Terrorists Attack: పాకిస్థాన్లో కరాచీలోని పోలీస్ చీఫ్ కార్యాలయంలో కాల్పులు కలకలం
పాకిస్థాన్ (Pakistan)లో కరాచీలోని పోలీస్ చీఫ్ కార్యాలయంలో కాల్పులు కలకలం రేపాయి. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. కాగా ఈ దాడికి బాధ్యత వహిస్తున్నట్లు పాకిస్థాన్ తాలిబన్లు ఓ స్టేట్మెంట్ విడుదల చేశారు.
- By Gopichand Published Date - 07:23 AM, Sat - 18 February 23
పాకిస్థాన్ (Pakistan)లో కరాచీలోని పోలీస్ చీఫ్ కార్యాలయంలో కాల్పులు కలకలం రేపాయి. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. కాగా ఈ దాడికి బాధ్యత వహిస్తున్నట్లు పాకిస్థాన్ తాలిబన్లు ఓ స్టేట్మెంట్ విడుదల చేశారు. ఈ ఘటనలో పోలీసుల కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారని, మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా జరుగుతున్నాయని పాకిస్థాన్ మీడియా సంస్థలు పేర్కొంటున్నాయి.
శుక్రవారం (ఫిబ్రవరి 17) కరాచీ నగరంలోని పోలీసు ప్రధాన కార్యాలయంపై దాడి చేసిన ఐదుగురు ఉగ్రవాదులను పాకిస్థాన్ భద్రతా బలగాలు హతమార్చాయి. పాక్ మీడియా ప్రకారం.. పాకిస్తాన్ తాలిబాన్ల ఈ దాడిలో ఒక పోలీసు అధికారితో సహా నలుగురు మరణించారు, పాక్ రేంజర్తో సహా 19 మంది గాయపడ్డారు. పోలీసు ప్రధాన కార్యాలయంలోకి ప్రవేశించిన ఉగ్రవాదులను అంతమొందించినట్లు సింధ్ ప్రావిన్స్ ప్రభుత్వ ప్రతినిధి తెలిపారు.
శుక్రవారం సాయంత్రం కరాచీ పోలీసు చీఫ్ కార్యాలయంపై ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారని అధికారులు తెలిపారు. కరాచీ పోలీస్ ఆఫీస్ (కెపిఓ) భవనం ఉగ్రవాదుల నుండి తొలగించబడిందని ధృవీకరిస్తున్నట్లు సింధ్ ప్రభుత్వ ప్రతినిధి ముర్తాజా వహాబ్ ట్వీట్ చేశారు. కనీసం ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారని సమాచారం.
#WATCH | Pakistan | Armed men opened fire at Karachi police chief's office. As the operation to eliminate them is underway, two militants have been killed and three people — including one Rangers personnel and a police officer — injured: Pakistan media
(Video Source: Reuters) pic.twitter.com/ZBJcLgxW63
— ANI (@ANI) February 17, 2023
సింధ్ ముఖ్యమంత్రి మురాద్ అలీ షా సంబంధిత డిఐజిలను వారి ప్రాంతాల నుండి పోలీసులను పంపాలని ఆదేశించారు. మురాద్ అలీ షా మాట్లాడుతూ.. “అడిషనల్ ఐజి కార్యాలయంపై దాడికి పాల్పడిన వారిని అరెస్టు చేయాలని నేను కోరుకుంటున్నాను. పోలీసు చీఫ్ కార్యాలయంపై దాడి ఎట్టిపరిస్థితుల్లోనూ ఆమోదయోగ్యం కాదు.” అని పేర్కొన్నారు. అలాగే ముఖ్యమంత్రి.. సంబంధిత అధికారి నుండి నివేదికను కోరినట్లు చెప్పారు. అనేక గంటల ఆపరేషన్ తర్వాత పోలీసు చీఫ్ ఐదు అంతస్తుల కార్యాలయం ఖాళీ చేయబడిందని పోలీసు అధికారులు తెలిపారు. ఈ దాడిని పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ తీవ్రంగా విమర్శించారు. దీనికి ఖండిస్తే సరిపోదని అన్నారు. ఉగ్రవాదులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం రాత్రి 7:10 గంటలకు ఉగ్రవాదులు దాడి చేశారని, రాత్రి 10:46 గంటలకు ఐదు అంతస్తుల భవనాన్ని ఖాళీ చేయించారు. కరాచీ పోలీసు కార్యాలయం (కెపిఓ)పై దాడి తర్వాత పాక్ రేంజర్లు, పోలీసు బృందాలు ఉగ్రవాదులపై సంయుక్త ఆపరేషన్ను ప్రారంభించాయి. పారామిలటరీ బలగాలకు చెందిన క్విక్ రియాక్షన్ ఫోర్స్ (క్యూఆర్ఎఫ్) కేపీఓ భవనాన్ని చుట్టుముట్టి తమ స్థానాలను చేపట్టిందని రేంజర్స్ ప్రతినిధి తెలిపారు. టెర్రరిస్టుల నుంచి కేపీఓను విడిపించేందుకు రేంజర్లు, పోలీసులు ఆపరేషన్ ప్రారంభించారు. మీడియా కథనాల ప్రకారం.. పెషావర్ మసీదు ఆత్మాహుతి దాడి మాదిరిగానే, ఈసారి కూడా దాడి చేసినవారు పోలీసు యూనిఫాం ధరించి కార్యాలయంలోకి ప్రవేశించారు.
Related News
PM Modi: జరిగిన విధ్వంసాన్ని శత్రువుకు ముందే చెప్పాం..బాలాకోట్ దాడిపై ప్రధాని కీలక వ్యాఖ్యలు
Balakot Strikes: పాకిస్థాన్(Pakistan) ఆక్రమిత భూభాగంలోని బాలాకోట్(Balakot)లో భారత వైమానిక దళం జరిపిన దాడులు సంచలనం సృషించిన విషయం తెలిసిందే. గత 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు జరిగిన ఈ దాడుల పై ప్రధాని మోడీ(Pm Modi) తాజాగా కీలక విషయాలను వెల్లడించారు. బాలాకోట్పై వైమానిక దాడుల గురించి పాకిస్థాన్కు సమాచారం ఇచ్చిన తర్వాతే మీడియాకు వెల్లడించామన్నారు. We’re now on WhatsApp. Click to Join. కర్ణాటకలోని బగల్కోట్ ఎన్ని