Russia Ukraine war: ఒడెస్సా నగరంపై ఎటాక్ చేస్తున్న రష్యా
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం భీకరంగా కొనసాగుతుంది. ఉక్రెయిన్పై రష్యా నిరంతరం వైమానిక దాడులు నిర్వహిస్తోంది. ఒడెస్సాలో రష్యా సైన్యం పలు పేలుళ్లకు పాల్పడింది.
- Author : Vamsi Chowdary Korata
Date : 08-05-2023 - 7:15 IST
Published By : Hashtagu Telugu Desk
Russia Ukraine war: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం భీకరంగా కొనసాగుతుంది. ఉక్రెయిన్పై రష్యా నిరంతరం వైమానిక దాడులు నిర్వహిస్తోంది. ఒడెస్సాలో రష్యా సైన్యం పలు పేలుళ్లకు పాల్పడింది. పుతిన్ సైన్యం వైమానిక దాడుల కారణంగా ఉక్రెయిన్లోని పలు నగరాల్లో వైమానిక దాడుల రెడ్ అలర్ట్ వినిపిస్తోంది.
స్థానిక అధికారి ప్రకారం క్షిపణి దాడి తర్వాత పెద్ద పేలుడు శబ్దం వినిపించింది. ఒడెస్సా నగరంలో రాత్రిపూట క్షిపణులు పడుతూనే ఉన్నాయని ఆయన చెప్పారు. ఒడెస్సా సైనిక ప్రతినిధి సెర్హి బ్రాచుక్ తన టెలిగ్రామ్ ఛానెల్లో మాట్లాడుతూ రాష్ట్రంలో రష్యా క్షిపణి దాడి జరిగిందని చెప్పారు. ఎయిర్ రైడ్ అలారం మోగే వరకు ప్రజలు షెల్టర్లలో ఉండాలని ప్రతినిధి కోరారు. ఉక్రేనియన్ పబ్లిక్ బ్రాడ్కాస్టర్ సాస్పిల్నే మాట్లాడుతూ.. ఒడెస్సాలో భారీ పేలుడు జరిగినట్లు అలాగే దక్షిణాన ఖెర్సన్లో భారీ పేలుడు సంభవించిన తర్వాత అగ్నిప్రమాదం సంభవించినట్లు తెలిపారు. ఇక ఒడెస్సాపై రష్యా జరిపిన దాడిపై ఉక్రెయిన్ మీడియా పలు కథనాలను ప్రచురించింది.
కీవ్లోని స్వయాతోషిన్ జిల్లాలో రష్యా డ్రోన్ దాడి చేసింది. ఈ దాడిలో గాయపడిన వారి గురించి ప్రస్తుతానికి ఎటువంటి సమాచారం లేదు. అదే సమయంలో బఖ్ముత్ కోసం రష్యా పోరాటాన్ని తీవ్రతరం చేసిందని, త్వరలో దానిని కూడా స్వాధీనం చేసుకోవచ్చని ఉక్రెయిన్ జనరల్ చెప్పారు. ఉక్రెయిన్ కమాండర్ కల్నల్ జనరల్ ఒలెక్సాండర్ సిర్స్కీ మాట్లాడుతూ రష్యా దళాలు నగరంపై భారీగా షెల్లింగ్ ప్రారంభించాయని చెప్పారు.
Read More: Boat Tragedy Kerala : టూరిస్ట్ బోటు బోల్తా.. 21 మంది మృతి