Terrorist Attack In Istanbul : ఇస్తాంబుల్ లో ఉగ్రదాడి, 6గురు మృతి, 81మందికి గాయాలు…!!
- By hashtagu Published Date - 05:22 AM, Mon - 14 November 22
టర్కీలోని ఇస్తాంబుల్ నగరంలో అత్యంత రద్దీగా ఉండే తక్సిమ్ స్క్వేర్ లోని ఇస్టిక్ లాల్ అవెన్యూలో ఆదివారం ఉగ్రదాడి సంభవించింది. ఈ పేలుడులో ఆరుగురు మరణించారు. 81మందికి తీవ్రగాయాలయ్యాయి. అల్ జజీరా ప్రకారం దాడిచేసిన వ్యక్తి పేలుడు పదార్థాలతో నిండిన బ్యాగ్ ను పౌరుల మధ్య పడేశాడు. అతను వెళ్లిన నిమిషాల వ్యవధిలోనే ఈ పేలుడు జరిగింది.
పేలుడు టర్కీ ప్రభుత్వం తీవ్రవాద దాడిగా పరిగణిస్తున్నట్లు ప్రెసిడెంట్ ఫుట్ ఆక్టే వెల్లడించినట్లుగా టర్కీ వార్త సంస్థ అనడోలు పేర్కొంది. ఓ మహిళ ఈ ఉగ్రదాడికి పాల్పడినట్లు భావిస్తున్నారు. అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ పేలుడు వెనక ప్రధాన నిందితురాలిగా మహిళను గుర్తించినట్లు చెప్పారు. అల్ జజీరా నివేదికలో ఒక మహిళ, ఇద్దరు యువకులతో సహా ముగ్గురు ఈ దాడిలో పాల్గొన్నారని మూలాలను ఉటంకిస్తూ పేర్కొంది.
NEW: Footage shows the moment of the explosion in #Istanbul pic.twitter.com/4m8bvnve44
— i24NEWS English (@i24NEWS_EN) November 13, 2022
కుర్దిస్తాన్ వర్కర్స్ పార్టీకి చెందిన మహిళగా అనుమానిస్తున్నారు అధికారులు. కుర్దిస్తాన్ వర్కర్స్ పార్టీ అనేది కుర్దిష్ తీవ్రవాద వామపక్ష సంస్థ. ఇది ప్రధానంగా ఉత్తరఇరాక్, ఆగ్నేయ టర్కిలో తన కార్యకలాపాలను విస్తరించింది. సీసీటీవీ ఫుటేజీని పరిశీలించిన పోలీసులు ఈ మహిళను గుర్తించారు. ఇస్తాంబుల్ ఉగ్రఘటనకు భారత్, స్వీడన్, ఉక్రెయిన్ సంతాపం వ్యక్తం చేశాయి.
İddiaya Göre Taksim İstiklal Caddesi Meydanı’ndaki Bombalı Saldırıyı Düzenleyen O Kadın.. Güvenlik Ekipleri Kadını Arıyor! Paylaşalım, Paylaştıralım… #istiklalcaddesi #taksim #İstanbul #patlama pic.twitter.com/JYGsShlTuN
— Shout (@shouthaber) November 13, 2022
Related News
Soldier Killed: జమ్ము కాశ్మీర్ పూంచ్ సెక్టార్ వద్ద జరిగిన ఉగ్రదాడిలో జవాన్ మృతి
శనివారం జమ్మూ కాశ్మీర్లోని పూంచ్ జిల్లాలో భారత వైమానిక దళం (IAF) కాన్వాయ్పై ఉగ్రవాదులు మెరుపుదాడి చేయడంతో ఒక సైనికుడు మరణించగా, మరో నలుగురు సైనికులు గాయపడినట్లు అధికారులు తెలిపారు.