Nimisha Priya: నిమిషా ప్రియా కేసులో బిగ్ ట్విస్ట్.. మరణశిక్ష తప్పేలా లేదు, ఎందుకంటే?
నిమిషా ప్రియాకు బుధవారం (16 మే 2025) మరణశిక్ష జరగాల్సి ఉండగా సుదీర్ఘ చర్చల తర్వాత ఈ శిక్షను తాత్కాలికంగా నిలిపివేశారు.
- Author : Gopi
Date : 16-07-2025 - 3:30 IST
Published By : Hashtagu Telugu Desk
Nimisha Priya: నిమిషా ప్రియాకు (Nimisha Priya) యెమెన్లో మరణశిక్ష నుండి తాత్కాలిక ఉపశమనం లభించినప్పటికీ ఈ ఉపశమనం తాత్కాలికమే అని తెలుస్తోంది. బాధితుడైన తలాల్ అబ్దో మెహదీ సోదరుడు అబ్దెల్ఫత్తాహ్ మెహదీ బ్లడ్ మనీని స్వీకరించబోమని, ఈ నేరానికి ఎట్టి పరిస్థితుల్లో క్షమాపణ ఇవ్వలేమని ప్రకటించాడు. నిమిషా ప్రియాకు మరణశిక్షే అమలు చేయాలని అతను పట్టుబట్టాడు. భారతీయ మీడియాలో నిమిషాను బాధితురాలిగా చిత్రీకరించడంపై కూడా అబ్దెల్ఫత్తాహ్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశాడు.
నిమిషా ప్రియాకు బుధవారం (16 మే 2025) మరణశిక్ష జరగాల్సి ఉండగా సుదీర్ఘ చర్చల తర్వాత ఈ శిక్షను తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ ప్రక్రియలో భారత ప్రభుత్వం, సౌదీ అరేబియాలోని ఏజెన్సీలు, కంఠపురం ఏ.పీ. అబూబకర్ ముసలియార్ అనే గ్రాండ్ ముఫ్తీ మతపరమైన జోక్యం ఉన్నాయి. ముసలియార్ యెమెన్లోని షూరా కౌన్సిల్తో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. ఈ ప్రయత్నాల ఫలితంగా తదుపరి ఆదేశాల వరకు మరణశిక్షను నిలిపివేయాలని నిర్ణయించారు.
Also Read: ICC Test Rankings: ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్.. టాప్ బ్యాట్స్మెన్ ఎవరో తెలుసా?
తలాల్ కుటుంబం బ్లడ్ మనీని తిరస్కరించింది
మరణశిక్షను నిలిపివేస్తూ నిమిషా ప్రియా కుటుంబానికి తలాల్ కుటుంబాన్ని బ్లడ్ మనీ కోసం ఒప్పించడానికి సమయం ఇవ్వబడుతుందని వార్తలు వచ్చాయి. అయితే, ఇది చాలా కష్టమైన పనిగా కనిపిస్తోంది. తలాల్ సోదరుడు అబ్దెల్ఫత్తాహ్ మెహదీ, తమ కుటుంబం అన్ని రాయితీ ప్రతిపాదనలను తిరస్కరించినట్లు తెలిపాడు. తమ సోదరుడి హంతకురాలికి మరణశిక్షే విధించాలని వారు కోరుకుంటున్నారు. క్షమాపణ ప్రసక్తే లేదని, ఈ నేరం అత్యంత ఘోరమైనదని అతను పేర్కొన్నాడు.
“అల్లాహ్ మాతో ఉన్నాడు”: అబ్దెల్ఫత్తాహ్ మెహదీ
అబ్దెల్ఫత్తాహ్ మెహదీ గట్టి స్వరంతో శిక్షను నిలిపివేయడం వల్ల తాము వెనక్కి తగ్గబోమని, న్యాయం జరగాల్సిందేనని, అది కొంత సమయం పట్టినా సరేనని, అల్లాహ్ తమ వెంట ఉన్నాడని అన్నాడు. సోమవారం కూడా అబ్దెల్ఫత్తాహ్ బీబీసీ అరబిక్ సర్వీస్తో మాట్లాడుతూ ఇదే విషయాన్ని పునరుద్ఘాటించాడు. సోషల్ మీడియాలో ఒక పోస్ట్ను కూడా షేర్ చేశాడు.