HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > World
  • >Seven Killed In Passenger Train Fire In Pakistan

Pakistan: పాకిస్థాన్‌లో రైలులో అగ్నిప్రమాదం.. నలుగురు చిన్నారులతో సహా ఏడుగురు మృతి

పొరుగు దేశమైన పాకిస్థాన్‌ (Pakistan)లోని ఓ ప్యాసింజర్ రైలులో మంటలు (Train Fire) చెలరేగాయి. దీంతో అందులో ప్రయాణిస్తున్న పలువురు కాలిపోయి మృత్యువాత పడ్డారు.

  • Author : Gopi Date : 28-04-2023 - 7:29 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Pakistan
Resizeimagesize (1280 X 720) (1)

పొరుగు దేశమైన పాకిస్థాన్‌ (Pakistan)లోని ఓ ప్యాసింజర్ రైలులో మంటలు (Train Fire) చెలరేగాయి. దీంతో అందులో ప్రయాణిస్తున్న పలువురు కాలిపోయి మృత్యువాత పడ్డారు. సమాచారం ప్రకారం.. ఈ ప్రమాదంలో నలుగురు పిల్లలతో సహా కనీసం ఏడుగురు మరణించారు. ఈ సమాచారాన్ని పాకిస్థాన్ రైల్వేస్ గురువారం (ఏప్రిల్ 27) అందించింది. రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. దక్షిణ పాకిస్థాన్‌లోని కరాచీకి ఉత్తరాన 500 కిలోమీటర్ల దూరంలోని ఖైర్‌పూర్ జిల్లాలో ఈ ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో నిండిన ఈ ప్యాసింజర్ రైలు తూర్పు నగరం లాహోర్ వైపు వెళుతోంది.

గ్యాస్ స్టవ్ కారణంగా మంటలు..?

ప్యాసింజర్ రైలులోని మంటలు రైలులోని అనేక ఇతర కోచ్‌లను చుట్టుముట్టాయి. ఒక టీవీ ఛానెల్ ఫుటేజీలో రైలులోని అనేక కాలిపోయిన భాగాలు కనిపిస్తున్నాయి. దీని వల్ల ఎంతమేర ప్రాణ, ఆస్తి నష్టం జరిగిందనేది ఇంకా తెలియరాలేదు. బుధవారం (ఏప్రిల్ 26) రాత్రి రైలులో మంటలు చెలరేగాయని స్థానిక మీడియా తెలిపింది. ఈ ప్రమాదానికి గ్యాస్‌ స్టవ్‌ కారణమై ఉండవచ్చని భావిస్తున్నారు. మీడియా నివేదికల ప్రకారం.. పాకిస్తాన్‌లోని పేద ప్రయాణీకులు తరచూ తమ సొంత చిన్న గ్యాస్ స్టవ్‌లను రైళ్లలో వంట కోసం తీసుకువస్తుంటారు. రద్దీగా ఉండే రైళ్లలో భద్రతా నియమాలు తరచుగా విస్మరించబడుతున్నాయి.

Also Read: Rahul Gandhi: రాహుల్ గాంధీకి బాంబ్ బెదిరింపు.. 60 ఏళ్ల నిందితుడు అరెస్టు

దేశంలో సరైన రైల్వే మౌలిక సదుపాయాలు లేకపోవటం, యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే తరచూ రైలు ప్రమాదాలు జరుగుతున్నాయని రిటైర్డ్ రైల్వే అధికారులు చెబుతున్నారు. 2019లో తూర్పు పంజాబ్ ప్రావిన్స్‌లో వంట గ్యాస్ స్టవ్ పేలడంతో రైలులో మంటలు చెలరేగాయి. ఇందులో కనీసం 74 మంది ప్రయాణికులు మరణించారు. డజన్ల కొద్దీ ప్రయాణికులు గాయపడ్డారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Fire Accident
  • Fire Accident In Train
  • pakistan
  • train
  • world news

Related News

    Latest News

    • సభ్యసమాజం తలదించుకునే ఘటన.. అక్కాతమ్ముడి పెళ్లి.. ఎక్కడంటే..?

    • T20 Captain: టీమిండియా టీ20 కొత్త కెప్టెన్‌ ఎవరంటే?

    • Revanth Reddy: CM, VIP కాన్వాయ్ కోసం ట్రాఫిక్ ఆపొద్దు.

    • TVK: 107 మంది ఎమ్మెల్యేలు తో విజయ్ రాజీనామా

    • Gold Price Today: పసిడి ప్రియులకు భారీ శుభవార్త..

    Trending News

      • Kamal Haasan: గవర్నర్ పై కమల్ హాసన్ ఆగ్రహం

      • CM Vijay Thalapathy: సీఎం విజయ్‌ కి ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్..!

      • Tamil Nadu Politics: తమిళనాడు రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. గవర్నర్‌తో మరోసారి విజయ్ భేటీ

      • AIADMK: విజయ్ కు మద్దతు ఇచ్చేది లేదన్న అన్నాడీఎంకే

      • BREAKING: ప్రభుత్వ ఏర్పాటులో విజయ్ కు బిగ్ షాక్ ఇచ్చిన గవర్నర్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd