Maldives Govt: ఆ మంత్రులను సస్పెండ్ చేసిన మాల్దీవుల ప్రభుత్వం..!
ప్రధాని నరేంద్ర మోదీ లక్షద్వీప్ పర్యటనను ఎగతాళి చేశారన్న వివాదంపై మాల్దీవుల ప్రభుత్వం (Maldives Govt) కీలక చర్య తీసుకుంది.
- By Gopichand Published Date - 07:15 PM, Sun - 7 January 24

Maldives Govt: ప్రధాని నరేంద్ర మోదీ లక్షద్వీప్ పర్యటనను ఎగతాళి చేశారన్న వివాదంపై మాల్దీవుల ప్రభుత్వం (Maldives Govt) కీలక చర్య తీసుకుంది. ప్రధాని మోదీపైనా, భారత్పైనా అవమానకర వ్యాఖ్యలు చేసినందుకు మంత్రులు మరియం షియునా, మల్షా, హసన్ జిహాన్లను మాల్దీవుల ప్రభుత్వం సస్పెండ్ చేసింది. అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జూ తన ప్రకటనలను వ్యక్తిగతంగా కూడా అభివర్ణించారు. ఈ విషయాన్ని మాల్దీవుల ప్రభుత్వంతో భారత్ అధికారికంగా ప్రస్తావించింది.
దీనిపై మాల్దీవుల ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టి డిప్యూటీ మంత్రి (యువ సాధికారత, సమాచార, కళల మంత్రిత్వ శాఖ) మరియం షియునా, డిప్యూటీ మంత్రి (రవాణా మరియు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ) హసన్ జిహాన్, డిప్యూటీ మంత్రి (యువ సాధికారత, సమాచార, కళల మంత్రిత్వ శాఖ) మల్షాలను సస్పెండ్ చేసింది.
కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత సంబంధాలు క్షీణించాయి
మహ్మద్ ముయిజు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మాల్దీవులతో భారతదేశ సంబంధాలు క్షీణించాయి. ప్రధాని నరేంద్ర మోదీ లక్షద్వీప్ పర్యటన సందర్భంగా షేర్ చేసిన కొన్ని చిత్రాలపై చేసిన వివాదాస్పద ప్రకటన దీనికి ఆజ్యం పోసింది.
We’re now on WhatsApp. Click to Join.
జాహిద్ రమీజ్ వివాదాస్పద వ్యాఖ్యలు
ఇదిలా ఉంటే.. ప్రధాని మోదీ లక్షద్వీప్ పర్యటన ఇంటర్నెట్లో చాలా ముఖ్యాంశాలుగా మారింది. సోషల్ మీడియా వినియోగదారులు లక్షద్వీప్ను అందమైన బీచ్లకు ప్రసిద్ధి చెందిన ప్రముఖ పర్యాటక కేంద్రమైన మాల్దీవులతో పోలుస్తున్నారు. మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జూ పార్టీ సభ్యుడు జాహిద్ రమీజ్ ప్రధాని మోదీ లక్షద్వీప్ పర్యటనపై ఎగతాళి చేస్తూ ఆయన చిత్రాలపై వ్యాఖ్యానించారు.
Also Read: PMO Imposter Case: పీఎంఓ అధికారిని అంటూ కోట్లలో డీల్
జనవరి 5న రమీజ్ మరో ట్వీట్ను పంచుకున్నారు. నిస్సందేహంగా ఇది మంచి అడుగు అని అన్నారు. కానీ భారతదేశం ఎప్పటికీ మనకు సమానం కాదు. మాల్దీవులు పర్యాటకులకు అందించే సేవలను భారతదేశం ఎలా అందిస్తుంది? మనలాగే పరిశుభ్రతను ఎలా కాపాడుకోగలుగుతారు.. వారి గదుల్లోని వాసన వారికి, పర్యాటకులకు అతిపెద్ద సమస్యగా ఉంటుందని ట్వీట్ చేశారు.
మరియం షియునా కూడా ప్రధాని మోదీపై వివాదాస్పద పోస్ట్
జాహిద్ రమీజ్ వివాదాస్పద వ్యాఖ్యలపై వినియోగదారులు తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు. మాల్దీవులపై ప్రజలు తమ ఆగ్రహాన్ని నిరంతరం వ్యక్తం చేస్తున్నారు. భారతీయ వినియోగదారులు #BoycottMaldives ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. జాహిద్ రమీజ్తో పాటు మంత్రి మర్యమ్ షియునా కూడా ప్రధాని మోదీపై కించపరిచే వ్యాఖ్యలు చేశారు. అయితే, తనను చుట్టుముట్టడం చూసి, షియానా తన పోస్ట్ను తొలగించింది.