపడే అవకాశాలు కనిపించడం లేదు. అందుకే ఒంటరి పోరుకు కాంగ్రెస్ సిద్ధమవుతుంది. ఇప్పటి నుంచే పార్లమెంటు నియోజకవర్గాల్లో పర్యటనలు చేసి ప్రజలను కలుసుకుంటూ వెళితే కొంత మేర అనుకూల ఫలితాలు వస్తాయని భావిస్తున్నారు. అందుకోసమే సీనియర్ నేతల పేర్లను అనధికారికంగా ఖరారు చేసినట్లు తెలిసింది.

Also Read: Junior NTR Vs TDP : వేటాడి వేటాడి మీ పతనం చూస్తాం.. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎమోషనల్ లెటర్

బాపట్ల లోక్‌సభ నియోజకవర్గం నుంచి జేడీ శీలం, తిరుపతి నియోజకవర్గం నుంచి చింతా మోహన్, నరసాపురం నియోజకవర్గం నుంచి కనుమూరి బాపిరాజు, కాకినాడ నియోజకవర్గం నుంచి పల్లంరాజు, విశాఖపట్నం నుంచి టి. సుబ్బిరామిరెడ్డి, కడప పార్లమెంటు నుంచి వైఎస్ షర్మిల పేర్లు దాదాపుగా ఖరారయ్యాయని చెబుతున్నారు. వీరికి ఇప్పటికే సమాచారం అందడంతో వారు నియోజకవర్గాల్లో పర్యటనలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. గెలుపోటములు ముఖ్యం కాదని, కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా పర్యటనలు ఉండాలని ఏఐసీసీ నుంచి నేతలకు ఆదేశాలు అందినట్లు తెలుస్తోంది. పార్లమెంటు నియోజకవర్గాల్లో కొంత పట్టును సాధించగలిగితే తర్వాత అసెంబ్లీ అభ్యర్థుల ఎన్నిక వ్యవహారాన్ని చూడొచ్చని భావిస్తున్నారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుందని ఏపీ ప్రజలకు ప్రచారంలో చెప్పనున్నారు. వెనుకబడిన రాష్ట్రాలకు అభివృద్ధి నిధులతో పాటు రాష్ట్ర విభజనలోని అంశాలన్నీ నెరవేరుస్తామని హామీ ఇవ్వనున్నారు. రాహుల్ గాంధీ కూడా విశాఖపట్నం, విజయవాడ, కడప ప్రాంతాల్లో ఎన్నికల సమయంలో పర్యటించేందుకు ఓకే చెప్పారట. ప్రియాంక గాంధీ కూడా అనేక నియోజకవర్గాల్లో రోడ్ షోలో పాల్గొనేలా ప్లాన్ చేశారట.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap congress
  • congress
  • Congress Manifesto Committee
  • ys sharmila

Related News

Let's decide who will win!..KTR challenges CM Revanth Reddy

CM Revanth : ఆ ఇద్దరు ఆడించినట్లు రేవంత్ ఆడుతున్నాడు – KTR

CM Revanth : రేవంత్ రెడ్డి తీసుకునే నిర్ణయాలు అన్నీ ప్రధాని మోదీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సంకేతాలకనుగుణంగానే జరుగుతున్నాయని అన్నారు. ముఖ్యంగా మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించి తక్షణ మరమ్మతులు చేపట్టకుండా

  • Elections

    Elections: మార్చిలో స్థానిక సంస్థల ఎన్నికలు?

  • Harish Rao

    Harish Rao: సీఎం రేవంత్‌ వారికి సాయం చేయ‌లేదు.. హ‌రీష్ రావు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

  • Kadiyam Srihari

    Kadiyam Srihari: ఎన్నికల్లో పోటీ చేయను.. కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు!

  • Bjp Ramachandra

    CM Revanth : రేవంత్ ఢిల్లీకి వెళ్లి రావడమే సరిపోతోంది – రామచందర్ కీలక వ్యాఖ్యలు

Latest News

  • Fitness Tips: ప్ర‌స్తుత స‌మాజంలో మ‌నం ఆరోగ్యంగా ఉండాలంటే!

  • India vs Sri Lanka: శ్రీలంక ముందు భారీ ల‌క్ష్యం.. భార‌త్ స్కోర్ ఎంతంటే?

  • America: భార‌త్‌లో ప‌ర్య‌టించనున్న అమెరికా ప్ర‌తినిధులు.. అగ్ర‌రాజ్యానికి మోదీ స‌ర్కార్ కండీష‌న్‌!

  • Election Schedule: రేపు స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుద‌ల‌?

  • Formula E Car Race Case : అరెస్ట్ చేస్తే చేసుకోండి – కేటీఆర్

Trending News

    • Prime Minister Routine Checkup: ప్రధానమంత్రి మోదీ ఆరోగ్య ప్రోటోకాల్.. ప్రతి 3 నెలలకు ఒకసారి చెకప్!

    • Rupee: పుంజుకున్న రూపాయి.. బ‌ల‌హీన‌ప‌డిన డాల‌ర్‌!

    • IND vs PAK Final: భార‌త్‌- పాక్ మ‌ధ్య ఫైన‌ల్ మ్యాచ్‌.. పైచేయి ఎవ‌రిదంటే?

    • Ladakh: లడఖ్‌లో ఉద్రిక్త ప‌రిస్థితుల‌కు కార‌ణాలీవేనా??

    • UPI Boom: యూపీఐ వినియోగం పెరగడంతో నగదు వాడకం తగ్గింది: ఆర్‌బీఐ

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd