Maldives : మాల్దీవులకు భారతీయులు వెళ్లడమే తగ్గించేసారట..
- By Sudheer Published Date - 04:07 PM, Thu - 7 March 24
కొద్దీ రోజుల క్రితం వరకు మాల్దీవుల(Maldives)కు భారతీయులు క్యూ కట్టేవారు..సినీ ప్రముఖులు , క్రీడా కారులు , బిజినెస్ ప్రముఖులు ఇలా అనేక రంగాలవారు కాస్త గ్యాప్ దొరికిందటే చాలు మాల్దీవుల్లో ప్రత్యక్షం అయ్యేవారు. అలాంటిది గత కొద్దీ రోజులుగా ఆవైపు చూడడమే మానేశారు. ఏ క్షణాన భారత ప్రధాని మోడీ (Modi) లక్షద్వీప్ (Lakshadweep ) పర్యటన చేసి..దానికి సంబదించిన విశేషాలను సోషల్ మీడియా లో పోస్ట్ చేసారో..అప్పటి నుండి ప్రతి ఒక్కరు లక్షద్వీప్ గురించి సెర్చ్ (Search) చేయడం మొదలుపెట్టారు.
గత నవంబర్లో జరిగిన మాల్దీవుల అధ్యక్ష ఎన్నికల్లో భారత అనుకూల ప్రభుత్వం మారిపోయి.. చైనా అనుకూల, భారత వ్యతిరేక ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అయితే అప్పటినుంచి భారత్, మాల్దీవుల మధ్య సత్సంబంధాలు తెగిపోయాయి. ఈ పరిస్థితుల్లో లక్షద్వీప్లో ప్రధాని మోడీ పర్యటనపై అభ్యంతరకమైన వ్యాఖ్యలు చేసారు మాల్దీవులకు చెందిన ఓ ఎంపీ. ఈ వ్యాఖ్యలతో మరింత దూరం పెరిగినట్లు అయ్యింది. ఎంపీ మాటలతో చాలామంది #BoycottMaldives అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. దీంతో అప్పటి నుండి భారతీయులు అటు వెళ్లడం తగ్గించేశారు. ఎంతలా అంటే..33 శాతం తగ్గిందని పర్యాటక మంత్రిత్వ శాఖ డేటా పేర్కొంది.
We’re now on WhatsApp. Click to Join.
గతేడాది మార్చి 4 నాటికి 41,054 మంది భారతీయ పర్యాటకులు మాల్దీవులను సందర్శించారు. అయితే, ఈ ఏడాది మార్చి 2 నాటికి ఇది 27,224కి తగ్గింది. అంటే ఏకంగా 13,830 మంది పర్యాటకులు తగ్గిపోయారు. గతేడాది మార్చి వరకు మాల్దీవులకు వెళ్లే పర్యాటకుల్లో 10 శాతం వాటాతో భారత్ రెండో అతిపెద్ద దేశంగా ఉండేది. అయితే, ఇప్పుడు భారత్ ఆరు శాతం మార్కెట్ వాటాతో ఆరో స్థానానికి పడిపోయింది. మాల్దీవులకు భారతీయ పర్యాటకుల సంఖ్య తగ్గినా, గత కొన్ని నెలల్లో చైనా పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరిగింది.
Read Also : KTR : కేటీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేయాలనీ సీఎం రేవంత్ డిమాండ్
Related News
Asaduddin Owaisi : కండోమ్స్ ఎక్కువగా ఉపయోగించేది ముస్లింలే – ఓవైసీ
ముస్లీంలు ఎక్కువ మంది పిల్లలను కంటారని ప్రజలకు ఎందుకు అబద్దం చెబుతున్నారు