HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >World
  • >Taliban Terrorists Attack Police Chiefs Office In Pakistans Karachi 4 Killed

Terrorists Attack: పాకిస్థాన్‌లో కరాచీలోని పోలీస్ చీఫ్ కార్యాలయంలో కాల్పులు కలకలం

పాకిస్థాన్‌ (Pakistan)లో కరాచీలోని పోలీస్ చీఫ్ కార్యాలయంలో కాల్పులు కలకలం రేపాయి. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. కాగా ఈ దాడికి బాధ్యత వహిస్తున్నట్లు పాకిస్థాన్ తాలిబన్లు ఓ స్టేట్‌మెంట్ విడుదల చేశారు.

  • By Gopichand Published Date - 07:23 AM, Sat - 18 February 23
  • daily-hunt
Shooting In Philadelphia
Open Fire

పాకిస్థాన్‌ (Pakistan)లో కరాచీలోని పోలీస్ చీఫ్ కార్యాలయంలో కాల్పులు కలకలం రేపాయి. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. కాగా ఈ దాడికి బాధ్యత వహిస్తున్నట్లు పాకిస్థాన్ తాలిబన్లు ఓ స్టేట్‌మెంట్ విడుదల చేశారు. ఈ ఘటనలో పోలీసుల కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారని, మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా జరుగుతున్నాయని పాకిస్థాన్ మీడియా సంస్థలు పేర్కొంటున్నాయి.

శుక్రవారం (ఫిబ్రవరి 17) కరాచీ నగరంలోని పోలీసు ప్రధాన కార్యాలయంపై దాడి చేసిన ఐదుగురు ఉగ్రవాదులను పాకిస్థాన్ భద్రతా బలగాలు హతమార్చాయి. పాక్ మీడియా ప్రకారం.. పాకిస్తాన్ తాలిబాన్ల ఈ దాడిలో ఒక పోలీసు అధికారితో సహా నలుగురు మరణించారు, పాక్ రేంజర్‌తో సహా 19 మంది గాయపడ్డారు. పోలీసు ప్రధాన కార్యాలయంలోకి ప్రవేశించిన ఉగ్రవాదులను అంతమొందించినట్లు సింధ్ ప్రావిన్స్ ప్రభుత్వ ప్రతినిధి తెలిపారు.

శుక్రవారం సాయంత్రం కరాచీ పోలీసు చీఫ్ కార్యాలయంపై ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారని అధికారులు తెలిపారు. కరాచీ పోలీస్ ఆఫీస్ (కెపిఓ) భవనం ఉగ్రవాదుల నుండి తొలగించబడిందని ధృవీకరిస్తున్నట్లు సింధ్ ప్రభుత్వ ప్రతినిధి ముర్తాజా వహాబ్ ట్వీట్ చేశారు. కనీసం ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారని సమాచారం.

#WATCH | Pakistan | Armed men opened fire at Karachi police chief's office. As the operation to eliminate them is underway, two militants have been killed and three people — including one Rangers personnel and a police officer — injured: Pakistan media

(Video Source: Reuters) pic.twitter.com/ZBJcLgxW63

— ANI (@ANI) February 17, 2023

సింధ్ ముఖ్యమంత్రి మురాద్ అలీ షా సంబంధిత డిఐజిలను వారి ప్రాంతాల నుండి పోలీసులను పంపాలని ఆదేశించారు. మురాద్ అలీ షా మాట్లాడుతూ.. “అడిషనల్ ఐజి కార్యాలయంపై దాడికి పాల్పడిన వారిని అరెస్టు చేయాలని నేను కోరుకుంటున్నాను. పోలీసు చీఫ్ కార్యాలయంపై దాడి ఎట్టిపరిస్థితుల్లోనూ ఆమోదయోగ్యం కాదు.” అని పేర్కొన్నారు. అలాగే ముఖ్యమంత్రి.. సంబంధిత అధికారి నుండి నివేదికను కోరినట్లు చెప్పారు. అనేక గంటల ఆపరేషన్ తర్వాత పోలీసు చీఫ్ ఐదు అంతస్తుల కార్యాలయం ఖాళీ చేయబడిందని పోలీసు అధికారులు తెలిపారు. ఈ దాడిని పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ తీవ్రంగా విమర్శించారు. దీనికి ఖండిస్తే సరిపోదని అన్నారు. ఉగ్రవాదులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.

అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం రాత్రి 7:10 గంటలకు ఉగ్రవాదులు దాడి చేశారని, రాత్రి 10:46 గంటలకు ఐదు అంతస్తుల భవనాన్ని ఖాళీ చేయించారు. కరాచీ పోలీసు కార్యాలయం (కెపిఓ)పై దాడి తర్వాత పాక్ రేంజర్లు, పోలీసు బృందాలు ఉగ్రవాదులపై సంయుక్త ఆపరేషన్‌ను ప్రారంభించాయి. పారామిలటరీ బలగాలకు చెందిన క్విక్ రియాక్షన్ ఫోర్స్ (క్యూఆర్‌ఎఫ్) కేపీఓ భవనాన్ని చుట్టుముట్టి తమ స్థానాలను చేపట్టిందని రేంజర్స్ ప్రతినిధి తెలిపారు. టెర్రరిస్టుల నుంచి కేపీఓను విడిపించేందుకు రేంజర్లు, పోలీసులు ఆపరేషన్ ప్రారంభించారు. మీడియా కథనాల ప్రకారం.. పెషావర్ మసీదు ఆత్మాహుతి దాడి మాదిరిగానే, ఈసారి కూడా దాడి చేసినవారు పోలీసు యూనిఫాం ధరించి కార్యాలయంలోకి ప్రవేశించారు.

 


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • pakistan
  • taliban
  • Terrorists Attack
  • world news

Related News

Upendra Dwivedi

Operation Sindoor : యుద్ధం మూడురోజుల్లోనే ముగిసిందని అనుకోవడం తప్పు : ఆర్మీ చీఫ్‌ ద్వివేదీ

Operation Sindoor : భారత-పాక్‌ మధ్య యుద్ధాలు అధికారికంగా ముగిసినా, పాకిస్థాన్‌ ప్రోత్సహిస్తున్న ఉగ్రవాదం మాత్రం ఆగలేదని ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఉపేంద్ర ద్వివేదీ స్పష్టంచేశారు.

  • Putin- Kim Jong

    Putin- Kim Jong: పుతిన్‌తో కిమ్ జోంగ్ ఉన్ భేటీ.. ఆస‌క్తిక‌ర వీడియో వెలుగులోకి!

  • Once again, India's humanitarian approach...an early warning to Pakistan

    Sutlej River : మరోసారి భారత్‌ మానవతా దృక్పథం..పాకిస్థాన్‌కు ముందస్తు హెచ్చరిక

  • Attack In Balochistan

    Pakistan : బెలూచిస్తాన్‌లో ఆత్మాహుతి దాడి – 25 మంది మృతి

  • Trump

    Trump: భార‌త్‌పై మ‌రోసారి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసిన ట్రంప్‌!

Latest News

  • AI Effect : 2030 కల్లా 99% ఉద్యోగాలు మటాష్!

  • Lunar Eclipse : రేపు తిరుమల శ్రీవారి ఆలయం మూసివేత

  • Pushpa 3 : సైమా వేదిక గా పుష్ప-3 అప్డేట్ ఇచ్చిన సుకుమార్

  • Drugs : హైదరాబాద్లో డ్రగ్స్ తయారీ ఫ్యాక్టరీ గుట్టు రట్టు

  • CM Revanth Reddy : నిమజ్జనంలో సడన్ ఎంట్రీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి

Trending News

    • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

    • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

    • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

    • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

    • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd