HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Andhra Pradesh Tomato Farmer Killed By Robbers

Crime News: ఏపీలో దారుణం.. టమోటా రైతును హత్య చేసిన దుండగులు

ఆంధ్రప్రదేశ్ లో దారుణం జరిగింది. అన్నమయ్య జిల్లాలో ఓ రైతు గొంతు కోసి హత్య చేశారు దుండగులు. రైతు వద్ద 30 లక్షల రూపాయలు ఉన్నట్లు అనుమానించిన దుండగులు రాత్రి రైతు ఇంటికి వెళ్లి హత్యకు పాల్పడ్డారు.

  • Author : Praveen Aluthuru Date : 13-07-2023 - 2:06 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Crime News
New Web Story Copy 2023 07 13t140343.549

Crime News: ఆంధ్రప్రదేశ్ లో దారుణం జరిగింది. అన్నమయ్య జిల్లాలో ఓ రైతు గొంతు కోసి హత్య చేశారు దుండగులు. రైతు వద్ద 30 లక్షల రూపాయలు ఉన్నట్లు అనుమానించిన దుండగులు రాత్రి రైతు ఇంటికి వెళ్లి హత్యకు పాల్పడ్డారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కేసును ఛేదించేందుకు నాలుగు బృందాలను ఏర్పాటు చేసినట్లు డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ) కేశప్ప తెలిపారు.

దేశంలో టమోటా ధరలు ఆకాశాన్నంటాయి. ప్రస్తుతం సామాన్యులు టమోటా కొనే పరిస్థితుల్లో లేరు. ఈ సమయంలో టమోటా రైతులకు భారీ గిట్టుబాటు లభిస్తుంది. లక్షలు సంపాదిస్తున్నారు. ఇదంతా బాగానే ఉన్నప్పటికీ టమోటా ధరలు కొందరు రైతుల పాలిట శాపంగా మారింది. టమోటా వ్యాపారుదారులను టార్గెట్ చేస్తున్నారు దుండగులు. పలు చోట్ల హత్యలు జరిగాయి. తాజాగా ఏపీలో టమోటా వ్యాపారి అంటే రైతుపై దుండగులు దాడి చేసి అతి కిరాతంగా హత్య చేశారు.

ఆంధ్రప్రదేశ్‌లోని అన్నమయ్య జిల్లా, మదనపల్లె మండలం బోడిమల్లదిన్నె గ్రామానికి దూరంగా వ్యవసాయ పొలంలో ఉంటున్న రైతు నరెం రాజశేఖర్‌రెడ్డి (62) హత్యకు గురయ్యాడు. పాలు పోసేందుకు వేరే గ్రామానికి వెళ్తున్నాడు. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు టమాటా కొనే నెపంతో పొలానికి వచ్చారని అతని భార్య పోలీసులకు తెలిపింది. భర్త బయటకు వెళ్లాడని ఆమె చెప్పడంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు ఆ దుండగులు. అయితే మార్గ మధ్యన టమోటా రైతును గుర్తించి దాడికి పాల్పడ్డారు. దుండగులు అతడిని అడ్డగించి చేతులు, కాళ్లు కట్టేసి గొంతుకోసి హత్య చేశారు. విపరీతంగా పెరుగుతున్న ధరలను దృష్టిలో ఉంచుకుని ఇటీవల వ్యవసాయ మార్కెట్‌లో టమోటాలు విక్రయించడం ద్వారా రైతు రూ.30 లక్షలు సంపాదించినట్లు సమాచారం. టమాటా అమ్మి వచ్చిన డబ్బును దోచుకునేందుకు వచ్చి రైతును హత్య చేయడం అత్యంత బాధాకరం.

Read More: Fake woMarriages: బడాబాబులకు ప్రేమ వల.. 8 పెళ్లిళ్లు చేసుకున్న నిత్య పెళ్లికూతురు


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 30 lakh
  • 62 old
  • andhra pradesh
  • Annamayya District
  • farmer
  • killed
  • Narem Rajasekhar Reddy
  • Robbers
  • tomato

Related News

New twist in Nayeem's disproportionate assets case.. ED chargesheet in court

నయీం అక్రమాస్తుల కేసులో కొత్త మలుపు.. కోర్టులో ఈడీ ఛార్జిషీట్

మనీలాండరింగ్ ఆరోపణలపై హైదరాబాద్‌లోని రంగారెడ్డి జిల్లా కోర్టులో ఈడీ ఛార్జిషీట్ దాఖలు చేసింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం–2002 (PMLA) కింద సమర్పించిన ఈ అభియోగ పత్రాన్ని కోర్టు స్వీకరించడంతో కేసు విచారణకు గ్రీన్ సిగ్నల్ లభించింది.

  • CM Chandrababu participated in the parliamentary committees workshop

    పార్టీ కంటే ఏదీ ముఖ్యం కాదు.. నిర్లక్ష్యం వహిస్తే వేటు తప్పదు : చంద్రబాబు వార్నింగ్

  • India Republic Day

    రాజధాని అమరావతిలో తొలిసారి ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

Latest News

  • ఏపీలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్

  • అతడి భార్య అందంగా ఉందని పదవి ఇచ్చా..నోరు జారిన డోనాల్డ్ ట్రంప్..!

  • సంజు శాంసన్‌పై సూర్యకుమార్ యాదవ్ సరదా వ్యాఖ్యలు!

  • పసిడి ధరలకు రెక్కలు.. భారత్‌లో భారీగా తగ్గిన గోల్డ్‌

  • తమిళనాడు ఎన్నికల్లో విజయ్ గెలిచే ఛాన్స్ ఉందా ? మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే ఏమంటుంది ?

Trending News

    • భారత్- న్యూజిలాండ్ 5వ టీ20.. వాతావ‌ర‌ణం ఎలా ఉంటుందంటే?!

    • పీఎం కిసాన్ ప‌థ‌కం 22వ వాయిదా విడుదల ఎప్పుడంటే?!

    • ఇప్పుడు ఎన్నికలు జరిగితే దేశంలో ఎవరి ప్రభుత్వం ఏర్పడుతుందో తెలుసా?

    • ఆర్థిక సర్వేను ప్ర‌వేశ పెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి.. జీడీపీ అంచ‌నా ఎంతంటే?!

    • బంగారం పై నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన..ఏకంగా రూ. 12 లక్షల కోట్లు..!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd