Imran Khan Wife Bushra Bibi: మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ భార్య బుష్రా బీబీకి 14 ఏళ్ల జైలు శిక్ష..!
తోషాఖాన్ కేసులో పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ భార్య బుష్రా బీబీ (Imran Khan Wife Bushra Bibi)కి 14 ఏళ్ల జైలు శిక్ష పడింది. ఇమ్రాన్, అతని భార్యపై రూ.23 కోట్లకు పైగా జరిమానా కూడా విధించారు.
- By Gopichand Published Date - 12:05 PM, Wed - 31 January 24
Imran Khan Wife Bushra Bibi: తోషాఖాన్ కేసులో పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ భార్య బుష్రా బీబీ (Imran Khan Wife Bushra Bibi)కి 14 ఏళ్ల జైలు శిక్ష పడింది. ఇమ్రాన్, అతని భార్యపై రూ.23 కోట్లకు పైగా జరిమానా కూడా విధించారు. ఫిబ్రవరి 8న పాకిస్థాన్లో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు 8 రోజుల ముందు మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు రెండోసారి శిక్ష పడింది. తోషాఖానా రిఫరెన్స్ కేసులో ఖాన్, అతని భార్య బుష్రా బీబీకి 14 సంవత్సరాల జైలు శిక్ష విధించారు.
దీని తరువాత ఇమ్రాన్ ఖాన్ ఓ 10 సంవత్సరాల వరకు ఏ ప్రభుత్వ పదవిని నిర్వహించలేరు. ఈ నిర్ణయం ప్రకారం ఇద్దరిపై రూ.23.37 కోట్లకు పైగా జరిమానా కూడా విధించారు. అంతకుముందు అంటే మంగళవారం రావల్పిండి ప్రత్యేక కోర్టు రహస్య లేఖల దొంగతనం కేసులో ఖాన్కు 10 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. అతనితో పాటు పాకిస్థాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ పార్టీ (పీటీఐ) నాయకుడు, మాజీ విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషీకి కూడా శిక్ష పడింది.
సౌదీ క్రౌన్ ప్రిన్స్ నుంచి తనకు బహుమతిగా వచ్చిన నెక్లెస్ ను బుష్రా బీబీ విక్రయించింది. గత నెలలో పాకిస్తాన్ నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో (NAB) ఖాన్, బుష్రా బీబీలపై తోషాఖానాకు సంబంధించిన కేసు నమోదు చేసింది. ఇందులో సౌదీ యువరాజు నుంచి బహుమతిగా వచ్చిన నెక్లెస్ను వారిద్దరూ అమ్ముకున్నారని ఆరోపించారు. దీనిపై విచారణ జరిపిన అకౌంటబిలిటీ కోర్టు బుధవారం శిక్షను ఖరారు చేసింది.
Also Read: I Hate You: యూత్కు నచ్చేలా కార్తీక్ రాజు ‘ఐ హేట్ యు’ ట్రైలర్.. ఫిబ్రవరి 2న సినిమా విడుదల
పాకిస్థానీ జర్నలిస్ట్ అలియా షా ప్రకారం.. పాకిస్తాన్లో ప్రధాన మంత్రి, అధ్యక్షుడు లేదా ఇతర పదవులలో ఉన్న వ్యక్తులు అందుకున్న బహుమతుల గురించి సమాచారాన్ని నేషనల్ ఆర్కైవ్స్కు అందించాలి. వీటిని తోషఖానాలో జమ చేయాల్సి ఉంటుంది. బహుమతి విలువ 10 వేల పాకిస్థానీ రూపాయలు అయితే, సంబంధిత వ్యక్తి డబ్బు చెల్లించకుండా దానిని ఉంచుకోవచ్చు. ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఇమ్రాన్ ఖాన్ సౌదీ యువరాజు నుండి వజ్రాల హారాన్ని బహుమతిగా అందుకున్నారు. దీని ధర 18 కోట్ల పాకిస్తానీ రూపాయలు. దీనిని లాహోర్లోని ప్రముఖ నగల వ్యాపారికి విక్రయించారు. ఇమ్రాన్ భార్య బుష్రా బీబీ ఈ నెక్లెస్ను మంత్రి జుల్ఫీ బుఖారీ ద్వారా విక్రయించారు.
We’re now on WhatsApp : Click to Join
తోషఖానా (ట్రెజరీ) నిబంధనల ప్రకారం.. ఇమ్రాన్ ఈ నెక్లెస్ను డిపాజిట్ చేయాల్సి వచ్చింది. కానీ బుష్రా అందుకు నిరాకరించాడు. ఈ కేసు విచారణ 2022లో ప్రారంభమైంది. ఇందుకోసం జ్యువెలరీ షోరూం యజమాని, మేనేజర్ను కూడా విచారించారు. ఈ క్రమంలో నెక్లెస్ను విక్రయించిన సమయానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ కూడా లభ్యమైంది. ఆ తర్వాత నెక్లెస్ రికవరీ చేసి తోషాఖానాలో జమ చేశారు.
ఇది కాకుండా ఖాన్పై 14 కేసులు ఉన్నాయి. వాటిలో అతని అరెస్టు ఖాయమని భావిస్తున్నారు. ఇందులో 9 మే 2022న సైనిక స్థావరాలపై దాడి కేసు కూడా ఉంది. దీని విచారణ సైనిక కోర్టులో జరగనుంది. అంతే కాకుండా యూనివర్శిటీ కోసం ఉచితంగా భూమి తీసుకున్న ఉందతం ఉంది. చాలా కేసుల్లో చార్జిషీట్ కూడా దాఖలు కాలేదు.
Related News
India vs Pakistan: ఇండియా వర్సెస్ పాకిస్థాన్.. సోషల్ మీడియాలో ప్రోమో వీడియో వైరల్..!
T20 వరల్డ్ కప్ 2024.. IPL 2024 ఫైనల్ తర్వాత ప్రారంభమవుతుంది. అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా నిర్వహించనున్న ఈ టోర్నీ జూన్ 2 నుంచి ప్రారంభం కానుంది.