HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Ap Bjp Chief Madhav Key Comments On Kadapa Tour

AP BJP Chief Madhav: ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

బీజేపీ జాతీయ పార్టీ అజెండాతో పాటు, రాష్ట్రానికి ప్రత్యేక అజెండాతో ముందుకు వెళ్తామని మాధవ్ తెలిపారు. ప్రస్తుతం కూటమిలో బీజేపీ భాగస్వామి మాత్రమేనని, ప్రభుత్వాన్ని టీడీపీ నిర్వహిస్తుందని ఆయన పేర్కొన్నారు.

  • Author : Gopi Date : 27-07-2025 - 3:57 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
AP BJP Chief Madhav
AP BJP Chief Madhav

AP BJP Chief Madhav: ఆంధ్రప్రదేశ్ బీజేపీ నూతన రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ (AP BJP Chief Madhav) కడప జిల్లా నుంచి తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. ‘సారథ్యం’ అనే నూతన లక్ష్యంతో పార్టీని ముందుకు తీసుకెళ్లనున్నట్లు ఆయన ప్రకటించారు. తిరుమల తొలి గడప అయిన కడప నుంచే తన రాష్ట్ర పర్యటనను ప్రారంభించడం వెనుక అనేక కారణాలు ఉన్నాయని ఆయన వెల్లడించారు.

కడప ఎంపిక వెనుక గల కారణాలు

“తెలుగు భాష వెలుగులు తీసుకొచ్చిన కడపను ఎన్నుకున్నాం. వేలాది కీర్తనలు రాసిన తాళ్ళపాక అన్నమాచార్యులు, ప్రజాకవి యోగి వేమన, తెలుగును ప్రపంచానికి తెలిసేలా కృషి చేసిన సీపీ బ్రౌన్ వంటి మహనీయులు నడయాడిన గడ్డ ఇది” అని మాధవ్ అన్నారు. కడప కేవలం సాహిత్య, చారిత్రక నేపథ్యం ఉన్న ప్రాంతమే కాకుండా, రాజకీయంగా కూడా ఎంతో ప్రాధాన్యత కలిగి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. అందుకే తన రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా రాజకీయ ప్రస్థానాన్ని కడప నుంచే మొదలుపెట్టానని తెలిపారు.

‘సారథ్యం’ అంటే ఏమిటి?

తన సారథ్యంలో పార్టీ లక్ష్యాలను వివరిస్తూ “సారథ్యం అంటే… ప్రతి బీజేపీ కార్యకర్త సారథ్యంలో బీజేపీ సారథ్యం కావడమే లక్ష్యం” అని మాధవ్ స్పష్టం చేశారు. ప్రతి కార్యకర్త కూడా బీజేపీ దేశం కోసం చేసిన ప్రతి విషయాన్ని ప్రజలకు చేరవేయడానికి కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

Also Read: Nitish Kumar Reddy: టీమిండియా క్రికెట‌ర్ నితీష్ కుమార్ రెడ్డిపై కేసు.. రూ. 5 కోట్లు క‌ట్టాల‌ని!

మోదీ ప్రభుత్వ విజయాలు, రాయలసీమ అభివృద్ధి

ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో భారత్ ఆధునాతన నిర్మాణం జరిగిందని మాధవ్ కొనియాడారు. మోదీ లక్ష్యం ప్రతి వ్యక్తి జీవితంలో అవసరమైన ప్రతి ఒక్కటి అందించడమేనని అన్నారు. ప్రతి గ్రామానికి రెండు, మూడు కోట్లతో నిధులు సమకూర్చిన ఘనత మోదీకే దక్కుతుందని ఆయన పేర్కొన్నారు. రాయలసీమ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టిందని ఉద్ఘాటించారు. కొప్పర్తి పారిశ్రామిక వాడకు వంద కోట్లు కేటాయించారని, బెంగళూరు-అమరావతి ఎక్స్‌ప్రెస్ హైవేతో పాటు అనేక జాతీయ రహదారులు రాయలసీమ మీదుగా వెళుతున్నాయని ఆయన గుర్తు చేశారు.

కార్యకర్తలకు ప్రాధాన్యత

బీజేపీలో సాధారణ కార్యకర్తకు అత్యంత ప్రాధాన్యత ఉంటుందని మాధవ్ అన్నారు. “అనేక సంవత్సరాలుగా పనిచేసిన కార్యకర్తలను గుర్తించి వారికి మేలు చేసేలా చర్యలు తీసుకుంటాం” అని హామీ ఇచ్చారు. బీజేపీ జెండా ఎగరేయ్యాలనే తపనతో పనిచేసిన కార్యకర్తల వల్లే నేడు బీజేపీ అధికారంలో ఉందని ఆయన స్పష్టం చేశారు. చిన్న కార్యకర్త అయిన తనను రాష్ట్ర అధ్యక్షుడిని చేయడం, అలాగే జాతీయ అధ్యక్షుడికి కూడా పెద్దగా తెలియకపోయినా, ఆయన పార్టీ కోసం అంకితభావంతో పనిచేసే సాధారణ కార్యకర్తగా ఎదగడం బీజేపీలో మాత్రమే సాధ్యమవుతుందని పేర్కొన్నారు.

రాబోయే ఎన్నికలు, పార్టీ భవిష్యత్తు

బీజేపీ జాతీయ పార్టీ అజెండాతో పాటు, రాష్ట్రానికి ప్రత్యేక అజెండాతో ముందుకు వెళ్తామని మాధవ్ తెలిపారు. ప్రస్తుతం కూటమిలో బీజేపీ భాగస్వామి మాత్రమేనని, ప్రభుత్వాన్ని టీడీపీ నిర్వహిస్తుందని ఆయన పేర్కొన్నారు. అయితే, రాబోయే స్థానిక ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగురవేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. “బీజేపీలో ప్రజా నాయకులను తయారు చేసే విధంగా ముందుకు వెళతాం. అందరం కలిసి బీజేపీకి వైభవాన్ని పెంచేలా పని చేయాలి” అని మాధవ్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • AP BJP chief
  • AP BJP Chief Madhav
  • ap politics
  • bjp
  • kadapa tour
  • nda govt
  • pm modi

Related News

TDP Mahanadu 2026 Event In Nellore

Mahanadu: నెల్లూరులో టీడీపీ మహానాడు.. వేదిక ఖరారు!

తెలుగుదేశం పార్టీ (టీడీపీ) వార్షిక మహానాడుకు వేదిక, తేదీలు ఖరారయ్యాయి. ఈ ఏడాది మహానాడును శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. మే 27, 28, 29 తేదీల్లో మూడు రోజుల పాటు ఈ కార్యక్రమం జరగనుంది. పార్టీ చరిత్రలో నెల్లూరు జిల్లాలో మహానాడు నిర్వహించడం ఇదే ప్రథమం. మహానాడు వేదికగా నెల్లూరు జిల్లాలోని కొడవలూరు మండలంలో ఉన్న ఇఫ్కో కిసాన్ స్పెషల్ ఎక

  • Rahul Vote Chori Haryana

    Rahul : సెంచరీకి చేరువలో రాహుల్ అంటూ పరువు తీసిన బిజెపి

  • Mamatha Neet

    West Bengal Result 2026 : మమతా బెనర్జీ కీలక ప్రకటన

  • Tamilisai

    Tamilisai Soundararajan : తమిళిసైకి వరుసగా ఏడో ఓటమి!

  • 5 States Election Results 2

    Election Results 2026 : ఐదు రాష్ట్రాల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి ?

Latest News

  • Amazon Great Summer Sale : హై-ఎండ్ హెడ్‌ఫోన్లపై డిస్కౌంట్లు

  • Amazon : కిరాణా సామాగ్రిపై 50% ఆఫ్.. అమెజాన్ సమ్మర్ సేల్ 2026 టాప్ డీల్స్ ఇవే!

  • CM Vijay: సీఎంకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు

  • Weight Loss: సడెన్‌గా బరువు తగ్గారా..?

  • CM Joseph Vijay: మీ విజయ్‌ మామ అండగా ఉంటాడు : సీఎం విజయ్‌

Trending News

    • TVK విజయ్‌ అను నేను..

    • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

    • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

    • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

    • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd