Gaza–Israel conflict: ఇజ్రాయెల్-పాలస్తీనా ఉగ్రవాదుల కాల్పుల విరమణ
ఇజ్రాయెల్ ,పాలస్తీనా ఉగ్రవాదుల మధ్య కొనసాగుతున్న పోరుకు బ్రేక్ పడింది. హింసను కట్టడి చేసేందుకు ఇరుపక్షాలు అంగీకరించాయి. శనివారం నుండి గాజా స్ట్రిప్ మరియు చుట్టుపక్కల కాల్పుల విరమణ అమలులోకి వచ్చింది.
- Author : Praveen Aluthuru
Date : 14-05-2023 - 12:27 IST
Published By : Hashtagu Telugu Desk
Gaza–Israel conflict: ఇజ్రాయెల్ ,పాలస్తీనా ఉగ్రవాదుల మధ్య కొనసాగుతున్న పోరుకు బ్రేక్ పడింది. హింసను కట్టడి చేసేందుకు ఇరుపక్షాలు అంగీకరించాయి. శనివారం నుండి గాజా స్ట్రిప్ మరియు చుట్టుపక్కల కాల్పుల విరమణ అమలులోకి వచ్చింది. వైమానిక దాడుల్లో గాజాలో కనీసం 33 మంది పాలస్తీనియన్లు మరియు ఇజ్రాయెల్లో ఇద్దరు మరణించారు.
కాల్పుల విరమణ అమల్లోకి రావడానికి 30 నిమిషాల ముందు గాజా నుండి ఇజ్రాయెల్ వైపు డజన్ల కొద్దీ రాకెట్లు ప్రయోగించబడ్డాయి, అయినప్పటికీ గాజా నుండి వచ్చిన చాలా రాకెట్లను ఇజ్రాయెల్ వాయు రక్షణ వ్యవస్థలు తిప్పికొట్టాయి. ప్రస్తుతం కాల్పులకు విరమణ అమల్లోకి రావడంతో ఇన్ని రోజులు ఖాళీగా ఉన్న గాజా వీధులు పాలస్తీనియన్లతో కిక్కిరిసిపోయాయి. ఈ దాడుల్లో మృతి చెందిన వారి ఇళ్లకు వెళ్లి పరామర్శిస్తున్నారు.
ఇజ్రాయెల్ జాతీయ భద్రతా సలహాదారు కాల్పుల విరమణ చేసినందుకు ఇజ్రాయెల్ అధ్యక్షుడు అబ్దెల్ ఫట్టా ధన్యవాదాలు తెలిపారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఒక ప్రకటనలో మంచికి మంచి ఉంటుందని, దాడి చేస్తే ఇజ్రాయెల్ ప్రతీకారం తీర్చుకుంటుందని హెచ్చరించింది.
ఇజ్రాయెల్ ,ఉగ్రవాద ఇస్లామిక్ జిహాద్ గ్రూపు కాల్పుల విరమణను అమెరికా స్వాగతించింది. దాడుల్ని ఆపేందుకు మధ్యవర్తి పాత్ర పోషించినందుకు ఈజిప్టుకు వైట్ హౌస్ కృతజ్ఞతలు తెలిపింది. ఇరు దేశాల మధ్య శాంతి నెలకొల్పేందుకు చర్యలు తీసుకున్నందుకు ఈజిప్టుకు అమెరికా కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు వైట్హౌస్ ప్రెస్ సెక్రటరీ కరీన్ జీన్-పియర్ తెలిపారు.
Read More: BEER MOTORCYCLE : బీర్ బైక్.. గంటకు 241 కి.మీ స్పీడ్ ?