HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >World
  • >It Would Have Been Better If I Had Died Too Masood Azhar After Family Members Killed In Operation Sindoor

Masood Azhar : ‘ఆపరేషన్ సిందూర్‌’‌తో మసూద్ అజార్ రక్త కన్నీరు.. ‘‘నేనూ చనిపోతే బాగుండేది’’

తాను గతంలో ఉగ్రదాడులు జరిపించి అమాయక భారతీయుల ప్రాణాలు తీయించిన విషయాన్ని మర్చిపోయి మసూద్ అజార్(Masood Azhar) నీతులు వల్లించాడు.

  • By Pasha Published Date - 03:10 PM, Wed - 7 May 25
  • daily-hunt
Masood Azhars Family And Relatives Killed Operation Sindoor India Attack Pakistan

Masood Azhar : మసూద్ అజార్ కరుడుగట్టిన పాకిస్తాన్ ఉగ్రవాది.  జైషే మహ్మద్ పేరుతో ఒక ఉగ్రవాద సంస్థను నడుపుతున్నాడు.  ఇతగాడు భారత్‌లో ఎన్నో ఉగ్రదాడులు చేయించి ఎంతోమంది భారతీయుల ప్రాణాలను బలిగొన్నాడు. ఈ ఉగ్రవాదికి భారత్ తన సత్తా ఏంటో చూపించింది. మసూద్ అజార్ రక్త కన్నీరుతో ఏడ్చే పరిస్థితిని భారత సైన్యం క్రియేట్ చేసింది.  బుధవారం తెల్లవారుజామున 1 గంటలకు భారత ఆర్మీ నిర్వహించి ఆపరేషన్ సిందూర్‌లో మసూద్ అజార్‌కు భారీ నష్టం కలిగింది. భారత ఆర్మీ అతడికి మానసికంగా కోలుకోలేనంత దెబ్బ కొట్టింది.  భారత ఆర్మీ క్షిపణి దాడుల్లో 14 మంది మసూద్ అజార్‌ కుటుంబ సభ్యులు హతమయ్యారు. చనిపోయిన మసూద్ అజార్ కుటుంబీకుల్లో  ఐదుగురు పిల్లలు ఉన్నట్లు తెలుస్తోంది. పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో ఉన్న బహావల్‌పూర్‌లో జామియా మస్జిద్ సుబహానల్లా ఉంది. దీన్ని మసూద్ అజార్ కుటుంబం ఉగ్రవాద స్థావరంగా వాడుకుంటోంది. ఈ మసీదులోనే ఉగ్రవాదులకు ట్రైనింగ్ ఇస్తోంది. అందుకే దీనిపై భారత ఆర్మీ ఎటాక్ చేసింది. ఈ దాడిలోనే 14 మంది మసూద్ అజార్ కుటుంబీకులు చనిపోయారు. ఈవివరాలను ధ్రువీకరిస్తూ స్వయంగా మసూద్ అజార్ ఒక ప్రకటన విడుదల చేశాడు. ఆ వివరాలు చూద్దాం..

Also Read :Pakistan Airspace : ‘ఆపరేషన్‌ సిందూర్‌’ దెబ్బకు పాక్‌ ఎయిర్‌స్పేస్‌ ఖాళీ

మసూద్ అజార్ ప్రకటన ఇదీ.. 

‘‘నా కుటుంబంలోని 14 మంది సభ్యులు ఈ రాత్రి అమరులయ్యే అదృష్టాన్ని పొందారు. ఐదుగురు అమాయక పిల్లలు చనిపోయి, జన్నతుల్ ఫిర్దౌస్‌లో పువ్వులుగా మారారు. నా అక్క సాహిబా నా ప్రాణం కంటే ప్రియమైంది. నా అక్క భర్త, నా మేనల్లుడు అలీమ్ ఫాజిల్, అతడి భార్య, నా ప్రియమైన మేనకోడలు ఆలం ఫాజిలా, మా మేనల్లుడు, అతడి భార్య అల్లాహ్‌కు ప్రియమైనవారు అయ్యారు’’ అని మసూద్ అజార్ పేర్కొన్నాడు. తాను గతంలో ఉగ్రదాడులు జరిపించి అమాయక భారతీయుల ప్రాణాలు తీయించిన విషయాన్ని మర్చిపోయి మసూద్ అజార్(Masood Azhar) నీతులు వల్లించాడు.

స్వర్గస్తులు అయ్యారంటూ నీతులు.. 

‘‘అమాయక పిల్లలు, బురఖా ధరించిన మహిళలు, వయసు మీద పడిన ముసలి వారిని మోడీ టార్గెట్ చేశారు. ఈ బాధ గురించి నేను మాటల్లో చెప్పలేను. భరించలేనంత బాధను ఇప్పుడు నేను అనుభవిస్తున్నాను. అయినా పశ్చాత్తాపం లేదు. బాధ లేదు. భయం లేదు. చనిపోయిన నా 14 మంది కుటుంబీకుల్లో నేను కూడా ఉండి ఉంటే బాగుండేదని నా మైండ్‌లో పదేపదే వస్తోంది. అయితే అల్లాతో మనం కలిసే టైం ఫిక్స్‌డ్‌గా ఉంటుంది. అది ముందు రాదు, వెనుక రాదు. మా ఇంట్లో మొత్తం నలుగురు పిల్లలు ఉండేవారు. వాళ్లంతా మూడేళ్ల నుంచి ఏడేళ్లలోపువారు. వాళ్లంతా కలిసి స్వర్గస్తులయ్యారు. అల్లా ప్రేమించే వారికే అమరత్వం లభిస్తుందని ఖురాన్ చెబుతోంది. వాళ్ల సమయం వచ్చింది కాబట్టే వాళ్లు వెళ్లిపోయారు. మోడీ క్రూరత్వం అన్ని రకాలుగా హద్దులు దాటింది. ఆయన ఎవరినీ వదిలిపెట్టడం లేదు’’ అని మసూద్ అజార్ వ్యాఖ్యలు చేశాడు.

Also Read :Operation Sindoor : ‘ఆపరేషన్ సిందూర్’‌.. సౌత్ సినీ స్టార్స్ స్పందన ఇదీ


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • india
  • India Attack
  • Masood Azhar
  • Masood Azhars Family
  • Masood Azhars Relatives Killed
  • Operation Sindoor
  • pakistan

Related News

Trump Is Dead

Trump Tariffs : టారిప్స్ పై ఆందోళన అవసరం లేదు – పీయూష్

Trump Tariffs : భవిష్యత్తులో ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు కొనసాగుతాయని, వాణిజ్య ఒప్పందం కుదురుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఇది ఇరు దేశాల ఆర్థిక వ్యవస్థలకు మేలు చేస్తుందని ఆయన నొక్కి చెప్పారు

  • Once again, India's humanitarian approach...an early warning to Pakistan

    Sutlej River : మరోసారి భారత్‌ మానవతా దృక్పథం..పాకిస్థాన్‌కు ముందస్తు హెచ్చరిక

  • A new chapter in India's defense system... Negotiations with Russia for the purchase of S-400

    S-400 : భారత రక్షణ వ్యవస్థలో కొత్త అధ్యాయం..ఎస్-400 కొనుగోళ్లకు రష్యాతో చర్చలు

  • Attack In Balochistan

    Pakistan : బెలూచిస్తాన్‌లో ఆత్మాహుతి దాడి – 25 మంది మృతి

  • Peter Navarro

    Peter Navarro: ట్రంప్ సలహాదారు భార‌త్‌పై కీల‌క వ్యాఖ్య‌లు.. ఎవరీ పీట‌ర్ కెంట్‌?

Latest News

  • GST 2.0 : GST 2.0తో ప్రభుత్వానికి ఎంత నష్టమంటే?

  • Kavitha Vs Harish : నాపై చేసిన ఆరోపణలను వారి విజ్ఞతకే వదిలేస్తున్నా..కవిత కు ఇన్ డైరెక్ట్ కౌంటర్ ఇచ్చిన హరీశ్

  • Afghanistan Earthquake : ప్రాణాలు పోతుంటే విపరీత ఆచారం అవసరమా?

  • Gym Germs: వామ్మో.. జిమ్ పరికరాలపై ప్రమాదకరమైన బ్యాక్టీరియా!

  • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

Trending News

    • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

    • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

    • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

    • GST Slashed: హెయిర్‌కట్, ఫేషియల్ చేయించుకునేవారికి గుడ్ న్యూస్‌.. ఎందుకంటే?

    • Raja Singh : పోలీసుల ఆంక్షలపై రాజాసింగ్ అభ్యంతరం..హిందూ పండుగలను నియంత్రించే హక్కు మీకెక్కడిది? !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd