HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Another Vande Bharat Express To Andhra Pradesh From 12th Of March

Vande Bharat – AP : 12 నుంచి ఏపీకి మరో ‘వందేభారత్’.. హాల్టింగ్ స్టేషన్లు ఇవీ

Vande Bharat - AP : మరో వందేభారత్ రైలు ఆంధ్రప్రదేశ్‌‌లో ఈ నెల 12 నుంచి అందుబాటులోకి రానుంది.

  • Author : Pasha Date : 08-03-2024 - 8:27 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Vande Bharat Express
Tirumala Vande Bharat

Vande Bharat – AP : మరో వందేభారత్ రైలు ఆంధ్రప్రదేశ్‌‌లో ఈ నెల 12 నుంచి అందుబాటులోకి రానుంది. భువనేశ్వర్‌ – విశాఖ – భువనేశ్వర్‌ వందేభారత్‌ రైలును ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆ రోజున వర్చువల్‌‌గా ప్రారంభించనున్నారు. ఈ రైలుకు సంబంధించిన ట్రయల్ రన్‌ను ఇవాళ (శుక్రవారం) నిర్వహించేందుకు రైల్వేశాఖ ఏర్పాట్లు చేసింది. కొత్త వందేభారత్ ట్రైన్‌పై మరిన్ని వివరాలు ఇవీ..

We’re now on WhatsApp. Click to Join

  • ‘భువనేశ్వర్‌ – విశాఖ – భువనేశ్వర్‌’ వందేభారత్‌ రైలు సోమవారం మినహా వారానికి ఆరు రోజుల పాటు నడుస్తుంది.
  • మొత్తం 443 కిలోమీటర్లు ఈ రైలు ప్రయాణిస్తుంది.
  • ప్రతిరోజు ఉదయం 5.15 గంటలకు భువనేశ్వర్‌ నుంచి ఈ రైలు బయలుదేరుతుంది. ఖుర్ధారోడ్‌‌కు 5.33 గంటలకు, బరంపూర్‌‌కు 7.05 గంటలకు, ఇచ్ఛాపురం‌నకు 7.18 గంటలకు, పలాసకు 8.18 గంటలకు, శ్రీకాకుళం రోడ్‌ (ఆముదాలవలస)కు 9.03 గంటలకు, విజయనగరంనకు 9.48 గంటలకు, విశాఖపట్నానికి ఉదయం 11 గంటలకు చేరుతుంది.
  • విశాఖపట్నం నుంచి సాయంత్రం 3.45 గంటలకు ఈ రైలు బయలుదేరుతుంది. విజయనగరంనకు 4.30 గంటలకు, శ్రీకాకుళం రోడ్‌కు 5.28 గంటలకు, పలాసకు 6.30 గంటలకు, ఇచ్ఛాపురంనకు 7.00 గంటలకు, బరంపూర్‌‌కు 7.20 గంటలకు, ఖుర్ధారోడ్‌‌కు 8.57 గంటలకు, భువనేశ్వర్‌‌కు 9.30 గంటలకు రైలు చేరుకుంటుంది.
  • ప్రతి రైల్వేస్టేషన్‌ వద్ద ఈ రైలు రెండు నిమిషాలు ఆగుతుంది.

Also Read : Political Entry : 15న వైఎస్ సునీతారెడ్డి సంచలన ప్రకటన..?

  • ప్రస్తుతం వందేభారత్‌ రైళ్ల బోగీలను చెన్నైలోని రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీలో తయారు చేస్తున్నారు. ఆ ఫ్యాక్టరీ సామర్థ్యం తక్కువగా ఉండటంతో వారానికి ఒక బోగీ మాత్రమే తయారవుతోంది.
  • రాష్ట్ర విభజన చట్టం ప్రకారం తెలంగాణలోని కాజీపేటలో రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ (ఆర్‌సీఎఫ్‌)ని ఏర్పాటు చేయాల్సి ఉంది. అందుకు తొలుత అంగీకరించిన కేంద్రం.. ఆ తర్వాత మాట మార్చింది. కాజీపేటలో ఆర్‌సీఎఫ్‌ను ఏర్పాటు చేయడం లేదని ప్రకటించి తెలంగాణకు తీవ్ర అన్యాయం చేసింది.
  • కాజీపేటలో ఆర్‌సీఎఫ్‌ను ఏర్పాటు చేసినట్టయితే వందేభారత్‌తోపాటు ఇతర రైళ్ల బోగీలను వేగంగా తయారు చేసేందుకు వీలయ్యేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

తెలంగాణకు మొండిచెయ్యి

రైల్వే ప్రయాణికులకు అత్యాధునిక సౌకర్యాలతో ప్రయాణ సౌకర్యం కల్పించాలన్న ఉద్దేశంతో కొత్తగా ప్రవేశపెట్టిన వందేభారత్‌ రైళ్ల సంఖ్య ఏడాది దాటినా అంతంత మాత్రంగానే ఉన్నది. ఏటా 100 వందేభారత్‌ రైళ్లను ప్రారంభిస్తామని నిరుడు ఎంతో ఆర్భాటంగా ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం.. ఇప్పటివరకు 50 రైళ్లను కూడా ప్రారభించలేదు. వందేభారత్‌ రైళ్ల విషయంలో కేంద్రం దక్షిణ మధ్య రైల్వే జోన్‌కు తీవ్ర అన్యాయం చేస్తున్నది. ఉత్తర భారతావనిలోని వివిధ ప్రాంతాల మధ్య అనేక వందేభారత్‌ రైళ్లను నడుపుతున్న నరేంద్రమోడీ సర్కారు.. తెలంగాణ ప్రాంతంలో కేవలం 3 రైళ్లను ప్రారంభించి చేతులు దులిపేసుకున్నది. దక్షిణ మధ్య రైల్వే జోన్‌లో అత్యంత కీలకమైన హైదరాబాద్‌/సికింద్రాబాద్‌ నుంచి పలు ప్రాంతాలకు వందేభారత్‌ రైళ్లను ఏర్పాటు చేయాలన్న డిమాండ్లను కేంద్రం ఏ మాత్రం పట్టించుకోవడం లేదు.

Also Read :Hyderabad: హైదరాబాద్‌లో ఉద్యోగులకు సెలవులు రద్దు.. ఎందుకంటే..?


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • March 12th
  • Vande Bharat - AP
  • Vande Bharat Express

Related News

Mlc Anantha Babu Arrest

MLC Anantha Babu: మరో వారంలో దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం వర్ధంతి.. జగన్ స్నేహితుడు అనంతబాబు జైలుకి

డ్రైవర్ సుబ్రమణ్యం హత్య కేసులో అనంతబాబుకు బెయిల్ రద్దు. బెయిల్ రద్దు చేస్తూ రాజమహేంద్రవరం ప్రత్యేక న్యాయస్థానం తీర్పు. సుబ్రమణ్యం హత్యకేసులో నలుగురు సాక్షులను ప్రలోభపెట్టిన అనంతబాబు. సాక్షుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన కాకినాడ జిల్లా సర్పవరం పోలీసులు. సాక్షులను బెదిరించిన కేసులో అనంతబాబును ఏప్రిల్ 24న అరెస్టు చేసిన పోలీసులు. ప్రస్తుతం రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుల

  • Tdp

    TDP: రాజ్యసభకు టీడీపీ నుంచి భారీగా ఆశావహుల

  • Deputy CM to arrive in AP today

    Pawan Kalyan: నేడు ఏపీకి డిప్యూటీ సీఎం రాక

  • Minister Narayana inspected the MLA and MLC buildings in Amaravati.

    AP Government: అమరావతిలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ భవనాలను పరిశీలించిన మంత్రి నారాయణ

  • Key Meeting with Union Minister C.R. Patil Chandrababu

    Chandrababu Naidu: కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్‌తో కీలక భేటీ : చంద్రబాబు

Latest News

  • YSRCP: దస్తగిరి హత్య కేసులో వైసీపీ నేతకు బిగుస్తున్న ఉచ్చు…..!!

  • Ghar Soap Ad Controversy: అలీ ఘర్ సబ్బు యాడ్‌ వివాదం

  • Petrol price: పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై ఆర్‌బీఐ గవర్నర్‌ షాకింగ్ కామెంట్స్

  • Nara Lokesh: ‘మేడ్ ఇన్ ఆంధ్ర ప్రదేశ్’.. మంత్రి నారా లోకేష్ ట్వీట్

  • iBOMMA: టాలీవుడ్‌కి బిగ్‌షాక్‌.. రీ ఎంట్రీ ఇచ్చిన ఐబొమ్మ

Trending News

    • TVK విజయ్‌ అను నేను..

    • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

    • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

    • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

    • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd