AP: మహిళలపై అనుచిత వ్యాఖ్యలు..కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టు !
రాజధాని రైతులు, మహిళలు, రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ కంభంపాటి శిరీష్ ఫిర్యాదు మేరకు ఈ చర్య తీసుకోబడింది. ఈ కేసులో కొమ్మినేని శ్రీనివాసరావుతో పాటు జర్నలిస్టు కృష్ణంరాజు, సాక్షి యాజమాన్యంపై కూడా కేసులు నమోదు చేయబడ్డాయి. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, ఇతర సెక్షన్ల కింద ఈ కేసులు నమోదు చేయబడ్డాయని సమాచారం.
- Author : Latha Suma
Date : 09-06-2025 - 11:37 IST
Published By : Hashtagu Telugu Desk
AP : సాక్షి టీవీ యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావును ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్లోని జర్నలిస్టు కాలనీలోని ఆయన నివాసానికి వెళ్లి పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. సాక్షి టీవీ ఛానెల్లో చర్చ సందర్భంగా అసభ్య వ్యాఖ్యల అంశంలో గుంటూరు జిల్లా తుళ్లూరు పోలీసుల ఆధ్వర్యంలో కేసు నమోదు చేయబడింది. రాజధాని రైతులు, మహిళలు, రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ కంభంపాటి శిరీష్ ఫిర్యాదు మేరకు ఈ చర్య తీసుకోబడింది. ఈ కేసులో కొమ్మినేని శ్రీనివాసరావుతో పాటు జర్నలిస్టు కృష్ణంరాజు, సాక్షి యాజమాన్యంపై కూడా కేసులు నమోదు చేయబడ్డాయి. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, ఇతర సెక్షన్ల కింద ఈ కేసులు నమోదు చేయబడ్డాయని సమాచారం.
Read Also: Kaleshwaram Commission : రాజకీయాల కోసం రాష్ట్ర నీటి హక్కులను కాలరాయొద్దు : హరీశ్రావు
ఇటీవల, సినీ నటుడు శివాజీ సాక్షి ఛానెల్పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ..”నా మీద ఒక చెత్త కేసు ఉంది. మీ ఓనర్పై 36 కేసులు ఉన్నాయి. పదహారు నెలలు జైల్లో ఉండి వచ్చాడు. నేను ఆయన్ని అవినీతిపరుడనని చెప్పలేదు. ఆరోపణలు నిరూపించలేదు. ముందు సాక్షి ఛానెల్ను, కొమ్మినేని శ్రీనివాసరావును సెట్ చేయాలి” అని అన్నారు. ఈ పరిణామాలు సాక్షి ఛానెల్పై విమర్శలు, ప్రశ్నలు రేకెత్తిస్తున్నాయి. రాజకీయ, మీడియా రంగాల్లో ఈ ఘటన ప్రభావం చూపిస్తుంది. పోలీసులు కొమ్మినేని శ్రీనివాసరావును అరెస్టు చేయడం, తదనంతర పరిణామాలు చర్చనీయాంశంగా మారాయి.
కాగా, మహిళలను కించ పరిచేలా అసభ్యరమైన వ్యాఖ్యలు చేసిన వారి పైన చర్యలు తీసుకోవాలని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య, డిప్యూటీ సీఎం పవన్ తో సహా పలువురు డిమాండ్ చేసారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసిన వారిని ఉపేక్షించేది లేదని సీఎం చంద్రబాబు ఇప్పటికే తేల్చి చెప్పిన విషయం తెలిసిందే.
Read Also: Anchor Sravanthi : బెడ్పై వైన్ బాటిల్ తో రెచ్చిపోయిన యాంకర్ స్రవంతి