Onions: ఫిలిప్పీన్స్లో కన్నీళ్ళు పెట్టిస్తున్న ఉల్లి ధర..!
ఉల్లి (Onion) చేసిన మేలు తల్లి కూడా చేయదంటారు. కానీ ఫిలిప్పీన్స్ ప్రజలు మాత్రం ఉల్లిపాయ పేరు చెబితే చాలు కన్నీరపెట్టుకున్నారు. ఎందుకంటారా..? రేటు ఆ రేంజ్లో ఉంది మరి. జస్ట్ వాసన చూసి కడుపు నింపుకోవాల్సిన పరిస్థితి.
- By Hashtag U Published Date - 11:56 AM, Wed - 1 March 23
ఉల్లి (Onion) చేసిన మేలు తల్లి కూడా చేయదంటారు. కానీ ఫిలిప్పీన్స్ ప్రజలు మాత్రం ఉల్లిపాయ పేరు చెబితే చాలు కన్నీరపెట్టుకున్నారు. ఎందుకంటారా..? రేటు ఆ రేంజ్లో ఉంది మరి. జస్ట్ వాసన చూసి కడుపు నింపుకోవాల్సిన పరిస్థితి. ఆగ్నేయాసియా దేశం ఫిలిప్పీన్స్లో ఉల్లి ధరలు ఘాటెక్కిస్తున్నాయి. అక్కడ కేజీ ఉల్లి 1200 రూపాయలు పలుకుతోంది. రాజధాని మనీలాలోని సూపర్ మార్కెట్లలో చికెన్, మటన్, పోర్క్ కంటే ఉల్లిపాయల ధరే ఎక్కువగా ఉంది. కొన్ని చోట్లయితే, ఒక్క పాయను 120 రూపాయలకు అమ్ముతున్న పరిస్థితి.
ఫిలిప్పీన్స్లో ద్రవ్యోల్బణం 14 ఏళ్ల గరిష్ఠానికి చేరిన నేపథ్యంలో నిత్యావసరాల ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఉల్లి ధరలైతే చెప్పాల్సిన పనే లేదు. డిసెంబర్లో కిలో 380 రూపాయలు ఉండగా.. ఇప్పుడు 1200కు చేరింది. దీంతో రెస్టారెంట్లు అనియన్ వాడకాన్ని తగ్గించేశాయి. సాధారణ ప్రజలైతే ఉల్లిపాయను దాదాపుగా దూరం పెడుతున్నారు. ఫిలిప్పీన్స్ ప్రజలు నెలకు 17వేలటన్నుల ఉల్లిపాయలు వినియోగిస్తున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. డిమాండ్కు తగినట్టు ఉల్లి సరఫరా ఉండేలా చూసేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది అక్కడి ప్రభుత్వం. విదేశాల నుంచి 22వేల టన్నుల ఉల్లి దిగుమతికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయినా రేటు దిగిరావడం లేదు.
Also Read: Australian Police: కాల్పులు జరిపి భారతీయుడిని చంపిన ఆస్ట్రేలియా పోలీసులు
ఇదే అదనుగా స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు. దొడ్డిదారిలో దేశంలోకి ఉల్లి దిగుమతి చేసి జనాన్ని అడ్డంగా దోచేస్తున్నారు. ఇటీవల మధ్య ఆసియా నుంచి వచ్చిన ఓ విమానం నుంచి పెద్దఎత్తున ఉల్లి బస్తాలు స్వాధీనం చేసుకున్నారు అధికారులు. ఉక్రెయిన్ రష్యా యుద్ధం ప్రపంచవ్యాప్తంగా ఆహారం, చమురు, ఎరువుల ధరలు విపరీతంగా పెరిగాయి. ఈ ఎఫెక్ట్ ఫిలిప్పీన్స్పైనా పడింది. మొదట్లో ఈ పరిస్థితిని కృత్రిమ కొరతగా కొట్టిపారేసింది అక్కడి ప్రభుత్వం. అది కాస్తా ఆహార సంక్షోభానికి దారితీసింది. ద్రవ్యోల్బణం పెరిగిపోయి.. నిత్యావసరాల ధరలు ఆకాశన్నంటాయి.
Tags
Related News
Goldy Brar: గోల్డీబ్రార్ బతికే ఉన్నాడు.. వెల్లడించిన అమెరికా పోలీసులు
పంజాబీ గాయకుడు సిద్ధూ మూస్వాలా హత్య కేసులో ప్రధాన నిందితుడు, గ్యాంగ్స్టర్ సతీవందర్ సింగ్ అలియాస్ గోల్డీ బ్రార్ (Goldy Brar) మృతి ఆరోపణలను అబద్ధమని అమెరికా పోలీసులు అభివర్ణించారు.