HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Andhra Pradesh Power Plants Running Out Of Coal Stocks

మోడీకి జగన్ రిక్వెస్ట్.. వెంటనే జోక్యం చేసుకోవాలంటూ..!

దేశవ్యాప్తంగా పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తుండటం.. బొగ్గు ఉత్తత్పి చేసే కంపెనీల్లో పనులు నిలిచిపోవడంతో అంతటా విద్యుత్ సంక్షోభం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం జగన్ రెడ్డి ప్రధాని మోడీకి లేఖ రాశారు.

  • By Balu J Published Date - 04:39 PM, Mon - 11 October 21
  • daily-hunt

దేశవ్యాప్తంగా పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తుండటం.. బొగ్గు ఉత్తత్పి చేసే కంపెనీల్లో పనులు నిలిచిపోవడంతో అంతటా విద్యుత్ సంక్షోభం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం జగన్ రెడ్డి ప్రధాని మోడీకి లేఖ రాశారు. రాష్ట్రంలో విద్యుత్ తీవ్ర సంక్షోభం ఉన్నందున వెంటనే జోక్యం చేసుకోవాలని రిక్వెస్ట్ చేశారు. అనంతరం రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ గత ఆరు నెలల్లో 15 శాతం, గత నెల నుండి 20 శాతం పెరిగిందని.. బొగ్గు నిల్వలు ఆందోళనకరస్థాయిలో పడిపోవడంతో ఆయన కేంద్ర సహకారాన్ని కోరారు. ఇక, ఏపీ జెన్ కో అధీనంలోని థర్మల్ ప్లాంట్‌ స్థాపిత సామర్థ్యంలో 50 శాతం మాత్రమే విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నాయని ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు సీఎం వైఎస్‌ జగన్. ఏపీకి 20 బొగ్గు ర్యాక్స్ ను కేటాయించాల్సిందిగా కేంద్ర రైల్వే, బొగ్గు శాఖకు ఆదేశించాలని లేఖలో ప్రధాని మోడీకి విజ్ఞప్తి చేశారు. ఓఎన్జీసీ, రిలయన్స్ నుంచి అత్యవసర ప్రాతిపదికన రాష్ట్రంలో గ్యాస్ ప్లాంట్లకు గ్యాస్ సరఫరా చేయాలని లేఖలో కోరిన ఏపీ సీఎం.. బొగ్గు కొనుగోళ్ల కోసం డిస్కమ్ లకు సంక్షోభం నుంచి బయటపడే వరకు ఉదారంగా రుణాలు ఇవ్వాలని విన్నవించుకున్నారు.

ప్రస్తుతం అన్ని థర్మల్ విద్యుత్ ప్లాంట్ల లోను వంద శాతం ఉత్పత్తి జరగడం లేదని ఏపీ అధికారులు పేర్కొంటున్నారు. బొగ్గు సరఫరా లేక పోవడం వల్లే బహిరంగ మార్కెట్ నుంచి కొనుగోలు చేస్తున్నామని చెప్పుకొచ్చారు. గత నెలలో16 తేదీన లో యూనిట్ కు 4.60 పైసలు ఉంటే ఇప్పుడు ఆగస్టు 7 తేదీన 14 రూపాయలకు చేరిందన్నారు. పీక్ డిమాండ్ ఉన్న సమయంలో అధిక రేటు పెట్టి కొనాల్సి ఉంటుందన్నారు. ఒక్కోసారి విద్యుత్ కూడా అందుబాటులో లేని పరిస్థితి వచ్చిందని చెప్పారు. బొగ్గు ఉంటే జెన్కో ప్లాంట్ ల నుంచి మరో 40 మిలియన్ యూనిట్లు ఉత్పత్తి చేసుకోవచ్చని వివరించారు.

బొగ్గు కొరత నేపథ్యంలో డిమాండ్, సరఫరా మధ్య తీవ్ర అంతరం ఏర్పడింది. రాష్ట్రంలోని థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో ఒకటి రెండు రోజులకు సరిపడా నిల్వలు మాత్రమే ఉండటంతో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో విద్యుత్ వినియోగంపై ప్రభుత్వం కీలక సూచనలు చేసింది. సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఏసీల వాడకం నిలిపివేయాలని కోరడం విద్యుత్ సంక్షోభానికి తీవ్ర అద్దం పడుతోంది.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap
  • cm jagan
  • letter
  • modi
  • power supply

Related News

Lokesh Google

Lokesh US Tour : పెట్టుబడులే లక్ష్యంగా లోకేష్ యూఎస్ టూర్

Lokesh US Tour : రాష్ట్రంలో పెట్టుబడులు ఆకర్షించడం మరియు ప్రవాసాంధ్రులతో (NRIలు) అనుబంధాన్ని బలోపేతం చేసుకోవడం ఈ పర్యటన ప్రధాన లక్ష్యంగా ఉంది

  • Bihar Election Congress

    Bihar Election Results Effect : ఏడుగురు నేతలపై కాంగ్రెస్ వేటు

  • Chandrababu

    CBN : మెరుగైన పాలన దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం

  • New Districts In Ap

    New Districts in AP : ఏపీలో రెండు కొత్త జిల్లాలు, 4 రెవెన్యూ డివిజన్లు!

  • Grama Panchayat Election In

    Grama Panchayat Election : ఏపీలో మళ్లీ ఎన్నికల జాతర

Latest News

  • Delhi Blast Case: ఢిల్లీ పేలుడు కేసులో ఇద్దరు నిందితులకు రిమాండ్!

  • Indian Constitution: భారత రాజ్యాంగం.. డా. అంబేద్కర్ ఒక్కరే రాశారా?

  • Imran Khan: ఇమ్రాన్ ఖాన్ చ‌నిపోయారా? 3 వారాలుగా కుటుంబానికి నో ఎంట్రీ!

  • Virat Kohli: ప్రధాని మోదీ విరాట్ కోహ్లీకి కాల్ చేయాలి: పాక్ మాజీ క్రికెటర్

  • Gautam Gambhir: గౌతమ్ గంభీర్ కోచింగ్‌లో టీమిండియా టెస్ట్ ఫ‌లితాలీవే!

Trending News

    • WTC Points Table: సౌతాఫ్రికాతో ఓట‌మి త‌ర్వాత‌ టీమిండియాకు మ‌రో బిగ్ షాక్‌!

    • Annadata Sukhibhava : ఏపీ రైతుల అకౌంట్‌లలోకి మరో రూ.6వేలు..అచ్చెన్నాయుడు శుభవార్త !

    • Constitution Day : ప్రజల మహోన్నత శక్తి.. రాజ్యాంగం

    • Mumbai 26/11 Terror Attack : ముంబై మారణహోమానికి 17 ఏళ్లు

    • Andhra King Taluka: ‘ఆంధ్ర కింగ్ తాలూకా’.. సెన్సార్ టాక్ సూపర్ పాజిటివ్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd