Israel: ఇజ్రాయిల్పై పాలస్తీనా దాడి.. గాజా స్ట్రిప్ నుంచి రాకెట్ దాడులు
ఇజ్రాయిల్ (Israel), పాలస్తీనా మధ్య యుద్ధ వాతావరణ నెలకొంది. ఇటీవల ఇజ్రాయిల్ చేసిన దాడులకు సమాధానంగా తాజాగా పాలస్తీనా దాడులకు పాల్పడింది. దక్షిణ ఇజ్రాయిల్పై క్షిపణుల వర్షం కురిపించింది.
- By Gopichand Published Date - 06:38 AM, Fri - 24 February 23
ఇజ్రాయిల్ (Israel), పాలస్తీనా మధ్య యుద్ధ వాతావరణ నెలకొంది. ఇటీవల ఇజ్రాయిల్ చేసిన దాడులకు సమాధానంగా తాజాగా పాలస్తీనా దాడులకు పాల్పడింది. దక్షిణ ఇజ్రాయిల్పై క్షిపణుల వర్షం కురిపించింది. గాజా స్ట్రిప్ నుంచి చేసిన 6 రాకెట్ దాడుల్లో ఐదింటిని తమ దేశం అడ్డుకుందని ఇజ్రాయిల్ ప్రకటించింది. ఒకటి మాత్రం బహిరంగ మైదానంలో పడిందని, ఇందులో ప్రాణనష్టం జరిగినట్లు ఎటువంటి సమాచారం లేదని అధికారులు చెప్పారు.
ఇజ్రాయిల్పై గాజా రాకెట్లను ప్రయోగించింది. ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్ దాని ఐరన్ డోమ్ డిఫెన్స్ సిస్టమ్ గాజా స్ట్రిప్ నుండి ప్రయోగించిన ఐదు రాకెట్లను అడ్డగించిందని ధృవీకరించింది. గురువారం (ఫిబ్రవరి 23) తెల్లవారుజామున దక్షిణ ఇజ్రాయిల్లోని గాజా స్ట్రిప్ నుండి ఆరు రాకెట్లను ప్రయోగించినట్లు ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్స్ పేర్కొంది. గాజా స్ట్రిప్ నుంచి ప్రయోగించిన ఆరు రాకెట్లలో ఐదింటిని ఐరన్ డోమ్ క్షిపణి రక్షణ వ్యవస్థ కూల్చివేసినట్లు ఇజ్రాయిల్ సైన్యం వివరించింది. ఆరో రాకెట్ బహిరంగ ప్రదేశంలో పడింది.
Also Read: Perfumes: పెర్ఫ్యూమ్స్ అధికంగా ఉపయోగిస్తున్నారా.. అయితే జాగ్రత్త?
ఇజ్రాయిల్ సైన్యం దాడి
ఇజ్రాయిల్ సైన్యం ఇంతకుముందు వెస్ట్ బ్యాంక్లో ఆకస్మిక దాడి చేసింది. ఆక్రమిత వెస్ట్ బ్యాంక్లోని ఫ్లాష్ పాయింట్ పట్టణంలో బుధవారం జరిగిన ఆపరేషన్లో ఇజ్రాయిల్ దళాలు అనేక మందిని చంపాయి. పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ ఇస్లామిక్ జిహాద్ తన ఇద్దరు కమాండర్లను ఇజ్రాయిల్ సైనికులు ఒక ఇంట్లో చుట్టుముట్టారని, ఇతర ముష్కరులతో పోరాటాన్ని ప్రేరేపించారని చెప్పారు.
దాడిలో 11 మంది పాలస్తీనియన్లు మృతి
ఇజ్రాయిల్ సైన్యం జరిపిన దాడిలో కనీసం 11 మంది పాలస్తీనియన్లు మరణించారు. 100 మందికి పైగా గాయపడ్డారు. మరణించిన 11 మందిలో నలుగురు ముష్కరులు, నలుగురు పౌరులు, 14 ఏళ్ల బాలుడు, 72 ఏళ్ల వ్యక్తి ఉన్నారని పాలస్తీనా అధికారులు తెలిపారు. నబ్లస్లో ఇజ్రాయిల్ దాడిలో ఒక చిన్నారి సహా 11 మంది పాలస్తీనియన్లు మరణించారని, పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. 2005 తర్వాత ఆక్రమిత వెస్ట్ బ్యాంక్లో జరిగిన అత్యంత ఘోరమైన దాడి ఇది. గత నెలలో యూదుల ప్రార్థనా మందిరంలో జరిగిన ఘోరమైన పాలస్తీనా దాడి తరువాత ఇదే విధమైన ఆపరేషన్ జరిగింది. గత నెల ఉత్తర వెస్ట్ బ్యాంక్లో ఇదే విధమైన దాడిలో ఇజ్రాయిల్ దళాలు 10 మంది ఉగ్రవాదులను హతమార్చాయి. ముఖ్యంగా, గాజా స్ట్రిప్ను ఉగ్రవాద సంస్థ హమాస్ ఆక్రమించింది.
Related News
Israel Vs Hamas : గాజా నుంచి ఆర్మీని వెనక్కి పిలిచేది లేదు : ఇజ్రాయెల్
Israel Vs Hamas : గాజా నుంచి తమ సైనిక బలగాల ఉపసంహరణకు ఇజ్రాయెల్ నో చెప్పింది.