Imran Khan: ఇమ్రాన్ ఖాన్ సంచలన నిర్ణయం.. 33 స్థానాల్లో పోటీ.!
పాకిస్థాన్ మాజీ ప్రధాని, PTI పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) సంచలన నిర్ణయం తీసుకున్నారు. జాతీయ అసెంబ్లీలో ఖాళీ అయిన 33 స్థానాలకు మార్చి 16న ఉప ఎన్నికలు జరగనుండగా, అన్ని చోట్లా ఆయనే పోటీ చేయనున్నారు. ఆదివారం జరిగిన పీటీఐ కోర్ కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయించారు.
- By Gopichand Published Date - 12:11 PM, Tue - 31 January 23
పాకిస్థాన్ మాజీ ప్రధాని, PTI పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) సంచలన నిర్ణయం తీసుకున్నారు. జాతీయ అసెంబ్లీలో ఖాళీ అయిన 33 స్థానాలకు మార్చి 16న ఉప ఎన్నికలు జరగనుండగా, అన్ని చోట్లా ఆయనే పోటీ చేయనున్నారు. ఆదివారం జరిగిన పీటీఐ కోర్ కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయించారు. ముందస్తు ఎన్నికలకు అధికార కూటమిపై మరింత ఒత్తిడి పెంచేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.
మార్చిలో పాకిస్థాన్ లో 33 స్థానాలకు జరిగే ఉపఎన్నికల్లో పాకిస్థాన్ బహిష్కృత ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తన పార్టీ ఏకైక అభ్యర్థిగా బరిలోకి దిగనున్నారు. ఈ విషయాన్ని ఆయన పార్టీ ప్రకటించింది. పార్టీ కోర్ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పాకిస్థాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ (పీటీఐ) వైస్ చైర్మన్, మాజీ విదేశాంగ మంత్రి షా మెహమూద్ ఖురేషీ విలేకరుల సమావేశంలో తెలిపారు. మొత్తం 33 పార్లమెంటరీ స్థానాల్లో పీటీఐ అభ్యర్థిగా ఇమ్రాన్ ఖాన్ మాత్రమే ఉంటారని ఖురేషీ చెప్పారు.
Also Read: Canada: కెనడాలో హిందూ దేవాలయంపై దాడి.. ఖండించిన భారత కాన్సులేట్ కార్యాలయం
ఖాన్ అధ్యక్షతన లాహోర్లోని జమాన్ పార్క్లో ఇటీవల జరిగిన పార్టీ కోర్ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీలోని 33 స్థానాలకు మార్చి 16న ఉప ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం (ఈసీపీ) గత శుక్రవారం ప్రకటించింది. గత ఏడాది ఏప్రిల్లో అవిశ్వాస తీర్మానం తర్వాత అధికారం నుంచి దింపబడిన ఖాన్ పార్టీ ఎంపీలు పాకిస్థాన్ పార్లమెంట్ (నేషనల్ అసెంబ్లీ) దిగువ సభ నుంచి వెళ్లిపోయారు. అయితే, స్పీకర్ రాజా పర్వేజ్ అష్రఫ్ ఎంపీల రాజీనామాలను ఆమోదించలేదని, ఎంపీలు తమ ఇష్టానుసారం రాజీనామా చేస్తున్నారా లేదా ఒత్తిడితో రాజీనామా చేస్తున్నారా అనేది వ్యక్తిగతంగా ధృవీకరించాల్సిన అవసరం ఉందని అన్నారు. గత నెలలో 35 మంది PTI ఎంపీల రాజీనామాలను స్పీకర్ ఆమోదించారు. ఆ తర్వాత ECP వారిని డి-నోటిఫై చేసింది. గత ఏడాది అక్టోబర్లో 11 మంది పీటీఐ ఎంపీల రాజీనామాలను స్పీకర్ ఆమోదించడంతో ఖాన్ ఎనిమిది పార్లమెంట్ స్థానాలకు పోటీ చేసి ఆరింటిలో విజయం సాధించిన విషయం తెలిసిందే.
Related News
Viral : హనుమాన్ ఆలయాన్ని పబ్లిక్ టాయిలెట్గా మార్చేశారు ..
అన్యాయంగా హనుమాన్ టెంపుల్ని పబ్లిక్ టాయిలెట్గా మార్చేశారు