HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > World
  • >Operation Sindoor Effect Formation Of Pakistan Rocket Force

Pakistan : ఆపరేషన్‌ సిందూర్‌ ఎఫ్‌క్ట్‌..పాకిస్థాన్‌ రాకెట్‌ ఫోర్స్‌ ఏర్పాటు

ఈ రాకెట్‌ ఫోర్స్‌ ద్వారా దేశ సైనిక శక్తిని మరింత బలోపేతం చేయాలనే లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ దళాన్ని తయారు చేస్తామని, భవిష్యత్తు యుద్ధాల్లో కీలకంగా మారనున్న మిస్సైల్‌ మోహరింపులకు ఇది అనువుగా ఉంటుందని వివరించారు. ఈ రాకెట్‌ ఫోర్స్‌కు ప్రత్యేక కమాండ్‌ వ్యవస్థ ఉండనుంది.

  • Author : Latha Suma Date : 14-08-2025 - 3:07 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Operation Sindoor Effect.. Formation of Pakistan Rocket Force
Operation Sindoor Effect.. Formation of Pakistan Rocket Force

Pakistan : ఆపరేషన్‌ సిందూర్‌లో భారత్‌ ప్రయోగించిన క్షిపణుల దెబ్బకు తలతిరిగిన పాకిస్థాన్‌ (Pakistan), ఇప్పుడు తన రక్షణ వ్యవస్థను పునర్వ్యవస్థీకరించేందుకు కొత్త పావులు కదుపుతోంది. ఈ క్రమంలో బుధవారం అర్ధరాత్రి ఒక కీలక ప్రకటనతో దేశ ప్రజల ముందుకొచ్చిన పాక్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌, “పాక్‌ రాకెట్‌ ఫోర్స్‌” అనే ప్రత్యేక దళాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ రాకెట్‌ ఫోర్స్‌ ద్వారా దేశ సైనిక శక్తిని మరింత బలోపేతం చేయాలనే లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ దళాన్ని తయారు చేస్తామని, భవిష్యత్తు యుద్ధాల్లో కీలకంగా మారనున్న మిస్సైల్‌ మోహరింపులకు ఇది అనువుగా ఉంటుందని వివరించారు. ఈ రాకెట్‌ ఫోర్స్‌కు ప్రత్యేక కమాండ్‌ వ్యవస్థ ఉండనుంది. సంప్రదాయ యుద్ధాల సమయంలో, ముఖ్యంగా క్షిపణుల దాడులు, శత్రుదేశపు మౌలిక సదుపాయాలపై స్ట్రాటజిక్‌ దాడుల నిర్వహణలో ఇది ప్రధాన పాత్ర పోషించనుంది. అంతేకాదు, ఈ ఫోర్స్‌ ఏర్పాటు పూర్తిగా భారత్‌ దృష్టిలో పెట్టుకుని జరుగుతోందని ఒక ఉన్నతాధికారి ఓ విదేశీ మీడియాకు వెల్లడించాడన్న వార్తలు వెలుగులోకి వచ్చాయి.

భారత్‌పై పాక్‌ వరుస బెదిరింపులు

ఈ ప్రకటనకు ముందే, మంగళవారం పాక్‌ ప్రధాని షరీఫ్‌ న్యూదిల్లీకి కాస్త ఘాటుగా హెచ్చరికలు జారీ చేశారు. సింధూ జలాలపై భారత చర్యలను ఉద్దేశించి ఒక్క చుక్క నీరు కూడా తీసుకొన్నా సహించేది లేదు అంటూ వ్యాఖ్యానించారు. సింధు నదీ జలాలు తమ దేశానికి ప్రాణాధారమని, వాటిపై ఎలాంటి రాజీకి అవకాశం లేదని అన్నారు. భారత్‌కు “మరిచిపోలేని గుణపాఠం” చెబుతామంటూ ప్రేలాపనకు దిగారు.

రాజకీయ నేతల నుండి ఆర్మీ వరకూ అదే శబ్దం

పాక్‌లో ఉన్నత స్థాయి నేతలు, రాజకీయ నాయకులు, సైనికాధికారులంతా భారత్‌పై విమర్శలదండిగా మళ్ళీ ప్రయాణం మొదలుపెట్టారు. పీపీపీ నేత బిలావల్‌ భుట్టో మోదీ వ్యతిరేకంగా పాక్‌ ప్రజలను ఏకం కావాలని పిలుపునిచ్చారు. మరోవైపు, ఆర్మీ చీఫ్‌ అసీం మునీర్‌ అమెరికాలో మాట్లాడుతూ, పాక్‌ను తక్కువ అంచనా వేయకూడదని, ప్రమాదం కలగవచ్చని ఓ మారుపరిచయంతో హెచ్చరించారు. భారత్‌ ఓ మెర్సిడెస్‌ కారు అయితే, పాకిస్థాన్‌ ఓ డంప్‌ ట్రక్కు. కారు వచ్చి లారీని ఢీకొంటే ఎవరి నష్టం ఎక్కువ? అని ఆయన చేసిన వ్యాఖ్యలు, జాతీయ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. అంతేకాదు, భారత్‌ సింధూ నదిపై డ్యామ్‌ నిర్మిస్తే, మిస్సైళ్లతో పేల్చివేస్తామని ఆయన తేల్చి చెప్పారు.

అమెరికా మద్దతుతో అణు బెదిరింపులు?

పాకిస్థాన్‌ నేతలు భారత్‌పై చేసిన ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయంగా కూడా దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ప్రత్యేకించి అమెరికా వేదికగా మునీర్‌ చేసిన అణు బెదిరింపులు, పాకిస్థాన్‌ ఆత్మరక్షణ పేరుతో, పొరుగుదేశాల భద్రతను ప్రమాదంలోకి నెట్టేలా ఉన్నాయి. భారత్‌ భద్రతను దృష్టిలో ఉంచుకుని రాకెట్‌ ఫోర్స్‌ను ఏర్పాటు చేయడమే కాకుండా, పాకిస్థాన్‌ ప్రస్తుతం ఉగ్రవాదంపై కాకుండా భారతంపై తన శక్తిని కేంద్రీకరిస్తోంది అనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇలా భారత్‌ నుంచి ఎదురైన క్షిపణి దాడులు, రక్షణ పరంగా చేసిన ముందడుగులు ఇప్పుడు పాకిస్థాన్‌ను తీవ్ర ఆందోళనకు గురిచేశాయని స్పష్టమవుతోంది. అయితే పాక్‌ కొత్తగా ఏర్పాటు చేస్తున్న రాకెట్‌ ఫోర్స్‌ నిజంగా వారి రక్షణ శక్తిని పెంచుతుందా? లేక జాతీయవాదాన్ని రెచ్చగొట్టేందుకు గాలికొదిలిన ప్రకటనల పరంపరేనా? అనేది కాలమే తేల్చాలి.

Read Also: Pulivendula : ఎన్నికల కౌంటింగ్‌లో ఆసక్తికర ఘటన..30 ఏళ్ల తర్వాత ఓటేశా బ్యాలెట్‌ బాక్స్‌లో ఓటరు మెసేజ్‌..!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Cutting-edge technology
  • india
  • Operation Sindoor Effect
  • Pakistan Prime Minister Shehbaz Sharif
  • Pakistan Rocket Force

Related News

New Currency

New Currency : త్వరలో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు?.. ఆర్‌బీఐ కసరత్తు వేగవంతం

భారత కరెన్సీ వ్యవస్థలో కీలక మార్పులకు భారతీయ రిజర్వు బ్యాంక్‌ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం వినియోగంలో ఉన్న కాగితపు నోట్ల స్థానంలో దశలవారీగా ప్లాస్టిక్ లేదా పాలిమర్ కరెన్సీ నోట్లను ప్రవేశపెట్టే అంశంపై ఆర్‌బీఐ అధ్యయనం చేస్తున్నట్లు తెలుస్తోంది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కరెన్సీ నిర్వహణ ప్రణాళికల్లో భాగంగా ప్లాస్టిక్ నోట్ల అమలుపై ఆర్‌బీఐ దృ

  • Asaduddin Owaisi

    Asaduddin Owaisi : యూసీసీ, నమాజ్ వివాదంపై ఒవైసీ ఘాటు స్పందన

Latest News

  • Annamalai: బీజేపీకి అన్నామలై రాజీనామా

  • Kangana Ranaut: కంగనా రిక్వెస్ట్.. నేషనల్ క్రష్ ట్యాగ్‌ను అంగీకరించని నటి గిరిజా ఓక్

  • Donald Trump Tariff: భారత్‌పై టారిఫ్స్ 25% నుంచి 15% తగ్గింపు : ట్రంప్ కీలక నిర్ణయం

  • Krunal Pandya: ఐపీఎల్‌లో ఐదోసారి కప్పు కొట్టిన కృనాల్ పాండ్యా

  • Dental Tips: ఏ వయసులో దంతాలు బలహీనమవుతాయి? దీనికి కారణం ఏంటో తెలుసా?

Trending News

    • Nandu’s World Nandana: మా మీద కావాలనే కుట్ర.. డబ్బులిచ్చి సోషల్ మీడియా లో దుష్ర్పచారం Nandu’ s world సంచలనం

    • Kalita Majhi: అప్పట్లో ఇంటి పనిమనిషి.. నేడు బెంగాల్‌ మంత్రి

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd